HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Raghul Gandhi Will Visit To Vizag Soon

వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు రాహుల్ మద్దతు

త్వరలోనే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తారని, ఉక్కు ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా వైజాగ్ ను సందర్శిస్తారని మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలపై చింతా మోహన్ మీడియాతో మాట్లాడారు.

  • Author : Balu J Date : 07-10-2021 - 2:05 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt

త్వరలోనే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తారని, ఉక్కు ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా వైజాగ్ ను సందర్శిస్తారని మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలపై చింతా మోహన్ మీడియాతో మాట్లాడారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ స్టీల్ ప్లాంట్ కు రాహుల్ గాంధీ ఇప్పటికే తన మద్దతును అందించారని ఆయన అన్నారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ప్రైవేట్ కంపెనీలను జాతీయం చేశారని, కానీ ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ వాటిని కార్పొరేట్ కంపెనీలకు విక్రయిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మేం ఉక్కు కర్మాగారాన్ని నిర్వహిస్తామని, కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు వ్యతిరేకించే స్థితిలో లేదని ఆయన ఆరోపించారు.

రాష్ర్ట సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ఒకవైపు నిధులు మంజూరు చేస్తుంటే.. మరోవైపు జగన్ ప్రభుత్వం ఇతర అవసరాలకు వాడుకుంటుందని విమర్శించారు. రెండేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ మెంట్ స్కాలర్‌షిప్‌లను చెల్లించలేదని. వచ్చేనెలా  1 లోపు విద్యార్థుల ఖాతాల్లో నిధులను జమ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 2004లో కాంగ్రెస్ అధిష్ఠానం ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా రాజశేఖర్ రెడ్డిని నియమించి తప్పు చేసిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. నాడు రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉండటం వల్లే జగన్ నేడు ముఖ్యమంత్రి అయ్యాడని అన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేక సమస్యలను ఎదుర్కొంటుందని, కాంగ్రెస్ తోనే ఏపీ కి పూర్వవైభవం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలోనే ఏపీ కాంగ్రెస్ కు నూతన అధ్యక్షుడ్ని ఎన్నుకుంటామని, వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీయే ప్రధాని అవుతారని చింతా మోహన్ అన్నారు.

కాంగ్రెస్ వ్యవహారాలపై రాహుల్ కీలక మంతనాలు చేస్తున్నారు. త్వరలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు రాహుల్ గాంధీ. ఆగస్టు 10వ తేదీన ఢిల్లీకి రావాలని కొంతమంది సీనియర్ నేతలకు కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం పిలుపు ఇచ్చింది. ఏపీలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి పై చర్చించనున్నారు రాహుల్. ఏపీ రాష్ట్రానికి చెందిన కొద్దిమంది సీనియర్ నాయకులతో విడివిడిగా, ముఖాముఖి సమాలోచనలు జరపనున్నారు రాహుల్ గాంధీ. కాంగ్రెస్ పార్టీని ఏపిలో బలోపేతం చేసేందుకు రాష్ట్ర నేతల ఆలోచనలు, అభిప్రాయాలను నేరుగా తెలుసుకోనున్నారు. ఏపీలో కాంగ్రెస్ ప్రభావం తగ్గుతుండటంతో రాహుల్ గాంధీ ప్రత్యేకంగా ఫోకస్ చేయనున్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు డా. చింతా మోహన్, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి మాజీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి జే.డి. శీలం, మాజీ ఎమ్.పి డా. కే. వి. పి. రామచంద్ర రావు, ఏఐసిసి సెక్రటరీ గిడుగు రుద్రరాజు లాంటి నేతలతో  కాంగ్రెస్ అధిష్ఠానం చర్చలు జరుపుతోంది. ఏపీ కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిని నియమించాలనే యోచనలో అధిష్ఠానం ఉన్నట్లు తెలుస్తోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • chinta mohan
  • comments
  • congress
  • politics
  • rahul gandhi
  • steel plant
  • vizag

Related News

Discussions In Telangana Congress On Rajya Sabha Vacancies

రాజ్యసభ ఖాళీలపై కాంగ్రెస్‌లో చర్చలు .. తెలంగాణ నుంచి సభకు వెళ్లేదెవరు ?

ఈ రెండు ఖాళీలకు సంబంధించిన నామినేషన్లు మార్చి 5లోపు దాఖలు చేయాల్సి ఉండటంతో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అభ్యర్థుల ఎంపికపై పార్టీ అధిష్టానం కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం.

  • Konidela Village

    కొణెదల పేరుతో గ్రామం..రూ.6 కోట్లను మంజూరు చేసిన పవన్ కళ్యాణ్

  • Nara Lokesh Blackbuck

    Job Calendar : ఉగాదికి జాబ్ క్యాలెండర్ – మంత్రి లోకేశ్

  • Rowdy Sheeter Rapes A Minor

    మదనపల్లె హత్యాచార ఘటన మరవకముందే మరో దారుణం !!

  • Earthquake In Ap

    Earthquake in AP : ఏపీలో భూకంపం

Latest News

  • బంగారం, వెండి ధరల పై నిర్మలా సీతారామన్ ఆసక్తికర వ్యాఖ్యలు

  • అల్లు శిరీష్ వివాహ వేడుకలు.. పవన్ కళ్యాణ్ దంపతులకు ఆహ్వానం!

  • కల్తీ పాల ఘటన .. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు : సీఎం చంద్రబాబు

  • మార్చి 3న భారత్‌లో ‘బ్లడ్ మూన్’!

  • 27 ఏళ్ల తర్వాత రేపే తొలిసారి .. కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో జాతీయ సదస్సు

Trending News

    • ఆకాశాన్నంటుతున్న బంగారం, వెండి ధరలు!

    • సౌతాఫ్రికాతో మ్యాచ్‌.. బుమ్రా స‌రికొత్త రికార్డు!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. సెమీఫైనల్, ఫైనల్ వేదికలపై ఇంకా వీడని సందిగ్ధత!

    • ఎల్లుండి నుంచి విజ‌య్ దేవ‌ర‌కొండ‌- ర‌ష్మిక ప్రీ-వెడ్డింగ్ ఫంక్షన్లు!!

    • గరిష్ట స్థాయి నుండి చౌకగా మారిన వెండి ధర! ఎంతంటే?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd