HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Andhra Pradesh
  • >Pemmasani Is A Key Demand For Ap Farmers

Pemmasani: ఏపీ రైతుల కోసం పెమ్మసాని కీల‌క డిమాండ్‌!

గుంటూరులో ఆసియాలోని అతిపెద్ద మిర్చి మార్కెట్ ఉందని, ఇది పరిశోధనలు ప్రోత్సహించడానికి కేంద్రంగా మారుతుందని వివరించారు. మిర్చి బోర్డు ఏర్పాటు ద్వారా చీడపీడల నివారణ, ఎగుమతి సౌకర్యాలు, ఆధునిక ప్రాసెసింగ్ వంటి కీలక రంగాలపై ప్రత్యేక దృష్టి సారించే అవకాశం ఉందన్నారు.

  • By Gopichand Published Date - 12:01 AM, Wed - 11 December 24
  • daily-hunt
Pemmasani
Pemmasani

Pemmasani: మిర్చి రైతుల క‌ల్లాల‌ను చూసి చలించిన కేంద్ర సహాయ మంత్రి చంద్రశేఖర్ పెమ్మసాని (Pemmasani) అన్నదాతలకు వెన్నుదన్నుగా నిలిచేందుకు నడుం బిగించారు. స్పైసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియాలో మిర్చి విభాగం ఏర్పాటు చేయాలని, కనీస మద్దతు ధర కల్పించాలని సంబంధిత శాఖల కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, శివరాజ్ సింగ్ చౌహాన్ కు లేఖ రాశారు. గుంటూరు జిల్లాలోని మిర్చి రైతులు తీవ్ర సవాళ్ళు ఎదుర్కొంటున్నారని, అధిక భాగం దిగుబడి కోల్డ్ స్టోరేజీల్లో ఉండటంతో మార్కెట్ ధరలు గిట్టుబాటు కావడం లేదని వివరించారు. పెరుగుతున్న పెట్టుబడులు, చీడపీడల బెడద, మార్కెటింగ్ మౌలిక సదుపాయాలు లేకపోవడంతో మిర్చి రైతుల జీవనోపాధి అగమ్య గోచరంగా మారిందని పేర్కొన్నారు. మిర్చి డివిజన్ ఏర్పాటు చేయడం ద్వారా ఈ సమస్యలకు పరిష్కారం చూపగలుగుతామని అభిప్రాయపడ్డారు.

గుంటూరులో ఆసియాలోని అతిపెద్ద మిర్చి మార్కెట్ ఉందని, ఇది పరిశోధనలు ప్రోత్సహించడానికి కేంద్రంగా మారుతుందని వివరించారు. మిర్చి బోర్డు ఏర్పాటు ద్వారా చీడపీడల నివారణ, ఎగుమతి సౌకర్యాలు, ఆధునిక ప్రాసెసింగ్ వంటి కీలక రంగాలపై ప్రత్యేక దృష్టి సారించే అవకాశం ఉందన్నారు. గుంటూరు సన్నం, తేజ వంటి అధిక విలువ కలిగిన వంగడాలను ప్రోత్సహించడానికి అంతర్జాతీయ నాణ్యత ప్రమాణాలు కలిగిన దిగుబడులు సాధించేందుకు దోహదం చేస్తుందని వివరించారు. భారత దేశ మిర్చి రంగం ఆర్థిక వ్యవస్థకు కీలకమని, సుగంధ ద్రవ్యాల ఎగుమతుల్లో మిర్చి వాటా 34 శాతం, 2023 24 సంవత్సరంలో రికార్డు స్థాయిలో 1.5 బిలియన్ డాలర్లకు ఇది చేరుకుందని పేర్కొన్నారు.

Also Read: Manoj Sympathy: మంచు ఫ్యామిలీలో మంట‌లు.. మ‌నోజ్‌కు పెరుగుతున్న సానుభూతి!

కనీస మద్దతు ధర కల్పించాలి

ప్రపంచ మిర్చి ఉత్పత్తిలో భారతదేశం 40 శాతం వాటా కలిగి ఉందని, పది లక్షల మంది రైతులు మిర్చి పంటల సాగు చేస్తున్నారని, 20 లక్షల మందికి వ్యవసాయ కార్మికులు జీవనోపాధి కలిగి ఉన్నారని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు. మిర్చి ఎకరా సాగు సగటు వ్యయం 2.50 లక్షలకు చేరిందని, 2022 23 ఆర్థిక సంవత్సరం నుంచి మిర్చి ధరలు 50 శాతం పడిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని, వెంటనే కనీస మద్దతు ధర కల్పించి ఆదుకోవాలని విన్నవించారు. కౌలు రైతులు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస మద్దతు ధర కల్పించడం ద్వారా దళారుల దోపిడీ నుంచి రైతులను రక్షించవచ్చని, మిర్చి రైతులకు ఆర్థిక సుస్థిరత అందించవచ్చని అభిప్రాయపడ్డారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhrapradesh
  • AP Farmers
  • Chandra Sekhar Pemmasani
  • CM Chandrababu
  • Mirchi Farmers
  • Pemmasani Letter
  • union ministers

Related News

YS Jagan

YS Jagan: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై మాజీ ముఖ్యమంత్రి జగన్ తీవ్ర విమర్శలు

ఆరోగ్యశ్రీని ప్రైవేటు బీమా కంపెనీలకు అప్పగించడంపై జగన్ సందేహాలు వ్యక్తం చేశారు. ఇది లాభాలు ఆశించి పనిచేసే ప్రైవేటు కంపెనీలకు ప్రజల సొమ్ము దోచిపెట్టడానికేనని ఆరోపించారు.

  • AP Assembly monsoon session to begin from 18th of this month

    AP Assembly : ఈ నెల 18 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు

  • People have immense faith in the judicial system: CM Chandrababu

    Visakhapatnam : న్యాయ వ్యవస్థపై ప్రజలకు అపారమైన నమ్మకం ఉంది : సీఎం చంద్రబాబు

  • CM Chandrababu

    Good News: గుడ్ న్యూస్ చెప్పిన కూట‌మి ప్ర‌భుత్వం.. మ‌రో హామీ అమ‌లు!

  • Kuppam

    Kuppam: కుప్పం.. ఇక దేశానికే రోల్‌మోడల్‌!

Latest News

  • Ghaati : అనుష్క ‘ఘాటి’కి షాకింగ్ కలెక్షన్స్!

  • India – US : దిగొచ్చిన ట్రంప్..ఇక భారత్-అమెరికా వైరం ముగిసినట్లేనా?

  • Shreyas Iyer: ఆసియా క‌ప్‌కు ముందు టీమిండియా కెప్టెన్‌గా అయ్య‌ర్‌!

  • Canada : ఖలిస్థానీ ఉగ్రవాదులకు కెనడా నుంచే నిధుల సరఫరా: కెనడా నివేదికలో వెల్లడి..!

  • ‘Mahindra’ Bumper offer : కార్లు కొనే వారికి ‘మహీంద్రా’ బంపరాఫర్

Trending News

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd