HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Pemmasani Is A Key Demand For Ap Farmers

Pemmasani: ఏపీ రైతుల కోసం పెమ్మసాని కీల‌క డిమాండ్‌!

గుంటూరులో ఆసియాలోని అతిపెద్ద మిర్చి మార్కెట్ ఉందని, ఇది పరిశోధనలు ప్రోత్సహించడానికి కేంద్రంగా మారుతుందని వివరించారు. మిర్చి బోర్డు ఏర్పాటు ద్వారా చీడపీడల నివారణ, ఎగుమతి సౌకర్యాలు, ఆధునిక ప్రాసెసింగ్ వంటి కీలక రంగాలపై ప్రత్యేక దృష్టి సారించే అవకాశం ఉందన్నారు.

  • Author : Gopichand Date : 11-12-2024 - 12:01 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pemmasani
Pemmasani

Pemmasani: మిర్చి రైతుల క‌ల్లాల‌ను చూసి చలించిన కేంద్ర సహాయ మంత్రి చంద్రశేఖర్ పెమ్మసాని (Pemmasani) అన్నదాతలకు వెన్నుదన్నుగా నిలిచేందుకు నడుం బిగించారు. స్పైసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియాలో మిర్చి విభాగం ఏర్పాటు చేయాలని, కనీస మద్దతు ధర కల్పించాలని సంబంధిత శాఖల కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, శివరాజ్ సింగ్ చౌహాన్ కు లేఖ రాశారు. గుంటూరు జిల్లాలోని మిర్చి రైతులు తీవ్ర సవాళ్ళు ఎదుర్కొంటున్నారని, అధిక భాగం దిగుబడి కోల్డ్ స్టోరేజీల్లో ఉండటంతో మార్కెట్ ధరలు గిట్టుబాటు కావడం లేదని వివరించారు. పెరుగుతున్న పెట్టుబడులు, చీడపీడల బెడద, మార్కెటింగ్ మౌలిక సదుపాయాలు లేకపోవడంతో మిర్చి రైతుల జీవనోపాధి అగమ్య గోచరంగా మారిందని పేర్కొన్నారు. మిర్చి డివిజన్ ఏర్పాటు చేయడం ద్వారా ఈ సమస్యలకు పరిష్కారం చూపగలుగుతామని అభిప్రాయపడ్డారు.

గుంటూరులో ఆసియాలోని అతిపెద్ద మిర్చి మార్కెట్ ఉందని, ఇది పరిశోధనలు ప్రోత్సహించడానికి కేంద్రంగా మారుతుందని వివరించారు. మిర్చి బోర్డు ఏర్పాటు ద్వారా చీడపీడల నివారణ, ఎగుమతి సౌకర్యాలు, ఆధునిక ప్రాసెసింగ్ వంటి కీలక రంగాలపై ప్రత్యేక దృష్టి సారించే అవకాశం ఉందన్నారు. గుంటూరు సన్నం, తేజ వంటి అధిక విలువ కలిగిన వంగడాలను ప్రోత్సహించడానికి అంతర్జాతీయ నాణ్యత ప్రమాణాలు కలిగిన దిగుబడులు సాధించేందుకు దోహదం చేస్తుందని వివరించారు. భారత దేశ మిర్చి రంగం ఆర్థిక వ్యవస్థకు కీలకమని, సుగంధ ద్రవ్యాల ఎగుమతుల్లో మిర్చి వాటా 34 శాతం, 2023 24 సంవత్సరంలో రికార్డు స్థాయిలో 1.5 బిలియన్ డాలర్లకు ఇది చేరుకుందని పేర్కొన్నారు.

Also Read: Manoj Sympathy: మంచు ఫ్యామిలీలో మంట‌లు.. మ‌నోజ్‌కు పెరుగుతున్న సానుభూతి!

కనీస మద్దతు ధర కల్పించాలి

ప్రపంచ మిర్చి ఉత్పత్తిలో భారతదేశం 40 శాతం వాటా కలిగి ఉందని, పది లక్షల మంది రైతులు మిర్చి పంటల సాగు చేస్తున్నారని, 20 లక్షల మందికి వ్యవసాయ కార్మికులు జీవనోపాధి కలిగి ఉన్నారని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు. మిర్చి ఎకరా సాగు సగటు వ్యయం 2.50 లక్షలకు చేరిందని, 2022 23 ఆర్థిక సంవత్సరం నుంచి మిర్చి ధరలు 50 శాతం పడిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని, వెంటనే కనీస మద్దతు ధర కల్పించి ఆదుకోవాలని విన్నవించారు. కౌలు రైతులు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస మద్దతు ధర కల్పించడం ద్వారా దళారుల దోపిడీ నుంచి రైతులను రక్షించవచ్చని, మిర్చి రైతులకు ఆర్థిక సుస్థిరత అందించవచ్చని అభిప్రాయపడ్డారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhrapradesh
  • AP Farmers
  • Chandra Sekhar Pemmasani
  • CM Chandrababu
  • Mirchi Farmers
  • Pemmasani Letter
  • union ministers

Related News

Tdp Announces District Pres

జిల్లాల అధ్యక్షులను ప్రకటించిన టీడీపీ

25 లోక్ సభ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షులతో పాటు ప్రధాన కార్యదర్శులను అధిష్టానం నియమించింది. జిల్లా అధ్యక్షుల్లో బీసీ వర్గానికి చెందిన వారు 8 మంది, మైనార్టీ నుంచి ఒకరు, ఓసీ నుంచి 11 మంది, ఎస్సీ నుంచి నలుగురు, ఎస్టీ నుంచి ఒకరు ఉన్నారు

  • Sanatana Dharma

    దేశ వ్యాప్తంగా సనాతన ధర్మ ప్రచారానికి టీటీడీ కీలక నిర్ణయం

  • Ttd

    ఈ విశ్వంలో అసలైన సౌందర్యం…నిజమైన వైభవం అంటే అది వేంకటేశ్వరస్వామి వారిదే ..

  • Satya Kumar Dares Jagan

    జ‌గ‌న్‌కు మంత్రి స‌వాల్‌.. పీపీపీ మోడల్ అక్రమమైతే జైలుకు పంపాల‌ని!

  • CM Chandrababu Naidu gets ‘Business Reformer of the Year’ award: Minister Lokesh tweets

    సీఎం చంద్రబాబుకు ‘బిజినెస్‌ రిఫార్మర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డు : మంత్రి లోకేశ్‌ ట్వీట్‌

Latest News

  • ట్రైన్ టికెట్ చార్జీల పెంపుపై ప్రయాణికులు ఆగ్రహం, ఏం సౌకర్యాలు కల్పించారని ఛార్జీల పెంపు?

  • నిజమైన సంతోషం ఎక్కడ ఉంది? హార్వర్డ్ అధ్యయనం చెప్పే నగ్న సత్యాలు

  • వాట్సాప్ లో కొత్త మోసం జాగ్రత్తగా ఉండకపోతే అంతే సంగతి !

  • టీమిండియాకు బిగ్ షాక్‌.. డ‌బ్ల్యూటీసీలో ఆరో స్థానానికి ప‌డిపోయిన భార‌త్‌!

  • రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. డిసెంబర్ 26 నుండి పెరగనున్న ఛార్జీలు!

Trending News

    • క్రెడిట్ కార్డ్ బిజినెస్.. బ్యాంకులు ఎందుకు అంతగా ఆఫర్లు ఇస్తాయి? అసలు లాభం ఎవరికి?

    • 2026 బడ్జెట్.. ఫిబ్రవరి 1 ఆదివారం.. అయినా బడ్జెట్ అప్పుడేనా?

    • అభిషేక్ శర్మ రికార్డు బద్దలు కొట్టిన పాండ్యా!

    • 10 గ్రాముల బంగారం ధర రూ. 40 ల‌క్ష‌లా?!

    • ఆ కార్యక్రమంలో అవినీతి.. ప్రధాని మోదీపై జగన్ ఆరోపణలు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd