HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Pemmasani Is A Key Demand For Ap Farmers

Pemmasani: ఏపీ రైతుల కోసం పెమ్మసాని కీల‌క డిమాండ్‌!

గుంటూరులో ఆసియాలోని అతిపెద్ద మిర్చి మార్కెట్ ఉందని, ఇది పరిశోధనలు ప్రోత్సహించడానికి కేంద్రంగా మారుతుందని వివరించారు. మిర్చి బోర్డు ఏర్పాటు ద్వారా చీడపీడల నివారణ, ఎగుమతి సౌకర్యాలు, ఆధునిక ప్రాసెసింగ్ వంటి కీలక రంగాలపై ప్రత్యేక దృష్టి సారించే అవకాశం ఉందన్నారు.

  • Author : Gopichand Date : 11-12-2024 - 12:01 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pemmasani
Pemmasani

Pemmasani: మిర్చి రైతుల క‌ల్లాల‌ను చూసి చలించిన కేంద్ర సహాయ మంత్రి చంద్రశేఖర్ పెమ్మసాని (Pemmasani) అన్నదాతలకు వెన్నుదన్నుగా నిలిచేందుకు నడుం బిగించారు. స్పైసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియాలో మిర్చి విభాగం ఏర్పాటు చేయాలని, కనీస మద్దతు ధర కల్పించాలని సంబంధిత శాఖల కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, శివరాజ్ సింగ్ చౌహాన్ కు లేఖ రాశారు. గుంటూరు జిల్లాలోని మిర్చి రైతులు తీవ్ర సవాళ్ళు ఎదుర్కొంటున్నారని, అధిక భాగం దిగుబడి కోల్డ్ స్టోరేజీల్లో ఉండటంతో మార్కెట్ ధరలు గిట్టుబాటు కావడం లేదని వివరించారు. పెరుగుతున్న పెట్టుబడులు, చీడపీడల బెడద, మార్కెటింగ్ మౌలిక సదుపాయాలు లేకపోవడంతో మిర్చి రైతుల జీవనోపాధి అగమ్య గోచరంగా మారిందని పేర్కొన్నారు. మిర్చి డివిజన్ ఏర్పాటు చేయడం ద్వారా ఈ సమస్యలకు పరిష్కారం చూపగలుగుతామని అభిప్రాయపడ్డారు.

గుంటూరులో ఆసియాలోని అతిపెద్ద మిర్చి మార్కెట్ ఉందని, ఇది పరిశోధనలు ప్రోత్సహించడానికి కేంద్రంగా మారుతుందని వివరించారు. మిర్చి బోర్డు ఏర్పాటు ద్వారా చీడపీడల నివారణ, ఎగుమతి సౌకర్యాలు, ఆధునిక ప్రాసెసింగ్ వంటి కీలక రంగాలపై ప్రత్యేక దృష్టి సారించే అవకాశం ఉందన్నారు. గుంటూరు సన్నం, తేజ వంటి అధిక విలువ కలిగిన వంగడాలను ప్రోత్సహించడానికి అంతర్జాతీయ నాణ్యత ప్రమాణాలు కలిగిన దిగుబడులు సాధించేందుకు దోహదం చేస్తుందని వివరించారు. భారత దేశ మిర్చి రంగం ఆర్థిక వ్యవస్థకు కీలకమని, సుగంధ ద్రవ్యాల ఎగుమతుల్లో మిర్చి వాటా 34 శాతం, 2023 24 సంవత్సరంలో రికార్డు స్థాయిలో 1.5 బిలియన్ డాలర్లకు ఇది చేరుకుందని పేర్కొన్నారు.

Also Read: Manoj Sympathy: మంచు ఫ్యామిలీలో మంట‌లు.. మ‌నోజ్‌కు పెరుగుతున్న సానుభూతి!

కనీస మద్దతు ధర కల్పించాలి

ప్రపంచ మిర్చి ఉత్పత్తిలో భారతదేశం 40 శాతం వాటా కలిగి ఉందని, పది లక్షల మంది రైతులు మిర్చి పంటల సాగు చేస్తున్నారని, 20 లక్షల మందికి వ్యవసాయ కార్మికులు జీవనోపాధి కలిగి ఉన్నారని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు. మిర్చి ఎకరా సాగు సగటు వ్యయం 2.50 లక్షలకు చేరిందని, 2022 23 ఆర్థిక సంవత్సరం నుంచి మిర్చి ధరలు 50 శాతం పడిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని, వెంటనే కనీస మద్దతు ధర కల్పించి ఆదుకోవాలని విన్నవించారు. కౌలు రైతులు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస మద్దతు ధర కల్పించడం ద్వారా దళారుల దోపిడీ నుంచి రైతులను రక్షించవచ్చని, మిర్చి రైతులకు ఆర్థిక సుస్థిరత అందించవచ్చని అభిప్రాయపడ్డారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhrapradesh
  • AP Farmers
  • Chandra Sekhar Pemmasani
  • CM Chandrababu
  • Mirchi Farmers
  • Pemmasani Letter
  • union ministers

Related News

Tomato Prices Rise

భారీగా పడిపోయాయి టమాటా ధరలు

Tomato Prices ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి టమాటా ధరలు భారీగా పడిపోయాయి. పంటను మార్కెట్‌లకు తీసుకొచ్చిన రైతులు ధరలు పతనం కావడంతో ఆందోళనలో ఉన్నారు. కనీసం కోత, రవాణా ఖర్చులకు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది రైతులు టమాటా కోతను వాయిదా వేశారు. రాష్ట్రంలోని మార్కెట్‌లలో మరీ దారుణంగా కేజీ టమాటా ధర రూ.5 నుంచి రూ.10లోపే ఉందని చెబుతున్నారు రైతులు. చాయ్ కంటే చీప్.. కేజీ రూ.10లో

  • Chandrababu

    iGOT కర్మయోగి పోర్టల్‌లో ఆంధ్రప్రదేశ్‌ సరికొత్త జాతీయ రికార్డు సృష్టించింది: సీఎం చంద్రబాబు

  • Shivam Dube

    వైజాగ్ లో దూబే తాండవం 6 సిక్స్‌లు, 2 ఫోర్లతో ఊచకోత

  • Ap Sanjeevani Scheme

    త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ‘సంజీవని’ – సీఎం చంద్రబాబు

  • Yarraji Jyoti

    యర్రాజీ జ్యోతికి గ్రూప్-1 ఉద్యోగం, ఇంటి స్థలం.. అండగా నిలిచిన మంత్రి లోకేష్

Latest News

  • క్రికెట్ ప్ర‌పంచంలో విషాదం.. మాజీ క్రికెట‌ర్ మృతి!

  • మ‌రోసారి ధ‌నుష్‌తో జ‌త క‌ట్ట‌నున్న సాయి ప‌ల్ల‌వి!

  • అతిగా మ‌సాలా ఫుడ్ తింటున్నారా?

  • ప్ర‌ధాని మోదీతో ఫోన్‌లో మాట్లాడిన ట్రంప్‌!

  • టీ20 వరల్డ్ కప్‌.. భారత్-పాక్ మ్యాచ్ జ‌ర‌గ‌కుంటే రూ. 4,500 కోట్ల న‌ష్టం?!

Trending News

    • వెండి ధరలు ఎందుకు తగ్గుతున్నాయి?

    • పాకిస్థాన్‌పై ఐసీసీ క‌ఠిన చ‌ర్య‌లు?!

    • పీఎఫ్ ఖాతాదారుల‌కు మ‌రో శుభ‌వార్త‌..!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. టీమ్ ఇండియా, ఇండియా A వార్మప్ మ్యాచ్‌ల వివరాలు

    • మహిళలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd