Andhra Pradesh
-
AP Electricity Charges: విద్యుత్ చార్జీలపై ఏపీ మంత్రి గొట్టిపాటి రవి కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) గత పాలనలో ప్రజలపై పడిన విద్యుత్ భారానికి స్వస్తి పలుకుతూ ప్రస్తుత కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో ఏకంగా తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలను పెంచి సామాన్యుడి నడుం విరిచారని, అయితే తాము అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ రంగాన్ని గాడిన పెడుతూ యూనిట్పై 13 పైసల మేర ఛార్జీలను తగ్గించామని రాష్ట్ర ఇంధన
Date : 25-06-2026 - 11:55 IST -
AP Rain Alert: ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
ఆంధ్రప్రదేశ్లో వర్షాలతో పాటుగా ఎండలు కొనసాగుతున్నాయి. ఇవాళ ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమలో ఈదురు గాలులతో కూడిన వానలు పడతాయంటున్నారు. విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అలాగే మిగతా చో
Date : 25-06-2026 - 8:57 IST -
Gade Sai Krishna: సాయి కృష్ణ డెత్ పై.. SIT సంచలన రిపోర్ట్
విజయవాడకు చెందిన గాదె సాయికృష్ణ కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో అరెస్టైన కృష్ణలంక సీఐ నాగరాజు రిమాండ్ రిపోర్టులో సిట్ సంచలన విషయాలను పేర్కొంది. సాయికృష్ణ మరణించారని గుర్తించామని.. అతడిది కస్టోడియల్ డెత్ అని తేలిందని.. మృతదేహాన్ని మాయం చేసినట్లు రిపోర్టులో పేర్కొన్నారు. మే 5 నుంచి జూన్ 19 మధ్య కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగిందని.. సాయికృష్ణపై నాన్ బెయిలబుల్
Date : 24-06-2026 - 2:25 IST -
Weather Report: ఏపీలో భారీ రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనాల కారణంగా ఆంధ్రప్రదేశ్లో వర్షాలు పడుతున్నాయి. వచ్చే 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయి. ఇవాళ విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామారాజు, పోలవరం, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, నంద్యాల, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని ఏ
Date : 24-06-2026 - 9:33 IST -
Sree Charani: ఐసీసీ టీ20 బౌలింగ్ నంబర్ 1 ర్యాంకుల్లో తెలుగమ్మాయి శ్రీచరణి హవా.. ఏపీ గర్విస్తోందన్న మంత్రి లోకేశ్
ఏడాది క్రితం అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన శ్రీ చరణి (Sree Charani) నంబర్ 1 ర్యాంక్ పట్టేసింది. నిలకడగా రాణిస్తున్న ఈ తెలుగమ్మాయి అంతర్జాతీయ టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్లో అగ్రస్థానం సొంతం చేసుకుంది. ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న పొట్టి వరల్డ్కప్లో తిప్పేస్తున్న ఈ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అందరినీ ఆశ్చర్యపరుస్తూ టాప్ ర్యాంక్కు ఎగబాకింది. https://www.icc-cricket.com/tournaments/womens-t20-worldcup-2026/news/india-spinner-be
Date : 23-06-2026 - 4:24 IST -
CI Nagaraju: సాయికృష్ణ కేసులో సీఐ నాగరాజు అరెస్ట్
విజయవాడలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ సస్పెన్షన్కు గురైన కృష్ణలంక సీఐ నాగరాజును ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. విజయవాడలోని అజిత్ సింగ్ నగర్లో ఉన్న ఆయన నివాసానికి చేరుకున్న సిట్ అధికారులు, విచారణ నిమిత్తం నాగరాజును కస్టడీలోకి తీసుకున్నారు. ఈ విష
Date : 23-06-2026 - 2:49 IST -
Chandrababu : విశాఖ ఫార్మా సిటీ అగ్ని ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు విచారం
అనకాపల్లి జిల్లా పరవాడలోని ఫార్మా సిటీలోని దక్షిణ్ ఎనర్జీలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ఇద్దరు కార్మికుల మృతిపై సీఎం తన సంతాపం తెలియచేశారు. జిల్లా అధికారులతో మాట్లాడి ప్రమాదం జరిగిన తీరుపై సీఎం వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఫార్మా సిటీ అగ్నిమాపక కేంద్రం నుంచి రెండు, పరవాడ నుంచి మరొక అగ్న
Date : 23-06-2026 - 12:00 IST -
Gade Sai Krishna Missing Case: సాయికృష్ణ కేసులో కీలక మలుపు.. నెల రోజుల సీసీ ఫుటేజ్ మాయం
ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తులో ఒక సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. కేసుకు అత్యంత కీలకమైన దాదాపు నెల రోజుల సీసీటీవీ ఫుటేజ్ను సిస్టమ్ నుంచి ఉద్దేశపూర్వకంగా తొలగించినట్లు అధికారులు నిర్ధారించారు. వివరాల్లోకి వెళితే.. మే 1వ తేదీ నుం
Date : 23-06-2026 - 11:19 IST -
Tirumala School: తిరుమల స్కూల్లో విద్యార్థి ఆత్మహత్య.. అసలు నిజం ఇదే..
తూర్పుగోదావరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కొవ్వూరు మండలం కాపవరంలోని తిరుమల స్కూలు భవనంపై నుంచి విద్యార్థి కిందపడి మృతి చెందారు. కుమారదేవ గ్రామానికి చెందిన విద్యార్థి రవిచంద్ర, రోజు మాదిరిగానే సోమవారం స్కూలుకు వచ్చారు. మధ్యాహ్న సమయంలో స్కూలు భవనంపై నుంచి కింద పడి రవిచంద్ర అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో స్కూల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. విద్యార్థులు భయాందోళనల
Date : 23-06-2026 - 10:52 IST -
Kodali Nani: ఏపీ హైకోర్టుకు మాజీ మంత్రి కొడాలి నాని
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని చుట్టూ న్యాయపరమైన ఉచ్చు బిగుస్తోంది. 2021లో జరిగిన స్థానిక సంస్థల (పంచాయతీ) ఎన్నికల సమయంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎన్నికల నియమావళి)ను ఉల్లంఘించారనే ఆరోపణలపై నమోదైన పాత కేసులో ఆయనపై క్రిమినల్ ప్రాసిక్యూషన్ జరపడానికి ప్రస్తుత తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారికంగా అనుమతి మంజూరు చేసింది. ఈ పరిణా
Date : 23-06-2026 - 10:15 IST -
AP : ఐదు బోధనాసుపత్రుల్లో కృత్రిమ అవయవాల తయారీ యూనిట్లు!
రాష్ట్రంలోని ఐదు బోధనాసుపత్రుల్లో తొలిసారిగా కృత్రిమ అవయవాల తయారీ యూనిట్లు రాబోతున్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. దివ్యాంగులకు అవసరమైన కృత్రిమ కాళ్లు, చేతులు, వీల్ ఛైర్లు, వినికిడి పరికరాలు, ఇతర సహాయ ఉపకరణాల తయారీ ఈ కేంద్రాల్లో జరుగుతాయని పేర్కొన్నారు. వైద్యులు సూచించే అవసరమైన కృత్రిమ కాళ్లు, చేతులు ఇవ్వడంవల్ల దివ్యాంగుల
Date : 22-06-2026 - 6:11 IST -
CM Chandrababu : మానవీయ కోణంలో పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారం
పీజీఆర్ఎస్ సహా ప్రజల నుంచి వచ్చే అర్జీలను మానవీయ కోణంలో పరిష్కరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఉద్యోగులు, అధికారులు సాఫ్ట్ స్కిల్స్ అలవరచుకోవాలని స్పష్టం చేశారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి వివిధ శాఖల పని తీరుపై సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ…”ఉద్యోగులు వినూత్నంగా ఆలోచనలు చేసేలా ప్రోత్
Date : 22-06-2026 - 2:48 IST -
Radha Gayatri: టెకీ రాధా గాయత్రి చివరి ఆడియో.. వెలుగులోకి కీలక విషయాలు
విశాఖపట్నానికి చెందిన టెకీ రాధా గాయత్రి మృతి కేసుకు సంబంధించి కీలక అంశాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఉత్తరాఖండ్లో రాధాగాయత్రి అనుమానాస్పద స్థితిలో చనిపోయినట్లు కేసు చేయగా.. తాజాగా గాయత్రి తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో భర్త శ్రీచరణ్పై ముస్సోరి పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసుకు సంబంధించి మరో ముఖ్యమైన ఆడియో బయటకు వచ్చింది. రాధాగాయ
Date : 22-06-2026 - 2:38 IST -
YS Jagan Mohan Reddy: రేపు పులివెందుల పర్యటనకు వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ రేపటి నుంచి తన సొంత నియోజకవర్గమైన పులివెందులలో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. రేపటి నుండి జూన్ 25 వరకు సాగే ఈ పర్యటనలో ఆయన స్థానిక నేతలతో సమీక్షలు జరపడంతో పాటు ప్రజలను నేరుగా కలవనున్నారు. రేపు సాయంత్రానికి జగన్ పులివెందులకు చేరుకుంటారు. అక్కడ ఉన్న తన క్యాంప్ కార్యాలయంలో స్థానిక వైసీపీ నేతలు, కార్యకర్తలు, నియోజకవర్గ
Date : 22-06-2026 - 1:11 IST -
Radha Gayatri: రాధా గాయత్రి మృతి కేసులో ట్విస్ట్
విశాఖపట్నానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ రాధా గాయత్రి ఉత్తరాఖండ్లోని ముస్సోరి హిల్స్టేషన్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కుమార్తె మృతిపై ఆమె తండ్రి, మాజీ ఆర్మీ ఉద్యోగి అయిన సుధాకర్ ఇచ్చిన ఫిర్యాదు మరియు సమర్పించిన పక్కా ఆధారాలతో ముస్సోరి పోలీసులు గాయత్రి భర్త శ్రీచరణ్పై హత్య కేసు నమోదు చేశారు. గురుగ్రామ్లో సాఫ్ట్వేర
Date : 22-06-2026 - 12:20 IST -
Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం
కాకినాడ జిల్లా తుని మండలం ఎస్. అన్నవరం గ్రామానికి చెందిన మూడేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో 13 రోజులు గడిచినా మిస్టరీ వీడలేదు. చిన్నారి ఆచూకీ కోసం పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అలుపెరుగని గాలింపు చర్యలు చేపడుతున్నా ఫలితం లభించలేదు. ఈ కేసు దర్యాప్తులో తాజాగా వెలుగులోకి వచ్చిన పెంపుడు శునకానికి సంబంధించిన పరిణామాలు మరింత ఉత్కంఠ రేపుతున్నాయి. చిన్నారి ఆచూకీ కన
Date : 22-06-2026 - 11:35 IST -
Rain Alert: ఏపీ భారీ వర్షాలు..
ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో ఇవాళ మేఘావృతమైన వాతావరణంతో పాటు చెదురుమదురుగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకా
Date : 22-06-2026 - 10:00 IST -
YOGA : ఆర్టీసీ హౌస్లో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలోని ఆర్టీసీ హౌస్లో శనివారం ఘనంగా యోగా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 80 మంది అధికారులు, ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా APSRTC ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (అడ్మినిస్ట్రేషన్) కె.ఎస్. బ్రహ్మానంద రెడ్డి హాజరైయ్యారు. యోగా భారతదేశం ప్రపంచానికి అందించిన అమూల్యమైన ఆరోగ్య సంప
Date : 21-06-2026 - 11:39 IST -
Jnaneswari: చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో ఎన్నో కొత్త మలుపు.?
400 మంది సిబ్బంది.. పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బలగాలు.. దట్టమైన భూభాగాన్ని జల్లెడ పట్టే థర్మల్ డ్రోన్లు.. సీసీటీవీ ఫుటేజ్, మొబైల్ టవర్ డేటా విశ్లేషణ.. అడవిలో రహస్యంగా అమర్చిన కెమెరా ట్రాప్లు, జంతువులను ఆకర్షించేందుకు మాంసంతో నింపిన బొమ్మలు.. లక్ష రూపాయల రివార్డు.. కాకినాడ జిల్లా సీహెచ్ అగ్రహారం గ్రామంలో కనిపించకుండా పోయిన రెండేళ్ల చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి ఆచూకీ కనిపెట్టేందు
Date : 21-06-2026 - 10:00 IST -
Wedding : జర్మనీలో మొదలైన ప్రేమ.. పల్నాడులో పెళ్లి పీటలు
ప్రేమకు దేశాలు, భాషలు, సరిహద్దులు అడ్డుకావని మరోసారి నిరూపితమైంది. పల్నాడు జిల్లా దేచవరం గ్రామానికి చెందిన యువకుడు యంపాటి వెంకటేశ్వర్లు జర్మనీకి చెందిన అలెనా అనే యువతిని వివాహం చేసుకుని అందరి దృష్టిని ఆకర్షించాడు. ఉన్నత విద్య కోసం జర్మనీకి వెళ్లిన వెంకటేశ్వర్లు అక్కడ అలెనాతో పరిచయం ఏర్పరుచుకున్నాడు. కాలక్రమేణా ఆ పరిచయం ప్రేమగా మారి, ఇద్దరూ వివాహ బంధంతో ఒక్కటవ్వాలన
Date : 21-06-2026 - 8:05 IST