HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Once The Mou Is Signed Full Responsibility Is Ours Minister Lokesh

Minister Lokesh: ఎంఓయూపై సంతకం చేశాక పూర్తి బాధ్యత మాదే: మంత్రి లోకేష్

అర్బన్ ప్లానింగ్ గవర్నెన్స్, అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో సింగపూర్ సహకారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరుకుంటుందని లోకేష్ తెలిపారు.

  • Author : Gopichand Date : 28-07-2025 - 7:09 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Minister Lokesh
Minister Lokesh

Minister Lokesh: ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టడానికి వచ్చే పారిశ్రామికవేత్తలకు పూర్తి మద్దతు అందిస్తామని, ఎంఓయూపై సంతకం చేసిన తర్వాత ఆ ప్రాజెక్టు పూర్తి బాధ్యత తమదేనని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ (Minister Lokesh) స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్- సింగపూర్ బిజినెస్ ఫెడరేషన్, సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ రోడ్ షోలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

అమరావతి మాస్టర్ ప్లాన్, సింగపూర్ సహకారం

అర్బన్ ప్లానింగ్ గవర్నెన్స్, అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో సింగపూర్ సహకారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరుకుంటుందని లోకేష్ తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత 2014లో చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి మేరకు సింగపూర్ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా అమరావతి మాస్టర్ ప్లాన్‌ను అందించిందని గుర్తు చేశారు.

పెట్టుబడులకు అపార అవకాశాలు

974 కి.మీ.ల సువిశాల తీర ప్రాంతం కలిగిన ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ, ఎలక్ట్రానిక్స్, డాటా సెంటర్స్, గ్రీన్ ఎనర్జీ, ఫిన్‌టెక్, బయో టెక్నాలజీ వంటి రంగాల్లో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు ఉన్నాయని లోకేష్ నొక్కి చెప్పారు. తమ ప్రభుత్వంపై ఉన్న నమ్మకానికి నిదర్శనంగా, ఆదిత్య మిట్టల్తో ఒక్క జూమ్ కాల్ సంభాషణతోనే భారతదేశంలోనే అతిపెద్దదైన ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్‌ను ఏపీలో ఏర్పాటు చేయడానికి అంగీకరించారని ఉదాహరణగా చెప్పారు. అలాగే, రెన్యూ పవర్ సంస్థ ఇండియాలోనే అతిపెద్ద హైబ్రిడ్ రెన్యూవబుల్ ఎనర్జీ పవర్ ప్లాంట్‌కు అనంతపురం జిల్లాలో పనులు ప్రారంభించిందని తెలిపారు.

Also Read: Cryptocurrency: దేశంలో క్రిప్టోకరెన్సీ వాడకం, నియంత్రణపై కేంద్రం చర్యలు

ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలు, మద్దతు

ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలతో ఇటీవల ప్రకటించిన ఎలక్ట్రానిక్స్ పాలసీ 4.0తో ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్స్ హబ్‌గా మారబోతోందని లోకేష్ వివరించారు. రాష్ట్రానికి వచ్చే పరిశ్రమలకు అవసరమైన మ్యాన్‌పవర్, వర్క్ ఫోర్స్ తమ వద్ద సిద్ధంగా ఉందని, హైటెక్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లకు అవసరమైన ఆర్ అండ్ డీ, ప్లగ్ అండ్ ప్లే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని అన్నారు. కొత్తగా వచ్చే పరిశ్రమలకు అవసరమైన అనుమతులు, సౌకర్యాలు, ప్రోత్సాహకాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెలవారీ సమీక్షలు నిర్వహిస్తున్నారని తెలిపారు.

ప్రస్తుత ప్రభుత్వంలో పనిచేస్తున్న శాసనసభ్యుల్లో 50 శాతం, మంత్రివర్గంలో 75 శాతం కొత్తవారని, సింగపూర్ నుంచి ఏపీలో పరిశ్రమల స్థాపనకు వచ్చే ఇన్వెస్టర్లకు అవసరమైన పూర్తిస్థాయి మద్దతు తమ నుంచి లభిస్తుందని లోకేష్ హామీ ఇచ్చారు. ఇన్నోవేషన్, ఇన్వెస్ట్‌మెంట్, ఇంపాక్ట్ సహకారాన్ని తాము సింగపూర్ నుంచి కోరుకుంటున్నామని మంత్రి నారా లోకేష్ పునరుద్ఘాటించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhrapradesh
  • ap news
  • CM Chandrababu
  • Investments
  • Minister Lokesh
  • MoU Signed
  • Singapore News

Related News

Telugu States IRCTC Special Trains

తెలుగు రాష్ట్రాల రైలు ప్రయాణీకులకు కేంద్రం గుడ్‌న్యూస్

Telugu States IRCTC Special Trains  తెలుగు రాష్ట్రాల ప్రయాణికుల సౌకర్యార్థం మూడు ప్రత్యేక రైళ్లను రైల్వే బోర్డు రెగ్యులర్ సర్వీసులుగా మార్చింది. హైదరాబాద్-కన్యాకుమారి, కాచిగూడ-ట్యూటికోరిన్, చర్లపల్లి-షాలిమార్ ట్రైన్లు ఇకపై శాశ్వత ప్రాతిపదికన నడవనున్నాయి. దీనివల్ల ప్రయాణ సమయం తగ్గడంతో పాటు అదనపు ఛార్జీల భారం తప్పుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. తెలుగు రాష్ట్రాల ట్రైన్ ప్రయ

  • Ap Cm Chandrababu Naidu

    Local Body Elections in AP : స్థానిక ఎన్నికల అప్డేట్ ఇచ్చిన సీఎం చంద్రబాబు

  • Minister Lokesh

    విద్యార్ధుల కోసం రూ.18 లక్షలతో రోడ్డు.. మంత్రి లోకేష్ మార్క్‌!

  • Kutami Govt

    అన్నదాతకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కూటమి ప్రభుత్వం!

  • Andhra Pradesh Funds

    ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్

Latest News

  • పాక్ క్రికెట్ బోర్డుకు షాక్ ఇచ్చిన జింబాబ్వే స్టార్ పేసర్

  • వేసవిలో బాడీ డీహైడ్రేట్ కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

  • టాలీవుడ్ లో విషాదం.. సీనియర్‌ నిర్మాత ఎం.అర్జునరాజు కన్నుమూత

  • War Effect : కళ తప్పిన దుబాయ్.. పర్యాటకులు లేక వెలవెల

  • Meta layoffs: జుకర్‌బర్గ్ సంచలన నిర్ణయం.. మెటాలో 16 వేల మంది ఉద్యోగులు లేఆఫ్

Trending News

    • ప్ర‌జ‌ల ప్రాణాల మీద‌కు తెస్తున్న గ్యాస్‌!

    • ఐపీఎల్ త‌ర్వాత భార‌త్ ఆడ‌బోయే సిరీస్‌లు ఇవే!

    • భర్తను పకోడీలు తెమ్మని చెప్పి.. ప్రియుడితో నవ వధువు జంప్

    • Work From Home: మళ్లీ మొదలైన వర్క్ ఫ్రం హోమ్..ఈసారి ఎందుకంటే !!

    • పెళ్లి చేసుకున్న కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd