HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Now The Whole World Is Looking At Andhra Pradesh Minister Lokesh

Minister Lokesh : ఇప్పుడు ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తోంది: మంత్రి లోకేశ్‌

ఈ సందర్భంగా ఆయన్ను పలువురు ప్రముఖ ఐటీ కంపెనీల ప్రతినిధులు కలుసుకుని రాష్ట్రంలోని పెట్టుబడి అవకాశాలను చర్చించారు. TCS, IBM, L&T వంటి దిగ్గజ కంపెనీలు ఇప్పటికే సహకారానికి ముందుకు రావడం గమనార్హం.

  • Author : Latha Suma Date : 08-07-2025 - 3:48 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Now the whole world is looking at Andhra Pradesh: Minister Lokesh
Now the whole world is looking at Andhra Pradesh: Minister Lokesh

Minister Lokesh : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో దేశంలోనే తొలిసారిగా సిలికాన్ వ్యాలీ తరహాలో ‘క్వాంటమ్ వ్యాలీ’ ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. మరో ఆరు నెలల్లో ఈ విప్లవాత్మక ప్రాజెక్టు ప్రారంభం కానుందని ఆయన స్పష్టం చేశారు. ఇది రాష్ట్ర ఐటీ రంగానికి గేమ్ ఛేంజర్‌గా నిలుస్తుందని పేర్కొన్నారు. బెంగళూరులోని మాన్యత ఎంబసీ బిజినెస్ పార్కులో నిర్వహించిన రోడ్ షోలో లోకేశ్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (GCCs) ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన్ను పలువురు ప్రముఖ ఐటీ కంపెనీల ప్రతినిధులు కలుసుకుని రాష్ట్రంలోని పెట్టుబడి అవకాశాలను చర్చించారు. TCS, IBM, L&T వంటి దిగ్గజ కంపెనీలు ఇప్పటికే సహకారానికి ముందుకు రావడం గమనార్హం.

Read Also: Odisha : గర్భిణికి పురిటి కష్టాలు..10 కిలోమీటర్లు డోలీలో మోసి ఆసుపత్రికి తరలించిన గ్రామస్థులు

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రపంచం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తోంది. పెట్టుబడుల కోసం ఇది అత్యుత్తమ సమయం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్రం వేగంగా అభివృద్ధి మార్గంలో సాగుతోంది. నూతన సాంకేతిక రంగాలైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, డేటా అనలిటిక్స్ వంటి విభాగాల్లో ఏపీ తన స్థానాన్ని బలోపేతం చేసుకుంటోంది అని వివరించారు. అమరావతిలో నెలకొనబోయే క్వాంటమ్ వ్యాలీ ద్వారా క్వాంటమ్ కంప్యూటింగ్, డీప్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ వంటి కీలక రంగాల్లో పరిశోధనలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్టు తెలిపారు. ఇది కేవలం రాష్ట్రానికి మాత్రమే కాకుండా, దేశానికే టెక్నాలజీ విప్లవానికి నాంది పలుకుతుందని అభిప్రాయపడ్డారు.

వైశాఖపట్నం మహానగరాన్ని ఐటీ, స్టార్టప్ రంగాలకు కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే పలు కంపెనీలు విశాఖలో తమ కేంద్రాలు ఏర్పాటు చేయడానికి ఆసక్తి కనబరిచినట్టు మంత్రి తెలిపారు. మేం పెట్టుబడుదారుల కోసం స్పష్టమైన విధానాలు, పారదర్శక పాలన, వేగవంతమైన అనుమతులు అందిస్తున్నాం. దేశంలో మరే రాష్ట్రం ఇవ్వని విధంగా ప్రోత్సాహక ప్యాకేజీలు అందిస్తున్నాం. ఇది ఒక్క అభివృద్ధి మాత్రమే కాదు, ఉద్యోగ అవకాశాలకూ గొప్ప వేదికగా మారబోతోంది అని లోకేశ్ వివరించారు. క్వాంటమ్ వ్యాలీతోపాటు, రాష్ట్రంలో గ్లోబల్ సంస్థలతో భాగస్వామ్యంలో కేంద్రాలు ఏర్పాటవుతున్న నేపథ్యంలో, స్థానిక యువతకు అత్యాధునిక రంగాల్లో ఉద్యోగాలు, శిక్షణ అవకాశాలు ఏర్పడనున్నాయి. దీని ద్వారా భవిష్యత్తు టెక్నాలజీ రంగానికి అవసరమైన నైపుణ్య శక్తి ఏపీలో అభివృద్ధి చేయవచ్చని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

Read Also: Nepal : శ్రీరామ జన్మస్థలంపై మళ్లీ వివాదం.. నేపాల్ ప్రధాని ఓలి సంచలన వ్యాఖ్యలు

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • amaravati
  • andhra pradesh
  • Investments in the state
  • Minister Lokesh
  • Quantum Valley

Related News

New twist in Nayeem's disproportionate assets case.. ED chargesheet in court

నయీం అక్రమాస్తుల కేసులో కొత్త మలుపు.. కోర్టులో ఈడీ ఛార్జిషీట్

మనీలాండరింగ్ ఆరోపణలపై హైదరాబాద్‌లోని రంగారెడ్డి జిల్లా కోర్టులో ఈడీ ఛార్జిషీట్ దాఖలు చేసింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం–2002 (PMLA) కింద సమర్పించిన ఈ అభియోగ పత్రాన్ని కోర్టు స్వీకరించడంతో కేసు విచారణకు గ్రీన్ సిగ్నల్ లభించింది.

  • Yarraji Jyoti

    యర్రాజీ జ్యోతికి గ్రూప్-1 ఉద్యోగం, ఇంటి స్థలం.. అండగా నిలిచిన మంత్రి లోకేష్

  • CM Chandrababu participated in the parliamentary committees workshop

    పార్టీ కంటే ఏదీ ముఖ్యం కాదు.. నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదు : చంద్రబాబు వార్నింగ్

  • Budget 2026 Updates

    కేంద్ర బడ్జెట్ పైనే ఏపీ ఆశలు

  • India Republic Day

    రాజధాని అమరావతిలో తొలిసారి ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

Latest News

  • అంజనాదేవి పుట్టిన రోజు సందర్బంగా పవన్ దత్తత

  • ప్ర‌భాస్ ఫౌజీ.. మూవీ విడుద‌ల ఎప్పుడంటే?!

  • ఢిల్లీలో ఘోరం.. 6 ఏళ్ల చిన్నారిపై గ్యాంగ్ రేప్

  • భోజనం చేసిన వెంటనే పడుకుంటున్నారా?

  • పవిత్రస్థలం..అపవిత్రం చేసారు కదరా ! మీ ఫోటో షూట్ తగిలేయ్య !!

Trending News

    • ఆర్థిక సర్వేను ప్ర‌వేశ పెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి.. జీడీపీ అంచ‌నా ఎంతంటే?!

    • బంగారం పై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన..ఏకంగా రూ. 12 లక్షల కోట్లు..!

    • రిటైర్మెంట్‌పై యువరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్య‌లు!

    • జాతీయ రహదారులపై నిర్మలా సీతారామన్ సంచలనం

    • యూపీఐ ద్వారా డబ్బు కట్ అయి, పేమెంట్ ఫెయిల్ అయితే ఏం జరుగుతుంది?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd