AP Minister : మంత్రి అమర్నాథ్కు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ
ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ కు విశాఖ ఆరో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కమ్ రైల్వే న్యాయస్థానం నాన్
- By Prasad Published Date - 12:46 PM, Fri - 3 March 23
ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ కు విశాఖ ఆరో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కమ్ రైల్వే న్యాయస్థానం నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. రైల్వే స్టేషన్లోకి అనధికారికంగా ప్రవేశించారని ఐదేళ్ల కిందట అమర్నాథ్ పై కేసు నమోదైంది. 2018లో ప్రత్యేక హోదా, రైల్వే జోన్ డిమాండ్ చేస్తూ స్టేషన్లోకి అనధికార ప్రవేశం చేశారు. విశాఖ – పలాస ప్యాసింజర్ రైలును నిలిపేసి రైల్రోకో నిర్వహించారు. దీంతో గుడివాడ అమర్ తో పాటు పలువురు వైసీపీ నేతలు ఉన్నట్లు రైల్వే అధికారులు గుర్తించారు. విచారణలో భాగంగా నిందితులు ఫిబ్రవరి 27న న్యాయ స్థానంలో హాజరు అవ్వాలి. కానీ..గుడివాడ అమర్నాథ్, జాన్ వెస్లీలు కోర్ట్కి హాజరు కాకపోవడంతో నాన్ బెయిల్ అరెస్ట్ వారంటీ జారీ కేసును మార్చి 7వ తేదీకి వాయిదా వేసింది. ఓ వైపు విశాఖలో గ్లోబల్ సమ్మిట్ జరుగుతున్న వేళ పరిశ్రమల శాఖ మంత్రికి నాన్బెయిలబుల్ వారెంట్ జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది.
Related News
AP Hot Topic : తూర్పు ఏటైతే రాష్ట్రం కూడా అటే.. !
తూర్పుగోదావరి ఎన్నికల ఫలితాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.