HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Andhra Pradesh
  • >No Protection For Minorities In Jagans Regime Every Congress Worker Should Become An Army Sharmila

Sharmila : జగన్ పాలనలో మైనార్టీలకు రక్షణ లేదు..? ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఒక సైన్యంలా మారాలి: షర్మిల

అమరావతిః గుంటూరులోని మెట్టు అంజిరెడ్డి కల్యాణ మండపంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో రాష్ట్ర పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) పాల్గొన్నారు.

  • By Vamsi Chowdary Korata Published Date - 02:03 PM, Sat - 27 January 24
  • daily-hunt
Sharmila - No Protection For Minorities In Jagan's Regime.. Every Congress Worker Should Become An Army Sharmila
No Protection For Minorities In Jagan's Regime.. Every Congress Worker Should Become An Army Sharmila

Sharmila : అమరావతిః గుంటూరులోని మెట్టు అంజిరెడ్డి కల్యాణ మండపంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో రాష్ట్ర పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ..రాష్ట్రంలో యువతను నిరుద్యోగులుగా మార్చి, పోలవరం నిర్మాణం ఆపేసి, అభివృద్ధిని పక్కన పెట్టిన జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని అన్నారు. వైఎస్‌ఆర్‌సిపి పాలనలో గుంటూరు గుంతలూరుగా మారిందని ఎద్దేవా చేశారు. గుంటూరులో మంచి రహదారులు రావాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు. రాష్ట్రంలో 19 లక్షల మంది యువతకు ఉద్యోగాలు లేవన్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన 5 సంవత్సరాల కాలంలో ఒక్క జాబ్ క్యాలెండర్‌ కూడా ఇవ్వకుండా ఎన్నికల‌ ముందు నోటిఫికేషన్ ఇస్తే ఉద్యోగాలు ఎప్పుడిస్తారని ప్రశ్నించారు.

We’re now on WhatsApp. Click to join.

ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని, ఇంక అభివృద్ధికి నిధులు ఎక్కడ వస్తాయని ప్రశ్నించారు. రాజశేఖర్ రెడ్డి ప్రజాదర్బార్ నిర్వహించి ప్రజలతో మమేకమయ్యారని, జగన్ మాత్రం పెద్ద పెద్ద గోడలు కట్టుకోని కోట లోపలే ఉంటున్నారని ఎద్దేవా చేశారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలకే జగన్‌ అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదు ఇంకా ప్రజలను ఎలా కలుస్తారని అన్నారు. ముస్లిం రిజర్వేషన్లు విషయంలో వైఎస్ సుప్రీంకోర్టు వరకూ వెళ్లి పోరాడి సాధించారని, జగన్ పాలనలో మాత్రం రాష్ట్రంలో మైనార్టీలకు రక్షణ లేదని విమర్శించారు. మణిపూర్​లో క్రైస్తవులపై దాడులు జరుగుతున్నా జగన్ స్పందించలేదని, జగన్ బిజెపికి బానిసలా మారిపోయారని దుయ్యబట్టారు.

ముస్లింలు, క్రిస్టియన్స్​కు ఈ ప్రభుత్వంలో రక్షణ లేదని విమర్శించారు. పోలవరం, ప్రత్యేక హోదా‌ ఇవ్వక పోయినా వైసీపీ మాత్రం బిజెపికి ఊడిగం చేస్తుందని విమర్శించారు. రాష్ట్రంలో ప్రతి గడపా తొక్కుతా, వీలైనంత ఎక్కువ మందిని కలుస్తానని తెలిపారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఒక సైన్యంలా మారాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో వైసీపీ, జనసేన, టిడిపిలలో ఎవరికి ఓటు వేసినా బిజెపికి వేసినట్లేనన్నారు. బిజెపి అంటే బాబు, జగన్, పవన్ అంటూ వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, మస్తాన్ వలి, ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

ఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ ప్రాజెక్టును నిర్మించారన్న షర్మిల (Sharmila), గేట్లు కొట్టుకు పోతుంటే ఇరిగేషన్ మంత్రి సంక్రాంతి డ్యాన్సులు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. 750 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మించిన ప్రాజెక్టును ఈ ప్రభుత్వం గాలికి వదిలేసిందని షర్మిల ఆరోపించారు. నిర్వహణ లేకనే గేట్లు కొట్టుకు

Also Read:  Nirmala Sitharaman: మ‌ధ్యంత‌ర‌ బడ్జెట్‌లో ఈ 4 అంశాలపై ప్రభుత్వం దృష్టి..!


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • amaravati
  • andhra pradesh
  • ap
  • congress
  • jagan
  • sharmila
  • YSR Family

Related News

Ap Egg

Production of Eggs : గుడ్ల ఉత్పత్తిలో ఏపీ నం.1

Production of Eggs : మాంసం ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ నాల్గవ స్థానంలో, పాల ఉత్పత్తిలో ఐదవ స్థానంలో, మరియు గేదెల ఉత్పత్తిలో ఆరవ స్థానంలో ఉందని దామోదర్ నాయుడు తెలిపారు

  • Heavy Rains

    Alert : 13న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు!

  • Cable Bridge

    Cable Bridge: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం.. అమరావతిలో ఐకానిక్ బ్రిడ్జి!

  • AP Assembly monsoon session to begin from 18th of this month

    AP Assembly : ఈ నెల 18 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు

  • Minister Lokesh meets Prime Minister Modi..these are the topics discussed..!

    Lokesh Delhi Tour : ప్రధాని మోడీతో మంత్రి లోకేష్ భేటీ..చర్చించిన అంశాలివే..!

Latest News

  • Coolie : వచ్చేస్తోంది.. ‘కూలీ’ ఇప్పుడు ఏ ఓటీటీలో అంటే..?

  • Ganesh Visarjan : 16 కిలో మీటర్లు సాగనున్న బాలాపూర్‌ గణేష్‌ శోభాయాత్ర..

  • AP : అసెంబ్లీకి రాకపోతే ఉప ఎన్నికలే: జగన్ కు రఘురామకృష్ణరాజు హెచ్చరిక

  • Shocking : ఎర్రకోటకే కన్నం వేసిన ఘనులు

  • Modi Govt : న్యాయ వ్యవస్థలో విప్లవం..’రోబో జడ్జిలు’ సరికొత్త ప్రయోగం..

Trending News

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd