HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Most Of The Cybercrime Victims Are Employees 1833 People Lost Rs 633 Crore In 8 Months In Andhra Pradesh

Cyber Crimes: ఏపీలో ‘సైబర్’ టెర్రర్.. 8 నెలల్లో రూ.600 కోట్లు లూటీ

సీబీఐ, ఈడీ అధికారులం అంటూ సైబర్ కేటుగాళ్లు(Cyber Crimes)  ఫోన్ కాల్స్ చేస్తారు.

  • By Pasha Published Date - 10:32 AM, Wed - 2 April 25
  • daily-hunt
Cyber Crimes Victims Employees Andhra Pradesh Cyber Crimes Ap Police

Cyber Crimes: ఆంధ్రప్రదేశ్‌లో ఎంతోమంది సైబర్ నేరాల బారినపడుతున్నారు. తమ కష్టార్జితాన్ని పోగొట్టుకుంటున్నారు. గత 8 నెలల్లో రాష్ట్రంలో దాదాపు 1,800 మంది సైబర్ కేటుగాళ్ల వలకు చిక్కి  రూ.600 కోట్లు పోగొట్టుకున్నారు. సగటున రోజుకు రూ.2.50 కోట్లను మోసగాళ్లు దోచేశారు. రూ.600 కోట్లలో రూ.61.59 కోట్లను మాత్రమే నేరగాళ్లపరం కాకుండా పోలీసులు ఫ్రీజ్ చేయగలిగారు. సైబర్ నేరగాళ్ల బాధితుల్లో ఎక్కువ మంది ఉద్యోగులే. కొందరు ప్రముఖులు కూడా సైబర్ మోసాల బారినపడటం గమనార్హం. ఈమేరకు వివరాలతో ఏపీ పోలీసు శాఖ ఒక నివేదికను సిద్ధం చేసింది. ఆ వివరాలను చూద్దాం..

Also Read :Vijayasai Reddy : వచ్చే వారమే బీజేపీలోకి విజయసాయి రెడ్డి ? కారణం అదేనా ?

బాధితులు వీరే.. 

  • సైబర్ కేటుగాళ్ల వల్ల దగాపడిన వారిలో 764 మంది ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులే ఉన్నారు.
  • ప్రజల్లో బాగా ప్రాచుర్యమున్న ప్రముఖులు 697 మంది సైబర్ మోసాల బారినపడ్డారు.
  • ఎంతోమంది విద్యార్థులు, ఎంట్రప్రెన్యూర్లు, వైద్యులు, వృత్తి నిపుణులూ మోసపోయారు.
  • సైబర్‌ మోసాల బారినపడిన వారిలో 30-45 ఏళ్లవారు 640 మంది, 45-60 ఏళ్లవారు 410 మంది,  18-30 ఏళ్లవారు 391 మంది ఉన్నారు.
  • బాధితుల్లో ఎక్కువ మంది పురుషులే ఉన్నారు.

ఇలా మోసపోతున్నారు.. 

  • సీబీఐ, ఈడీ అధికారులం అంటూ సైబర్ కేటుగాళ్లు(Cyber Crimes)  ఫోన్ కాల్స్ చేస్తారు. మీరు మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారని చెబుతూ బ్లాక్ మెయిలింగ్ మొదలుపెడతారు. వీడియో కాల్ చేసి.. మిమ్మల్ని డిజిటల్‌ అరెస్టు చేశామంటారు. భయపెట్టి, ఆందోళనకు గురి చేసి బాధితుల నుంచి డబ్బులు గుంజుతారు.
  • కొరియర్, పార్సిల్‌ కార్యాలయాల నుంచి కాల్‌ చేస్తున్నామని సైబర్ కేటుగాళ్లు  చెబుతారు. బాధితుల పేరిట వచ్చిన పార్సిళ్లలో డ్రగ్స్, ఆయుధాలు ఉన్నాయంటారు. పోలీసు కేసు నమోదైందని బెదిరిస్తారు. డబ్బులు ఇచ్చాక కేసును కొట్టివేయిస్తామని బుకాయిస్తారు.
  • ఇంకొందరు సైబర్ కేటుగాళ్లు ఫోన్ కాల్ చేసి.. తాము బ్యాంకు ఉద్యోగులం అని నమ్మిస్తారు. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డులను అప్‌గ్రేడ్ చేయించుకోవాలని సూచిస్తారు. లేదంటే మరో వారంలో అవి బ్లాక్ అవుతాయని చెబుతారు. ఇది నిజమేనని నమ్మి ప్రస్తుతం వినియోగించే క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డుకు సంబంధించిన నంబర్లు, సీవీవీ వంటివి చెబితే మన పని అయిపోయినట్టే. అకౌంటులోని డబ్బులన్నీ గాయబ్ అవుతాయి.
  • ఇంకొందరు సైబర్ కేటుగాళ్లు న్యూడ్‌ వీడియో కాల్స్‌ ద్వారా ప్రముఖులపైకి వల విసురుతున్నారు. ఆ కాల్స్‌ను రికార్డ్ చేసి.. సోషల్ మీడియాలో వైరల్ చేయిస్తామని బెదిరిస్తారు. వెంటనే  డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తారు.

Also Read :Peddi : రామ్ చరణ్ పెద్ది ఆడియో రైట్స్ భారీ ధరకు.. పుష్ప 2 ని మించి..?


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • AP Cyber Crimes
  • ap police
  • crime
  • cyber crimes
  • Cybercrime Victims
  • employees

Related News

Infosys

Infosys : ఉద్యోగులకు ఇన్ఫోసిస్ అదిరిపోయే శుభవార్త..!

భారతదేశంలోని రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్.. ఆ మధ్య ఫ్రెషర్లను లేఆఫ్స్ చేసిందని తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. మైసూర్ క్యాంపస్లో ట్రైనీలకు అసెస్మెంట్ టెస్టుల్లో ఫెయిల్ అయ్యారని వందల్లో ఉద్యోగుల్ని తొలగించినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. అయితే అప్పటి నుంచి తేరుకున్న ఇన్ఫోసిస్ పలు ఇనిషియేటివ్స్ను తీసుకొస్తోంది. ఆ మధ్య ర

    Latest News

    • Kiran Navgire: చ‌రిత్ర సృష్టించిన టీమిండియా క్రికెట‌ర్‌!

    • Garib-Rath Train: త‌ప్పిన పెను ప్ర‌మాదం.. రైలులో అగ్నిప్ర‌మాదం!

    • Afghanistan-Pakistan War: విషాదం.. ముగ్గురు క్రికెట‌ర్లు దుర్మ‌ర‌ణం!

    • Pawan Kalyan Next Film : పవన్-లోకేశ్ కాంబోలో సినిమా?

    • Telangana Bandh : తెలంగాణ బంద్.. ఎవరిపై ఈ పోరాటం?

    Trending News

      • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

      • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

      • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

      • Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్‌

      • Rivaba Jadeja: గుజరాత్ మంత్రిగా టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd