HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Key Announcement Regarding Vandanam To Mother

Cm Chandrababu Naidu: తల్లికి వందనంపై కీలక ప్రకటన

  • Author : Vamsi Chowdary Korata Date : 02-04-2026 - 2:01 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Andhrapradesh Talliki Vandanam Scheme
Andhrapradesh Talliki Vandanam Scheme

Talliki Vandanam Scheme  ఏపీ ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా విద్యార్థుల కోసం తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తోంది. గతేడాది ప్రభుత్వం విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బుల్ని జమ చేసిన సంగతి తెలిసిందే. 2026కు సంబంధించి తల్లికి వందనం పథకం అమలుపై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ఈ ఏడాది జూన్ నెలలో డబ్బులను తల్లుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రకటించారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘తల్లికి వందనం’ పేరుతో విద్యార్థుల కోసం పథకాన్ని అమలు చేస్తోంది. ఒక్కో విద్యార్థికి రూ.15 వేలు చొప్పున అందజేస్తోంది. గతేడాది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బుల్ని జమ చేసిన సంగతి తెలిసిందే. 2026-2027 విద్యా సంవత్సరానికి సంబంధించిన ‘తల్లికి వందనం’ పథకంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నెల్లూరు జిల్లా వింజమూరులో ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీ, ‘పేదల సేవలో’ కార్యక్రమాల్లో ఈ కీలక ప్రకటన చేశారు. వేసవి సెలవుల తర్వాత జూన్ నెలలో పాఠశాలలు, జూనియర్ కాలేజీలు తిరిగి ప్రారంభమైన వెంటనే ‘తల్లికి వందనం’ నిధుల్ని తల్లుల అకౌంట్లలో జమ చేస్తామన్నారు. జూన్‌ నెలలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ‘తల్లికి వందనం’ డబ్బులు అకౌంట్లలో విడుదల చేస్తామన్నారు.

కూటమి ప్రభుత్వంలో ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని, ప్రజాప్రతినిధులు, అధికారులు పేదల సేవలోనే ఉంటున్నారని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో ప్రతి నెలా పింఛన్ల కోసం రూ.2,750 కోట్లు ఖర్చు చేస్తున్నామని, ఆడబిడ్డలకు దీపం 2.0 పథకం కింద మూడు ఉచిత గ్యాస్‌ సిలిండర్లు ఇస్తున్నామని అన్నారు. రాబోయే రోజుల్లో పైపు ద్వారా ప్రతి ఇంటికి గ్యాస్ అందిస్తామని, వీరికి ఏడాదికి రూ.2400 సబ్సిడీగా ఇస్తామని అన్నారు. ఏప్రిల్ 1 నుంచి చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తున్నామని, 500 యూనిట్ల వరకు విద్యుత్‌ ఉచితమని అన్నారు. స్త్రీశక్తి పథకం ద్వారా మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారని, ఈ పథకం సూపర్ హిట్ అయిందని అన్నారు.

ఏపీ ప్రభుత్వం ‘తల్లికి వందనం’ పథకం కింద విద్యార్థులకు ఆర్థిక సాయం అందిస్తోంది. రాష్ట్రంలో అర్హులైన ప్రతి విద్యార్థికి ఏటా రూ. 15,000 ఆర్థిక సహాయం చేస్తోంది. అయితే విద్యార్థికి ఇచ్చే రూ.15 వేలలో, స్కూల్, కాలేజీ నిర్వహణ ఖర్చుల నిమిత్తం రూ.2000 మినహాయించి, మిగిలిన రూ.13వేలు విద్యార్థుల తల్లుల బ్యాంక్ అకౌంట్లలో జమ చేస్తున్నారు. ఒకవేళ ఎవరైనా విద్యార్థికి తల్లి లేకపోతే, తండ్రి లేదా సంరక్షకుడి ఖాతాలో ఈ డబ్బులు జమ చేస్తారు. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్‌లో 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదివే విద్యార్థులు ఈ పథకానికి అర్హులు. విద్యార్థికి 75 శాతం హాజరు ఉండాలి, విద్యార్థి తల్లి పేరుతో బ్యాంక్ అకౌంట్ ఉండాలి. ‘తల్లికి వందనం’ పథకానికి సంబంధించి, విద్యార్థి తల్లి బ్యాంక్ అకౌంట్‌ను ఆధార్‌తో అనుసంధానించడం (NPCI లింకింగ్) తప్పనిసరి అనే విషయాన్ని మర్చిపోకూడదు. బ్యాంకులో కానీ, నెట్ బ్యాకింగ్, మొబైల్ యాప్, మీ సేవా కేంద్రాల ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. అకౌంట్ ఆధార్‌తో లింక్ అయ్యిందో లేదో NPCI అధికారిక వెబ్‌సైట్ https://www.npci.org.in ద్వారా చెక్ చేసుకోవచ్చు.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhra Pradesh CM Chandrababu Naidu
  • andhra pradesh government
  • Funds release
  • Talliki Vandanam Scheme

Related News

andhra pradesh Release Pending Dues retired employees

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. రూ.7,059 కోట్ల బకాయిల విడుదల

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి తీపి కబురు అందబోతోంది. గత ప్రభుత్వం ఉద్యోగులకు పెట్టిన బకాయిల చెల్లింపులపై కసరత్తు జరుగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ నిధుల లభ్యతను బట్టి ఉద్యోగులకు వీలైనంత త్వరగా చెల్లింపులు జరిపేలా కసరత్తు చేపట్టారు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన పెండింగ్ బిల్లుల్లో రూ.7,059 కోట్లు విడు

  • Chandrababu Govt

    AP Capital: మన రాజధాని అమరావతి.. ఇది చారిత్రాత్మక దినం. సీఎం చంద్రబాబు

  • Pemmasani Chandrasekhar

    Pemmasani Chandrasekhar: 29 వేల మంది రైతులకు జరిగిన అన్యాయం ఇది.. కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్

  • Amaravati Bill In Parliamen

    Capital Amaravati: ఏపీకి గుడ్ న్యూస్.. లోక్‌సభలో అమరావతి బిల్లు ఆమోదం.

  • Amaravati Inner Ring Road Case

    Amaravati Inner Ring Road Case: ఏపీ హైకోర్టులో చంద్రబాబుకు ఊరట

Latest News

  • శ్రేయ‌స్ అయ్య‌ర్‌కు గాయం.. సీఎస్కేతో మ్యాచ్‌కు దూరం?!

  • Renuka Chowdhury: ఇది రాజధాని రైతుల విజయం.రేణుకా చౌదరి

  • Cm Chandrababu Naidu: తల్లికి వందనంపై కీలక ప్రకటన

  • Kerala Assembly Election 2026 : యూడీఎఫ్ మేనిఫెస్టో విడుదల చేసిన తెలంగాణ సీఎం రేవంత్

  • AP Elections : 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల పట్ల సంచలన ఆరోపణలు చేసిన పరకాల

Trending News

    • Condom Shortage: భారీగా పెరగనున్న కండోమ్ ధరలు

    • అల‌ర్ట్‌.. నేటి నుంచి కీల‌క మార్పులు!

    • శ్రేయస్ అయ్యర్‌పై బీసీసీఐ జరిమానా.. గ‌తేడాది కూడా ఇదే త‌ప్పు!

    • AP Capital: అమరావతి రైతుల కన్నీళ్లకు పునాది.. కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్

    • తలస్నానం చేసే సరైన పద్ధతి ఇదే అని మీకు తెలుసా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd