AIIMS : ఏపీ మణిహారంగా `ఎయిమ్స్`, క్యూ కడుతోన్న తెలంగాణ పేదలు!
తెలంగాణ సాధించలేని ఎయిమ్స్ ను ఏపీ సాధించింది. సామాన్యులకు అక్కడ అందుతోన్న సేవలు ప్రశంసల్ని అందుకుంటున్నాయి.
- By CS Rao Published Date - 02:39 PM, Wed - 14 September 22
తెలంగాణ సాధించలేని ఎయిమ్స్ ను ఏపీ సాధించింది. సామాన్యులకు అక్కడ అందుతోన్న సేవలు ప్రశంసల్ని అందుకుంటున్నాయి. ఖరీదైన తెలంగాణ ప్రైవేటు ఆస్పత్రుల కంటే మెరుగైన వైద్యం ఏపీ ఎయిమ్స్ లో అందుతోంది. అందుకే, తెలంగాణలోని పేదల రోగులు ఏపీలోని మంగళగిరి వద్ద ఉన్న ఎయిమ్స్ కు క్యూ కడుతున్నారు. ఢిల్లీ ఎయిమ్స్ కు ఏ మాత్రం తీసిపోకుండా ఏపీ ఎయిమ్స్ సేవలను అందిస్తూ అద్భుతమైన హాస్పిటల్ గా అనతికాలంలో పేరుగాంచింది. స్వల్ప యూజర్ చార్జీలతో నాణ్యమైన చికిత్సను అందిస్తోంది. అక్కడ వసూలు చేస్తోన్న యూజర్ చార్జీలు, ఇతరత్రా పరీక్షల వివరాలు ఇలా ఉన్నాయి.
* ఓపీ కేవలం రూ. 10లు ఆ రూ. 10లు ఫీజ్ తోనే జనరల్ మెడిసిన్, ఆర్థో, eye, ent, దంత వైద్యం, స్కిన్ లాంటివి చూపించుకోవచ్చు
*న్యూరో విభాగం త్వరలోనే ప్రారంభం కానుంది. అతిత్వరలో పూర్తిగా ఆపరేట్ చేయబోతున్నారు.
* రూ. 75లకు అక్కడి క్యాంటీన్ నీట్ గా రుచికరమైన ఆహారం అందిస్తోంది
*బయట రూ. 5 వేల నుంచి రూ. 10 వేలు అయ్యే టెస్టులు కేవలం 500 నుంచీ 600 రూపాయలు
*మంగళగిరి బస్ స్టాండ్ నుంచి బస్సులు ఉన్నాయి కేవలం 10 రూపాయలతో ఆస్పత్రికి చేరొచ్చు. ఆటో ఐతే 30 నుంచి 50 రూపాయలు
*డాక్టర్స్ కూడా అంకితభావంతో పని చేయడం ఎయిమ్స్ ప్రత్యేకత
*ఉదయం 9 గంటలకు వెళ్తే మధ్యాహ్నానికి బయటకు రావొచ్చు . ఈ అద్భుతమైన హాస్పిటల్ ను సామాన్యులు పెద్ద ఎత్తున వినియోగించుకుంటున్నారు.
వివిధ టెస్టులకు అయ్యే చార్జీలు
USER CHARGES: AIMS MANGALAGIRI
Consultation Fee – Rs.10
Complete Blood Count (Hb%, TLC, DLC) – Rs.135
Fasting & Random Blood Sugar- Rs.24+24
Liver Function Test – Rs.225
Kidney Function Test – Rs.225
Lipid Profile – Rs.200
Thyroid profile – Rs.200
ECG – Rs.50
Chest X-Ray – Rs.60
Mammography -Rs.630
Ultrasonography – Rs.323
Urine Analysis – Rs.35
HIV Rapid Test – Rs.150
HBs Ag Rapid Test – Rs.128
ఉమ్మడి ఏపీ విడిపోయిన తరువాత గొప్పగా చెప్పుకునే విజయవం ఏదైనా ఏపీకి ఉందంటే అది ఎయిమ్స్. దాని కోసం చాలా కాలంగా తెలంగాణ రాష్ట్రం పోరాటం చేస్తోంది. కానీ, ఏపీకి విభజన చట్టంలో ఎయిమ్స్ ను కేటాయిస్తూ ఆనాటి యూపీఏ ప్రభుత్వం పొందుపరిచింది. ఆ మేరకు ఎయిమ్స్ ను చకచకా పూర్తి చేయడానికి 2014లో సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు చర్యలు తీసుకున్నారు. త్వరలోనే అన్ని విభాగాలను ఎయిమ్స్ ప్రారంభించనుంది. ఏపీకి ఇదో పెద్ద కలికితురాయిలో నిలుస్తోంది.
Related News
TDP : మంగళగిరి నియోజకవర్గాన్ని దేశంలో నంబర్ వన్గా మారుస్తా: లోకేశ్ రచ్చబండ కార్యక్రమం
Nara Lokesh: టీడీపీ(tdp) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్(Nara Lokesh) ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు ఉదయం మంగళగిరి(Mangalagiri) నియోజకవర్గంలోని తుమ్మపూడిలో రచ్చబండ కార్యక్రమం(Rachabanda program) నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రజలు ఆశీర్వదిస్తే మంగళగిరి నియోజకవర్గాన్ని దేశంలోనే నంబర్ వన్గా తీర్చిదిద్దే బాధ్యత తీసుకుంటానని తెలిపారు. విదేశీ విద్యకు గతంలో తాము అంబేద్కర్ పేరు పెడితే దాని