HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >High Court Notices On Ap Coalition Governments Decision

Ration Rice Distribution: ఏపీ కూటమి ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టు నోటీసులు

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన ఇంటింటి రేషన్ పంపిణీ వాహనాలను కొత్త ప్రభుత్వం పూర్తిగా రద్దు చేయడం కొత్త దుమారం రేపుతోంది. వాహనాల రద్దుతో పాటు డ్రైవర్లు మరియు వారి కుటుంబాలు తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలోకి జారిపోతున్నామని వాపోతున్నారు.

  • Author : Latha Suma Date : 31-05-2025 - 1:08 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
High Court notices on AP coalition government's decision
High Court notices on AP coalition government's decision

Ration Rice Distribution : ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ సరఫరాలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. రేషన్ పంపిణీలో పారదర్శకతను పెంచేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కొన్ని వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించిన ప్రకారం, రాబోయే జూన్ 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా రేషన్ కార్డు లబ్దిదారులకు రేషన్ షాపుల ద్వారానే బియ్యం, ఇతర నిత్యావసర వస్తువుల పంపిణీ జరగనుంది. ఈ మేరకు ప్రభుత్వం ఇప్పటికే అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన ఇంటింటి రేషన్ పంపిణీ వాహనాలను కొత్త ప్రభుత్వం పూర్తిగా రద్దు చేయడం కొత్త దుమారం రేపుతోంది.

Read Also: Samantha : మళ్లీ ఇలాంటి రోజు వస్తుందని అస్సలు ఊహించుకోలేదు – సమంత

వాహనాల రద్దుతో పాటు డ్రైవర్లు మరియు వారి కుటుంబాలు తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలోకి జారిపోతున్నామని వాపోతున్నారు. దాదాపు 9,260 రేషన్ వాహనాలు రాష్ట్రవ్యాప్తంగా సేవలందించగా, వాటిలో నాన్నగా జీవించే వేలాది మంది డ్రైవర్లు ఇప్పుడు ఉపాధి లేక రోడ్డున పడ్డారు. ఈ నేపథ్యంలో రేషన్ వాహనాల తొలగింపుపై నిరసన వ్యక్తం చేస్తూ కొంతమంది డ్రైవర్లు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తమ వాహనాల కొనుగోలుకు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను 2027 వరకు చెల్లించాల్సిన బాధ్యత ఉందని వారు తెలిపారు. ప్రభుత్వం అకస్మాత్తుగా వాహనాల సేవలను నిలిపివేయడంతో రుణాలు తీర్చలేని స్థితిలోకి వచ్చామని, తమ కుటుంబాల ఉనికి స్వయంగా ప్రశ్నార్థకంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై స్పందించిన హైకోర్టు, వాహనాల రద్దుకు సంబంధించి పూర్తి వివరాలను ప్రభుత్వంతో అడిగి, స్పష్టతనివ్వాలని నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

ఇక,  ప్రభుత్వ దృష్టిలో, గతంలో ఉన్న ఇంటింటి పంపిణీ విధానంలో అనేక అవకతవకలు, అక్రమాలు చోటుచేసుకున్నాయని చెబుతోంది. అయితే, దీన్ని సమర్థించే ఆధారాలు ఇంకా వెల్లడించాల్సి ఉంది. మరోవైపు ఉపాధి కోల్పోయిన డ్రైవర్లు ప్రభుత్వాన్ని ఆర్థిక పునరావాసం కల్పించాలన్న డిమాండ్ చేస్తున్నారు. ఇది కూటమి ప్రభుత్వానికి కీలక సవాలుగా మారింది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఎలాంటి ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పిస్తుందా? లేదా రేషన్ వాహనాల పునరుద్ధరణకే మొగ్గు చూపుతుందా? అన్నది ఇప్పటికైతే అనిశ్చితంగా ఉంది. అయితే, ఈ కేసు తీర్పు వలన వాహన డ్రైవర్ల భవిష్యత్తుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా లబ్దిదారులు ఇప్పుడు ప్రభుత్వం తీసుకోనున్న నిర్ణయాలపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Read Also: Bandi Sanjay : కల్వకుంట్ల సినిమాకు..కాంగ్రెస్‌ ప్రొడక్షన్‌: బండి సంజయ్‌


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AP government
  • AP high court
  • Coalition Government
  • Notices
  • Ration Rice Distribution

Related News

Good news from the government for those waiting for pensions.

Andhra Pradesh: పెన్షన్ల కోసం వేచి చూస్తున్న వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్..

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న వితంతు మహిళలకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో త్వరలోనే కొత్తగా 2.20 లక్షల మందికి వితంతు పింఛన్లను మంజూరు చేయనున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రకటించారు. అర్హులైన మహిళలకు రాబోయే ఒకటి రెండు నెలల్లో ప్రతి నెలా రూ. 4 వేల చొప్పున పింఛను అందించేలా మార్గదర్శకాలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. ఏప

  • Good news for farmers in AP: Date fixed for 'Annadatha Sukhibhava' funds release.

    Annadata Sukhibhava: ఏపీలోని రైతులకు శుభవార్త.. అన్నదాత సుఖీభవ నిధులకు ముహూర్తం ఫిక్స్

Latest News

  • Sree Charani: ఐసీసీ టీ20 బౌలింగ్‌ నంబర్ 1 ర్యాంకుల్లో తెలుగమ్మాయి శ్రీచరణి హవా.. ఏపీ గర్విస్తోందన్న మంత్రి లోకేశ్

  • CI Nagaraju: సాయికృష్ణ కేసులో సీఐ నాగరాజు అరెస్ట్

  • Telegram: మళ్లీ టెలిగ్రామ్ సేవలు అందుబాటులోకి

  • George Kurian: కేంద్ర మంత్రి పదవికి జార్జ్ కురియ‌న్ రాజీనామా

  • Men Skincare: మగవారికి కూడా మెరిసే చర్మం కావాలంటే ఇలా చేయాల్సిందే!

Trending News

    • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd