HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >From Aggressive To Absent Peddireddys Betrayal Of Ysrcp

Peddireddy Ramachandra Reddy: వైసీపీకి హ్యాండిచ్చిన పెద్దిరెడ్డి! అప్పుడు ఆలా? ఇప్పుడు ఇలా?

అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నేతలు పెద్ద హడావుడి చేశారు. చంద్రబాబుని అడ్డుకునేందుకు స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. ఆయనను ఇంటికి పంపిస్తామని చెప్పిన వాళ్లే చివరికి అధికారం కోల్పోయాక పక్కకు వెళ్లిపోయారు.

  • Author : Vamsi Chowdary Korata Date : 07-05-2025 - 5:28 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Peddireddy Ramachandra Reddy
Peddireddy Ramachandra Reddy

Peddireddy Ramachandra Reddy: “సాగినంతకాలం నా అంతవాడు లేడంటారు… సాగకపోతే ఊరకే చతికిలపడిపోతారు” అన్న నానుడి ఉమ్మడి చిత్తూరు జిల్లా రాజకీయ నేతలపై, ముఖ్యంగా కుప్పం నియోజకవర్గంలో, చక్కగా సరిపోతుంది. అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నేతలు పెద్ద హడావుడి చేశారు. చంద్రబాబుని అడ్డుకునేందుకు స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. ఆయనను ఇంటికి పంపిస్తామని చెప్పిన వాళ్లే చివరికి అధికారం కోల్పోయాక పక్కకు వెళ్లిపోయారు. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది – జిల్లా స్థాయి నేతలు “మాకేదీ సంబంధం లేదు” అన్నట్లుగా వ్యవహరిస్తుండడంతో కుప్పంలో వైసీపీ స్థితి గందరగోళంగా తయారైంది.

చంద్రబాబు – కుప్పం అనుబంధం:

చంద్రబాబు నాయుడు అంటే కుప్పం, కుప్పం అంటే చంద్రబాబు అన్నంతగా గత నాలుగు దశాబ్దాలుగా ఆయనకు ఈ నియోజకవర్గంతో అవినాభావ సంబంధం ఏర్పడింది. ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని కుప్పంలోనే ప్రారంభించి, తర్వాత రాష్ట్రం అంతటా విస్తరించడం ఆయనకు అలవాటే. డ్రిప్ ఇరిగేషన్, సోలార్ ప్రాజెక్టులు మొదలైనవి అన్నీ మొదట కుప్పంలోనే ప్రారంభమయ్యాయి.

గత ఐదేళ్లలో వైసీపీ నాయకుల దూకుడు:

వైసీపీ అధికారం లో ఉన్నప్పుడు చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు మిథున్ రెడ్డి, మాజీ ఎంపీ రెడ్డప్పతో పాటు పలువురు నేతలు చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. కొంతమంది నేతలు చంద్రబాబుపై వ్యక్తిగత దాడులు చేయడం, ఆయన కులాన్ని టార్గెట్ చేయడం కూడా చేసారు.

ఎన్నికలలో అక్రమాలు – ప్రజా ప్రతినిధులపై కేసులు:

మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్లు తిరస్కరించి ఏకగ్రీవం పేరుతో అధికారం సాధించడం, రాజకీయ ప్రత్యర్థులపై కేసులు పెట్టడం, వ్యాపారాలపై దాడులు చేయడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. కుప్పం సమీపంలోని గ్రానైట్ గనుల దోపిడీ కూడా రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీసింది.

కుప్పంలో పెద్దిరెడ్డి వ్యూహాలు – చివరికి ప్రజలు చంద్రబాబుకే ఓటు:

పెద్దిరెడ్డి రాజకీయంగా కుప్పాన్ని ప్రధానంగా ఉపయోగించుకున్నారు. చంద్రబాబుని ఓడించేందుకు రకరకాల వ్యూహాలు రచించారు. కానీ చివరకు ప్రజలు చంద్రబాబునే గెలిపించారు. ఆ తరువాత వైసీపీ నేతలెందరో బెంగళూరుకు వలస వెళ్ళారు, మరికొందరు మౌనంగా మారిపోయారు.

వైసీపీకి షాక్ – మున్సిపల్ చైర్మన్ పదవిని కోల్పోవడం:

మున్సిపల్ ఎన్నికల్లో తొలుత వైసీపీ అధికారం సాధించింది. కానీ చైర్మన్ సుధీర్ రాజీనామా తర్వాత జరిగిన ఎన్నికలో, వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. కొందరు పార్టీ మారిన కౌన్సిలర్లు టీడీపీకి ఓటేయడంతో, టీడీపీకి విజయం లభించింది. సెల్వరాజు చైర్మన్‌గా ఎన్నికయ్యారు.

పెద్దిరెడ్డి వెనుకాడటం – అనుచరుల అసంతృప్తి:

ఇన్ని పరిణామాల మధ్య కుప్పం రాజకీయాల్లో పెద్దిరెడ్డి గల్లంతవ్వడం, “నాకెందుకు?” అన్నట్టుగా వ్యవహరించడం కుప్పం వైసీపీ కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తి కలిగిస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు కుప్పం పై ఎక్కువ దృష్టి పెట్టిన పెద్దిరెడ్డి ఇప్పుడు మౌనంగా ఉండటంపై కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు.

మళ్ళీ పెద్దిరెడ్డి కుప్పానికి వస్తారా?

ఇప్పుడు ప్రశ్న ఇదే – పెద్దిరెడ్డి మళ్ళీ కుప్పం రాజకీయాల్లో అడుగుపెడతారా? లేక పూర్తిగా తప్పుకుపోతారా? కుప్పంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు మాత్రం ఆయనకు ప్రశ్నలు వేస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AP CM Chandrababu Naidu
  • Big Shock To YCP
  • Kuppam Assembly Constituency
  • MLA Peddireddy Ramachandra Reddy
  • ys jagan

Related News

CM Chandrababu launches the book 'CBN@361 Degrees' in Singapore.

Chandrababu Naidu: సింగపూర్‌లో సీబీఎన్@361 డిగ్రీస్ పుస్తకం ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాలనా దక్షత, దార్శనికతపై రాసిన ‘సీబీఎన్@361 డిగ్రీస్.. పాలీమ్యాథ్’ అనే పుస్తకాన్ని సింగపూర్‌లో ఆవిష్కరించారు. కాకతీయ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని పుస్తకాన్ని విడుదల చేశారు. అనంతరం పుస్తకం తొలి ప్రతులను సింగపూర్‌లోని భారత హైకమిషనర్ శిల్పక్ అంబులే, రాష్ట్ర మంత్రి పి. నారాయణ, అసోసియేషన్ ప్రతినిధు

  • Chandrababu

    Chandrababu Naidu: సింగపూర్‌కు సీఎం చంద్రబాబు.. రెండు రోజులు వరుస భేటీలు..!

  • The people are the ultimate arbiters of a historic victory: Deputy CM Pawan.

    Pawan Kalyan: ఈ చారిత్రక విజయానికి అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలే : డిప్యూటీ సీఎం పవన్

Latest News

  • Wedding Season: మళ్లీ మొదలైన శుభ ఘడియలు.. పెళ్లి బాజాలు కు రెడీ

  • FIFA WC 2026: 200వ గోల్‌ తో చరిత్ర సృష్టించిన మెస్సీ

  • Vishnu priya: మరో వివాదంలో విష్ణుప్రియ.. ‘నా బాడీ కౌంట్ 5’….

  • Annadata Sukhibhava: ఏపీలోని రైతులకు శుభవార్త.. అన్నదాత సుఖీభవ నిధులకు ముహూర్తం ఫిక్స్

  • G7 Summit: జీ7 వేదికగా ట్రంప్ సంచలనం!

Trending News

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd