South Central Railway: గాలిపటాలు ఎగరేస్తున్నారా? ప్రజలకు దక్షిణ మధ్య రైల్వే కీలక సూచన
రైల్వే ప్రాంగణంలో యార్డులు, ట్రాక్లు సమీపంలోని జనావాసాల ప్రాంతాలతో సహా విద్యుత్తు తీగల దగ్గర ఆడుకుంటుండగా పలువురు గాలిపటాలు ఎగరవేయేవారు విద్యుదాఘాతానికి గురై మరణించినట్లు గమనించినట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు.
- Author : Gopichand
Date : 31-12-2024 - 11:30 IST
Published By : Hashtagu Telugu Desk
South Central Railway: సంక్రాంతి పండుగ సీజన్ కావడంతో ప్రజలకు దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) కీలక సూచన చేసింది. రైల్వే విద్యుత్తు లైన్ల దగ్గర గాలిపటాలు ఎగురవేయకండని సూచించారు. విద్యుత్తు తీగల నుండి వేలాడుతున్న గాలిపటం దారాలను తాకడాన్ని నివారించాలని ఈ సందర్భంగా తెలిపారు.
రైల్వే ప్రాంగణంలో యార్డులు, ట్రాక్లు సమీపంలోని జనావాసాల ప్రాంతాలతో సహా విద్యుత్తు తీగల దగ్గర ఆడుకుంటుండగా పలువురు గాలిపటాలు ఎగరవేయేవారు విద్యుదాఘాతానికి గురై మరణించినట్లు గమనించినట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు. ఇలాంటి సంఘటనలు భారతీయ రైల్వేలోని అనేక జోన్లలో మునుపటి సంక్రాంతి పండుగ సీజన్లో, కొన్ని కేసులు నమోదయ్యాయి. ఇందులో వ్యక్తులు 25 కెవి ట్రాక్షన్ ఓవర్హెడ్ కండక్టర్లలో చిక్కుకున్న గాలిపటం దారాలను తాకడంతో విద్యుత్ షాక్లు లేదా విద్యుదాఘాతానికి గురయ్యారని తెలిపారు.
Also Read: KGBV Teachers: కేజీబీవి ఉపాధ్యాయులకు మంత్రి పొన్నం కీలక పిలుపు!
సాధారణంగా ప్రజలచే ఉపయోగించబడే చైనా నుండి దిగుమతి చేయబడిన గాలిపటాల దారాలు, విద్యుత్ వాహకం అవడంవలన అవి మానవ జీవితానికి, క్లిష్టమైన రైల్వే ఎలక్ట్రికల్ మౌలిక సదుపాయాలకు కూడా గణనీయమైన నష్టాలను కలిగిస్తాయన్నారు. ఈ విషయంలో దక్షిణ మధ్య రైల్వే ప్రజల నుండి సంపూర్ణ సహకారాన్ని కోరుతుందన్నారు. రైల్వే ట్రాక్ల దగ్గర గాలిపటాలు ఎగురవేయడాన్ని నివారించాలన్నారు. ఎందుకంటే ఓవర్హెడ్ లైన్లు అధిక వోల్టేజ్ విద్యుత్తో ఛార్జ్ చేయబడినందువలన వాటిని తాకినప్పుడు మానవ జీవితానికి పెను ప్రమాదం కలిగిస్తాయని రైల్వే అధికారులు తెలిపారు. ఓవర్హెడ్ కండక్టర్ల నుండి గాలిపటం దారాలను వేలాడుతున్న సమయంలో రైల్వే అధికారులకు తెలియజేయాలని సూచించారు. తద్వారా శిక్షణ పొందిన సిబ్బంది సురక్షితంగా గాలిపటాల దారాలను తీసివేయగలరని ప్రకటనలో పేర్కొన్నారు.
ఇకపోతే సంక్రాంతి సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని అదనపు రైళ్లను నడపుతుంది. ఇప్పటికే పలు రూట్లలో అదనపు రైళ్లు నడుస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికులు తమ ప్రయాణ తేదీలను బట్టి రైలు వివరాలను తెలుసుకుని ప్రయాణించాలని సూచించారు.