HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Did The Maoist Top Leaders Moved From Karreguttalu To The Ap Odisha Border

Maoist Top Leaders: ఏపీ – తెలంగాణ బార్డర్‌లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా ?

ఏపీ- తెలంగాణ బార్డర్(Maoist Top Leaders) వైపున్న అడవుల్లోకి వెళ్లిన టీమ్‌లోనే మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఉన్నాడనే అంచనాలు వెలువడుతున్నాయి. 

  • Author : Pasha Date : 30-04-2025 - 10:07 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Maoist Top Leaders Karreguttalu To Ap Border Andhra Pradesh

Maoist Top Leaders : తెలంగాణ – ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టల నుంచి మావోయిస్టు అగ్రనేతలు ఎక్కడికి వెళ్లారు ? అనే కోణంలో ఇప్పుడు పోలీసు వర్గాలు అన్వేషణ చేస్తున్నాయి. 15 రోజుల క్రితమే మావోయిస్టు అగ్రనేతల టీమ్‌లు మూడుగా విడిపోయి కర్రెగుట్టల నుంచి వేర్వేరు మార్గాల్లో వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.  ఒక టీమ్ ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా పామిడి వైపు వెళ్లిందని అంటున్నారు. ఇంకో టీమ్ ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ వైపు వెళ్లిందనే ప్రచారం  జరుగుతోంది. మరో టీమ్ ఏపీ- తెలంగాణ బార్డర్ వైపు వెళ్లిందని సమాచారం.  ఏపీ- తెలంగాణ బార్డర్(Maoist Top Leaders) వైపున్న అడవుల్లోకి వెళ్లిన టీమ్‌లోనే మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఉన్నాడనే అంచనాలు వెలువడుతున్నాయి.  హిడ్మా వెంటే అతడి ప్రత్యేక  గెరిల్లా టీమ్ ఉందట. అందులో దాదాపు 2వేల మంది సభ్యులు ఉన్నారని అంచనా వేస్తున్నారు.  మొత్తం మీద కర్రెగుట్టల్లోనే ఉన్నామంటూ తెలంగాణ పోలీసు బలగాలు, భద్రతా బలగాలను ఆలోచింపజేసి.. అకస్మాత్తుగా మావోయిస్టులు రూట్ మార్చారు. సేఫ్‌గా ఇతర్రతా ప్రాంతాలకు తరలిపోయారు.

Also Read :Operation Sandwich: పాకిస్తాన్‌ ముట్టడికి భారత్ బిగ్ ‘శాండ్‌విచ్’ స్కెచ్!

ఏపీ ఏజెన్సీలో.. 

ఏపీ – తెలంగాణ బార్డర్‌లో ఇప్పుడు వేడి రాచుకుంది. నిఘా వర్గాల సమాచారంతో ఏపీ పోలీసులూ అలర్ట్ మోడ్‌లోకి వచ్చారు. సోమవారం రోజు అల్లూరు సీతారామరాజు జిల్లా కొయ్యూరు, వై.రామవరం, జీకే వీధి మండలాల సరిహద్దుల్లోని కాకులమామిడి గ్రామం వద్ద పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు జరిగాయి.  దాదాపు 15 మంది మావోయిస్టులు అక్కడి నుంచి తప్పించుకొని వెళ్లారు.  దీంతో అదనపు పోలీసు బలగాలను రంగంలోకి దింపి ఆ అడవులను జల్లెడ పడుతున్నారు.

Also Read :India Vs Pakistan: 24 నుంచి 36 గంటల్లోగా భారత్ ఎటాక్ : పాకిస్తాన్

గాజర్ల రవి, జగన్‌లు..

సోమవారం రోజే మధ్యాహ్నం 2.30 గంటలకు కాంటవరం అటవీ ప్రాంతంలో భద్రతాబలగాలకు మరోసారి మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో ఇరు వర్గాల మధ్య కాల్పులు జరిగాయి. అక్కడి నుంచి కూడా తప్పించుకున్న మావోయిస్టులలో  కీలకనేతలు గాజర్ల రవి, జగన్‌లు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. పోలీసుల కాల్పుల్లో కొందరు మావోయిస్టులకు గాయాలు అయినందున.. వారు వెంటనే దూర ప్రాంతానికి వెళ్లే అవకాశం లేదు. దీంతో ఆ అడవుల్లో పోలీసులు కూంబింగ్‌ను ముమ్మరం చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • AP Border
  • AP Odisha Border
  • crime
  • Karreguttalu
  • Maoist Top Leaders
  • maoists

Related News

Another major twist in the Tuni missing case: Key details revealed in the dog's post-mortem report.

Jnaneswari: తుని మిస్సింగ్ కేసులో మరో బిగ్ ట్విస్ట్.. కుక్క పోస్ట్ మార్టం రిపోర్టులో బయటపడ్డ కీలక విషయాలు

ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా తుని పట్టణంలో సంచలనం సృష్టించిన చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు విచారణలో భాగంగా పోలీసులు కీలక సమాచారాన్ని వెల్లడించారు. ఈ కేసు దర్యాప్తులో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న పెంపుడు కుక్క మృతిపై అనుమానాలను నివృత్తి చేస్తూ అధికారులు పోస్ట్‌మార్టం నివేదికను విడుదల చేశారు. జూన్ 13న మరణించిన ఆ పెంపుడు కుక్కకు మరుసటి రోజే (జూన్ 14) పశువై

  • Cbn Speech

    Chandrababu : విశాఖ ఫార్మా సిటీ అగ్ని ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు విచారం

  • Health Minister

    AP : ఐదు బోధనాసుపత్రుల్లో కృత్రిమ అవయవాల తయారీ యూనిట్లు!

Latest News

  • Uric acid: కీళ్ల నొప్పులు బాధిస్తున్నాయి? అయితే శరీరంలో ఇది జరిగి ఉండవచ్చు..!!

  • Lord Shiva: నీలకంఠునికి ఏ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే ఫలితం ఉంటుంది?

  • Lemon Water: ఉదయాన్నే లెమన్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా..!

  • Rains: తెలంగాణకు భారీ వర్షసూచన

  • Amaravati Farmers: వైకాపా నేతల పర్యటనను అడ్డుకున్న రాజధాని రైతులు

Trending News

    • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd