HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Cm Jagan Special Foucs On Mla Qouta Mlc Elections

YSRCP : సొంత‌పార్టీ నేత‌ల‌పై సీఎం జ‌గ‌న్ నిఘా..? ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌పై అధికార పార్టీలో టెన్ష‌న్‌

ఏపీలో అధికార వైసీపీలో ఎమ్మెల్సీ ఎన్నిక‌ల టెన్ష‌న్ ఇంకా కొనసాగుతుంది. తాజాగా మూడు ప‌ట్ట‌భ‌ద్రుల స్థానాల‌ను టీడీపీ

  • Author : Prasad Date : 20-03-2023 - 8:34 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Talk Of YCP MLAs
Jagan Review

ఏపీలో అధికార వైసీపీలో ఎమ్మెల్సీ ఎన్నిక‌ల టెన్ష‌న్ ఇంకా కొనసాగుతుంది. తాజాగా మూడు ప‌ట్ట‌భ‌ద్రుల స్థానాల‌ను టీడీపీ గెలుచుకోవ‌డం వైసీపీలో టెన్ష‌న్ పుట్టిస్తుంది. ఈ నెల 23 న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో టీడీపీ కూడా నామినేష‌న్ వేయ‌డంతో వైసీపీలో మ‌రింత టెన్ష‌న్ పెరిగింది. ఈ నేప‌స‌థ్యంలోనే సొంత పార్టీ ఎమ్మెల్యేలపైనే ముఖ్యమంత్రి జగన్‌ నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకూ పలు జిల్లాల్లో ఒకరిద్దరు ఎమ్మెల్యేలను పోలీసులు మఫ్టీలో అనుసరిస్తున్నట్లు సమాచారం. నిఘా వర్గాలు సైతం వారి కదలికలు, మాటామంతీపై కన్నేసినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటేస్తారేమోనన్న భయమే దీనికి కారణంగా కనిపిస్తోంది. ఎమ్మెల్యేలు ఎన్నుకునే ఎమ్మెల్సీల ఎన్నికలు ఈ నెల 23న జరుగనున్నాయి. ఏడు స్థానాలకు ఎన్నికలు జరుగనుండగా.. ఒక్కో అభ్యర్థికి 22 మంది ఎమ్మెల్యేలు ఓటేస్తేనే విజయం వరిస్తుంది.

వైసీపీ ఏడు స్థానాలకూ అభ్యర్థులను నిలిపింది. 22 మంది ఎమ్మెల్యేల చొప్పున 154 ఓట్లు పడితేనే అందరూ గెలిచే అవకాశం ఉంటుంది. అయితే వైసీపీకి ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య 151 మాత్రమే. టీడీపీ నుంచి గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలు(వాసుపల్లి గణేశ్‌, వల్లభనేని వంశీ, మద్దాలి గిరి, కరణం బలరాం) ఇప్పుడు వైసీపీతో ఉన్నారు. జనసేన ఏకైక సభ్యుడు రాపాక వరప్రసాద్‌ సైతం వైసీపీతోనే ఉండడంతో తమ పార్టీ అభ్యర్థులు ఏడుగురూ గెలుస్తారని వైసీపీ ధీమాగా ఉంది. అయితే అనూహ్యంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తమ పార్టీ తరఫున బీసీ మహిళ పంచుమర్తి అనూరాధను పోటీకి దించారు. అసెంబ్లీలో టీడీపీకి 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నందున ఎందుకు పోటీ చేయకూడదని ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. టీడీపీకి నలుగురు ఎమ్మెల్యేలు దూరమైనా ఏ ధీమాతో చంద్రబాబు తమ అభ్యర్థిని నిలబెట్టారా అని ప్రభుత్వ పెద్దలు ఆరా తీశారు.

సీఎంకు తన పార్టీ ఎమ్మెల్యేలపై అనుమానాలు మొదలయ్యాయని ప్ర‌తిప‌క్షాల్లో టాక్ వినిపిస్తుంది. అటు నుంచి నలుగురు తమవైపు వచ్చినట్లే.. ఇటు నుంచి ఎవరైనా టీడీపీకి ఓటేస్తారేమోనని భయం పట్టుకున్నట్లు అధికార పార్టీలో కనిపిస్తోంది. నెల్లూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి వైసీపీ అభ్యర్థులకు ఓటేస్తారనే నమ్మకం లేదు. అంతరాత్మ ప్రబోధానుసారం ఓటు వేస్తామని వీరు ఇప్పటికే ప్రకటించారు. టీడీపీ అభ్యర్థికి ఆ ఇద్దరూ ఓటేస్తే ప్రతిపక్షం బలం 21కి చేరుతుంది. మరొక్క ఓటు పడితే టీడీపీ గెలుస్తుంది. పట్టభద్రుల ఎమ్మెల్సీల గెలుపుతో ఊపుమీదున్న సైకిల్‌ వైపు వైసీపీ ఎమ్మెల్యేలెవరైనా మొగ్గితే.. వైసీపీ అభ్యర్థుల్లో ఒకరు ఓడిపోతారు. వచ్చే ఎన్నికల్లో టికెట్‌ ఇవ్వరని.. ఈ నాలుగేళ్లలో సీఎం తమకు అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వలేదని కొందరు ఎమ్మెల్యేలు ఇప్పటికే అసంతృప్తితో ఉన్నట్లు వైసీపీలోనే ప్రచారం జరుగుతోంది.

ఆనం, కోటంరెడ్డి కాకుండా నెల్లూరు జిల్లాలో మరో ఎమ్మెల్యే అధిష్ఠానంపై గుర్రుగా ఉన్నట్లు తెలిసింది. విశాఖపట్నం, ఉభయ గోదావరి, కృష్ణా. ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున.. గుంటూరు జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలు సొంత పార్టీకి ఓటేస్తారో లేదోనని ప్రభుత్వ పెద్దలు అనుమానిస్తున్నారు. దీంతో వారిపై పోలీసులతోపాటు పార్టీ శ్రేణులతోనూ నిఘా పెట్టారు. నిఘా వర్గాలు సైతం వారి కదలికలపై నిరంతరం ఆరా తీస్తున్నట్లు సమాచారం. టీడీపీలో గెలిచి వైసీపీతో సఖ్యతగా ఉన్న ఒక ఎమ్మెల్యే సైతం ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఆయన్ను కూడా ఓ కంట కనిపెట్టినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే 23వ తేదీన జరిగే ఓటింగ్‌కు హాజరు కావాలని వైసీపీ నాయకత్వం పార్టీ ఎమ్మెల్యేలందరికీ విప్‌ జారీ చేసింది. ఇప్పటికే ఒక్కో అభ్యర్థికి ఓటేయాల్సిన 22 మంది ఎమ్మెల్యేలను ఎంపిక చేసింది. వారికి అవగాహన కోసం మాక్‌ ఓటింగ్‌నూ నిర్వహించింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • chandrababu naidu
  • cm jagan
  • MLC
  • tdp
  • ysrcp

Related News

CM Chandrababu Naidu visits Delhi seeking central support for state development

రాష్ట్రాభివృద్ధికి కేంద్ర సహకారం కోరుతూ ఢిల్లీకి సీఎం చంద్రబాబు

ఈ పర్యటనలో భాగంగా రేపు శుక్రవారం రోజున ఆయన వరుసగా ఆరుగురు కేంద్ర మంత్రులతో కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సమావేశాల్లో రాష్ట్రానికి సంబంధించిన వివిధ రంగాల ప్రాజెక్టులు, వాటి ప్రస్తుత పురోగతి, ఎదురవుతున్న సవాళ్లు, కేంద్రం నుంచి అవసరమైన ఆర్థిక సహాయం, అనుమతులు వంటి అంశాలపై ముఖ్యమంత్రి సమగ్రంగా చర్చించనున్నారు.

  • Btechravi

    జగన్‌కు షాక్.. టీడీపీలోకి వైసీపీ కీలక నేత

Latest News

  • బ్రేకింగ్‌.. భార‌త్‌పై పాక్ ఘ‌న‌విజ‌యం!

  • 2026లో జరగబోయే 10 ప్రధాన క్రీడా టోర్నమెంట్లు ఇవే!

  • మహారాష్ట్ర లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీ విజయఢంకా

  • యూరియా యాప్ తో రైతుల కష్టాలు తీరినట్లేనా ?

  • హైడ్రా కమిషనర్ గన్ మెన్ ఆత్మహత్యాయత్నం

Trending News

    • క్రెడిట్ కార్డ్ బిజినెస్.. బ్యాంకులు ఎందుకు అంతగా ఆఫర్లు ఇస్తాయి? అసలు లాభం ఎవరికి?

    • 2026 బడ్జెట్.. ఫిబ్రవరి 1 ఆదివారం.. అయినా బడ్జెట్ అప్పుడేనా?

    • అభిషేక్ శర్మ రికార్డు బద్దలు కొట్టిన పాండ్యా!

    • 10 గ్రాముల బంగారం ధర రూ. 40 ల‌క్ష‌లా?!

    • ఆ కార్యక్రమంలో అవినీతి.. ప్రధాని మోదీపై జగన్ ఆరోపణలు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd