HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Cm Jagan Releases Funds For Rythu Bharosa Scheme

YSR Rythu Bharosa: రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం జగన్

రైతు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రైతులను మోసం చేశారని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఈ రోజు వైఎస్‌ఆర్‌ రైతు భరోసా - పీఎం కిసాన్‌ మూడో విడత ఆర్థిక సహాయం

  • Author : Praveen Aluthuru Date : 28-02-2024 - 3:56 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
YSR Rythu Bharosa
YSR Rythu Bharosa

YSR Rythu Bharosa: రైతు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రైతులను మోసం చేశారని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఈ రోజు వైఎస్‌ఆర్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌ మూడో విడత ఆర్థిక సహాయం కింద రూ 1,078.36 కోట్లు, వైఎస్‌ఆర్‌ సున్నా వడ్డీ పంట రుణాల కింద రూ.215.98 కోట్లు సీఎం జగన్ విడుదల చేశారు. క్యాంపు కార్యాలయం నుండి నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి సాయాన్ని జమ చేసిన సీఎం జగన్, వరుసగా ఐదవ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ రైతు భరోసా కింద రైతులకు ఆర్థిక సహాయం అందించింది.

సీఎం జగన్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కావాలనే తపనతో చంద్రబాబు నాయుడు రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణమాఫీని ప్రకటించారు. అయితే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి రుణమాఫీ చేయకుండా రైతులకు వ్యవసాయ రుణ పత్రాలు ఇస్తూ రైతులను మోసం చేసినట్లు ఆరోపించారు. తదనంతరం జీరో-వడ్డీ సబ్సిడీ పథకాన్ని చంద్రబాబు రద్దు చేశారని చెప్పారు. చంద్రబాబు హయాంలో రైతులు ఏటా రూ.5,000 – 6,000 కోట్ల వడ్డీ, చక్రవడ్డీలు చెల్లించారని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో రైతు భరోసా పథకం కింద 53.58 లక్షల మంది రైతులకు ఆర్థిక సహాయం అందగా, 10.78 లక్షల మంది రైతులు సున్న వడ్డి, పంట రుణాల ప్రయోజనాలను పొందారని గుర్తు చేశారు సీఎం జగన్.

వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద ప్రతి సంవత్సరం రూ 13,500 సాయం అందజేస్తోంది. మొత్తం మూడు విడతలుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత ఏడాది రైతులకు రూ.11,500 చొప్పున రెండు విడతల ఆర్థిక సాయం అందించింది. ఈ పథకం కింద మూడో విడతగా రూ.2000 ఆర్థిక సహాయాన్ని ఈరోజు ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్రంలోని 53.58 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో ఈ సాయం జమ అవుతుంది.

రాష్ట్ర రైతుల శ్రేయస్సుపైనే రాష్ట్ర సంక్షేమం ఆధారపడి ఉందని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం బలంగా విశ్వసిస్తోందని అన్నారు సీఎం జగన్. గత 57 నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయం రైతులు, రైతుకూలీల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని తీసుకున్నామని సీఎం జగన్ అన్నారు. రైతులకు మేలు చేసేందుకు తమ ప్రభుత్వం మేనిఫెస్టోలో వాగ్దానం చేసిన దానికంటే ఎక్కువే అందించిందని, తమ ప్రభుత్వం మెరుగైన పనితీరు కనబరిచారని సీఎం జగన్‌ పేర్కొన్నారు. ప్రతి రైతుకు ఐదేళ్లలో రూ.50 వేలు ఇస్తామని హామీ ఇచ్చామని, అయితే రూ.67,500 అంటే రూ.17,500 అదనంగా ఇచ్చామని చెప్పారు. వైఎస్ఆర్ సున్న వడ్డి పంట రుణాల కింద రాష్ట్ర ప్రభుత్వం నేడు రూ.215.98 కోట్లు విడుదల చేసి 10.78 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూర్చినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు.

Also Read: Bill Gates : నిరుపేదల బస్తీలో అపర కుబేరుడు బిల్‌గేట్స్.. పర్యటన విశేషాలివీ


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 1078.36 crore
  • 215.98 crore
  • chandrababu
  • cm jagan
  • credit interest
  • farmers
  • pm kisan
  • rythu bharosa
  • tdp
  • ysr
  • ysrcp

Related News

Modi- Chandrababu

ప్ర‌ధాని రేసులో సీఎం చంద్ర‌బాబు?!

మోడీ తర్వాత బీజేపీలో అత్యంత శక్తివంతమైన నేతగా ఉన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రధాని పదవికి మొదటి వరుసలో ఉన్నారు. పార్టీపై ఆయనకున్న పట్టు, ఎన్నికల వ్యూహకర్తగా ఆయనకున్న గుర్తింపు దీనికి ప్రధాన కారణాలు.

  • 'Bulldozer politics' on Rural Employment Act: Sonia Gandhi criticizes

    గ్రామీణ ఉపాధి చట్టంపై ‘బుల్డోజర్ రాజకీయాలు’: సోనియా గాంధీ విమర్శలు

  • CM Revanth Leadership

    రైతులకు తీపి కబురు తెలిపిన రేవంత్ సర్కార్

  • Lokesh Family Stars

    లోకేష్ కు ‘ఇంటివారితో’ పెద్ద కష్టమే వచ్చిపడింది !!

  • Btechravi

    జగన్‌కు షాక్.. టీడీపీలోకి వైసీపీ కీలక నేత

Latest News

  • టెస్ట్ క్రికెట్‌కు విలియ‌మ్స‌న్‌ రిటైర్మెంట్?!

  • కొత్త పథకాలను ప్రవేశ పెట్టేందుకు రేవంత్ ప్రభుత్వం కసరత్తు

  • పిల్లలతో అలాంటి పనులేంటి జగన్ – మంత్రి అనిత కీలక వ్యాఖ్యలు

  • ‘పదేళ్ల పాలనకు స్వస్తి చెప్పి ప్రజలు మీ తోలు తీశారు’ అంటూ కేసీఆర్ పై పొన్నం ఫైర్

  • నీ చరిత్ర ఇది రేవంత్ – హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు

Trending News

    • జాతీయ గణిత దినోత్సవం..డిసెంబరు 22న దేశవ్యాప్తంగా గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ పుట్టినరోజు సందర్భంగా ఈ జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకుంటారు.

    • 2026 రిలేషన్‌షిప్ టిప్స్.. భాగస్వామి జీవితాన్ని మార్చే నిర్ణ‌యాలీవే!

    • బుర్జ్ ఖలీఫా రికార్డు గల్లంతు.. త్వరలో ప్రపంచంలోనే ఎత్తైన భవనంగా జెడ్డా టవర్!

    • క్రెడిట్ కార్డ్ బిజినెస్.. బ్యాంకులు ఎందుకు అంతగా ఆఫర్లు ఇస్తాయి? అసలు లాభం ఎవరికి?

    • 2026 బడ్జెట్.. ఫిబ్రవరి 1 ఆదివారం.. అయినా బడ్జెట్ అప్పుడేనా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd