HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Central Government Issues Go Allocating Huge Amount Of Urea To Ap

CM Chandrababu : ఏపీకి భారీగా యూరియా కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం జీవో జారీ

రాష్ట్రానికి అత్యవసరంగా యూరియా సరఫరా చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. కాకినాడ పోర్టుకు చేరుకున్న నౌక నుంచి రాష్ట్రానికి అత్యవసరంగా యూరియాను కేటాయించాలని కోరిన చంద్రబాబు విజ్ఞప్తికి కేంద్ర మంత్రి నడ్డా వెంటనే స్పందించారు.

  • Author : Latha Suma Date : 09-09-2025 - 10:39 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Central government issues GO allocating huge amount of urea to AP
Central government issues GO allocating huge amount of urea to AP

CM Chandrababu : ఆంధ్రప్రదేశ్‌లో యూరియా కొరత ఉద్ధృతంగా ఉన్న నేపథ్యంలో, రాష్ట్ర రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేరుగా రంగంలోకి దిగారు. రాష్ట్రవ్యాప్తంగా ఎరువుల అందుబావుతో సంబంధించి సమీక్ష నిర్వహిస్తున్న సందర్భంలోనే, ఆయన నేరుగా కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి జేపీ నడ్డాకు ఫోన్ చేశారు. రాష్ట్రానికి అత్యవసరంగా యూరియా సరఫరా చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. కాకినాడ పోర్టుకు చేరుకున్న నౌక నుంచి రాష్ట్రానికి అత్యవసరంగా యూరియాను కేటాయించాలని కోరిన చంద్రబాబు విజ్ఞప్తికి కేంద్ర మంత్రి నడ్డా వెంటనే స్పందించారు. దీనికి తక్షణ ప్రతిస్పందనగా, కేంద్ర ప్రభుత్వం 17,293 మెట్రిక్ టన్నుల యూరియాను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయిస్తూ అధికారిక ఉత్తర్వులు విడుదల చేసింది.

Read Also: Malla Reddy : ఏపీ అభివృద్ధిలో చంద్రబాబు స్పీడ్ : మల్లారెడ్డి ప్రశంసలు

ఈ అభివృద్ధికి కారణం ముఖ్యమంత్రి చొరవేనని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఆయన అధికారులను అప్రమత్తం చేస్తూ, తక్షణమే కేటాయించిన యూరియాను జిల్లాలవారీగా తరలించాలని ఆదేశించారు. ముఖ్యంగా అవసరమైన ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన సరఫరా జరిగేలా చూడాలని స్పష్టం చేశారు. అలాగే, ఎరువుల పంపిణీలో పారదర్శకత ఉండాలని, ఎవరైనా బ్లాక్ మార్కెట్‌కు తరలించే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యూరియాను చట్టవ్యతిరేకంగా నిల్వ చేసినా, విక్రయించినా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని మంత్రి అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 80,503 మెట్రిక్ టన్నుల ఎరువులు నిల్వలో ఉన్నాయని వ్యవసాయ శాఖ అధికారులు వివరించారు. దీనితో పాటు కేంద్రం నుంచి వచ్చిన 17,293 మెట్రిక్ టన్నులు చేరితే, రైతుల తాత్కాలిక అవసరాలకు సరిపోతుందని చెప్పారు.

రాబోయే రబీ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రానికి మొత్తం 9.3 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు కేటాయించబడినట్లు అచ్చెన్నాయుడు వెల్లడించారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అవసరమైన ఎరువులు సమయానికి అందేలా చర్యలు తీసుకుంటున్నామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి అధికారులకు స్పష్టంగా సూచనలు ఇచ్చారు. జిల్లా స్థాయిలో అధికారులు రైతులను కలిసేలా చేయాలని, వారి అవసరాలు తెలుసుకొని తగిన సహాయం అందించాలన్నారు. ముఖ్యంగా రైతుల్లో ఆందోళన పెరగకుండా, వారికి ధైర్యం చెప్పే విధంగా వ్యవహరించాలన్నారు. ఇక, నుంచి ఎరువుల సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చూస్తామని, ప్రభుత్వ కృషి రైతుల కోసం అంకితమైందని ఆయన హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి నేరుగా కేంద్రంతో చర్చించి సమస్య పరిష్కరించడమే కాకుండా, భవిష్యత్తు అవసరాలను కూడా ముందుగానే గుర్తించి చర్యలు తీసుకోవడం ప్రశంసనీయమని మంత్రి అన్నారు.

Read Also: Group-1 Case : గ్రూప్-1 వ్యవహారంపై నేడే తీర్పు

 

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Acham Naidu
  • agriculture
  • andhra pradesh
  • central government
  • CM Chandra Babu Naidu
  • fertilizer allocation
  • fertilizer stock
  • JP Nadda
  • rabi season
  • Urea Shortage

Related News

Aravalli

అరావళి పర్వతాల్లో మైనింగ్‌పై కేంద్రం నిషేధం!

ప్రస్తుతం నడుస్తున్న గనుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాలని కేంద్రం తెలిపింది. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పుల ప్రకారం పర్యావరణ భద్రతా చర్యలు ఖచ్చితంగా అమలయ్యేలా చూడాలని ఆదేశించింది.

  • Egg prices soar, burden on the nutritional needs of the common man

    కోడిగుడ్ల ధరలకు రెక్కలు.. సామాన్యుడి పౌష్టికాహారంపై భారం

  • Farmersurea

    యూరియా యాప్ తో రైతుల కష్టాలు తీరినట్లేనా ?

  • CM Chandrababu Naidu visits Delhi seeking central support for state development

    రాష్ట్రాభివృద్ధికి కేంద్ర సహకారం కోరుతూ ఢిల్లీకి సీఎం చంద్రబాబు

  • YS Jagan to meet Governor today with one crore signatures

    కోటి సంతకాలతో నేడు గవర్నర్‌ను కలవనున్న వైఎస్ జగన్

Latest News

  • మీ స్నేహితులు, బంధుమిత్రులకు క్రిస్మస్ ఇలా తెలియజేయండి!

  • క్రిస్మస్ కేక్ కథ.. గంజి నుండి ఫ్రూట్ కేక్ వరకు ఎలా మారింది?

  • క్రిస్మస్ పండుగ.. డిసెంబర్ 25నే ఎందుకు జరుపుకుంటారు?

  • టీ20 వరల్డ్ కప్ 2026 జట్టు నుండి శుభ్‌మన్ గిల్ అవుట్.. కార‌ణ‌మిదేనా?

  • జ‌పాన్‌లో విడుద‌ల‌కు సిద్ధ‌మైన యానిమ‌ల్‌.. డేట్ కూడా ఫిక్స్‌!

Trending News

    • నిధి అగర్వాల్, సమంత పడ్డ వేదన నా మైండ్‌లో నుండి పోలేదు.. అందుకే అలా మాట్లాడాను Sivaji

    • శివాజీ వ్యాఖ్యలను సమర్థించిన కరాటే కల్యాణి

    • ఏపీలో సమగ్ర కుటుంబ సర్వే.. తల్లికి వందనం, ఇతర పథకాలపై ప్రభావం?!

    • సూర్యకుమార్ యాదవ్ తర్వాత భార‌త్ తదుపరి కెప్టెన్ ఎవరు?

    • భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd