HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ap Assembly Session Governor Speech Walkout Ysrcp

AP Assembly Session : అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగం.. మధ్యలోనే వైసీపీ వాకౌట్‌

AP Assembly Session : ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ఉభయ సభలకు ప్రసంగిస్తూ, గత ప్రభుత్వం పనితీరు పై విమర్శలు చేశారు. అలాగే, ప్రస్తుత ప్రభుత్వ పథకాల గురించి వివరించారు. అయితే, గవర్నర్‌ ప్రసంగం ప్రారంభమయ్యే సరికి వైసీపీ సభ్యులు నిరసన ప్రకటిస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు.

  • Author : Kavya Krishna Date : 24-02-2025 - 10:35 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ap Assembly Session
Ap Assembly Session

AP Assembly Session : ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్ ప్రసంగిస్తున్నారు. సమావేశాలకు వైసీపీ అధ్యక్షుడు జగన్‌ మోహన్ రెడ్డి కూడా హాజరయ్యారు. గవర్నర్‌ ప్రసంగం మొదలైన వెంటనే వైసీపీ సభ్యులు సభలో నినాదాలు ప్రారంభించారు. దీంతో సభలో నిరసనల మధ్య గవర్నర్‌ ప్రసంగం కొనసాగించారు. అన్ని అంశాలల్లోనూ గత ప్రభుత్వం విఫలమైంది గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్ వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం తీరుకు ఓటుతో ప్రజలు గుణపాఠం చెప్పారని అబ్దుల్‌ నజీర్‌ అన్నారు. అన్ని అంశాలల్లోనూ గత ప్రభుత్వం విఫలమైందని ఆయన ప్రసంగంలో అన్నారు. ఆర్థికంగా రాష్ట్రాన్ని ఎంతో దెబ్బతీశారని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఏడు శ్వేతపత్రాలు విడుదల చేశామని తన ప్రసంగంలో వెల్లడించారు గవర్నర్‌ నజీర్‌.

Keerthy Suresh: కీర్తి సురేష్ సినిమాలకు గుడ్ బై చెప్పబోతోందా.. అభిమానులకు షాక్ తప్పదా?

కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సూపర్‌ సిక్స్‌ పథకాలతో ప్రజలకు మేలు చేస్తున్నామని, 200 అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశామన్నారు అబ్దుల్‌ నజీర్‌. పెన్షన్లు రూ.4 వేలకు పెంచామని, మెగా డీఎస్సీని నిర్వహించబోతున్నామని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా.. అధికారంలోకి రాగానే ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ రద్దు చేశామని ఆయన తెలిపారు. పోలవరం ప్రాజెక్టును పట్టాలెక్కించామని, స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ ఆగిపోయిందని గవర్నర్‌ నజీర్‌ తెలిపారు. ఇదిలా ఉంటే.. అసెంబ్లీ సమావేశాలను తొలిరోజే వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు.. గవర్నర్‌ ప్రసంగం మధ్యలోనే సభ నుంచి వైసీపీ సభ్యులు వెళ్లిపోయారు. గవర్నర్‌ ప్రసంగం ప్రారంభమైన తర్వాత ప్రతిపక్షాన్ని గుర్తించండి.. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అంటూ కాసేపు నినాదాలు చేశారు వైసీపీ సభ్యులు.. ఆ తర్వాత వైసీపీ సభ్యులు అంసెబ్లీ నుంచి వాకౌట్ చేశారు..

Samantha : ఫోన్ కి దూరంగా ఉన్న సమంత.. ఆ హీరోయిన్స్ పర్ఫార్మెన్స్ నచ్చాయట..


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Abdul Nazeer
  • andhra pradesh
  • Assembly Session
  • governor speech
  • jagan mohan reddy
  • Opposition Walkout
  • political news
  • protest
  • state government
  • ysrcp

Related News

AP

AP : కుప్పంలో పీఎం మిత్రా పార్క్, అమరావతిలో నిఫ్ట్.. కేంద్రానికి ఏపీ ప్రతిపాదనలు

ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయం, జౌళి రంగాలను అనుసంధానిస్తూ రైతులకు అదనపు ఆదాయం కల్పించే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి పలు కీలక ప్రతిపాదనలు సమర్పించారు. సచివాలయంలో కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్‌తో జరిగిన సమావేశంలో రాష్ట్రంలోని ఫైబర్ ఉత్పత్తి, వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి సంబంధించిన అంశాలను ప్రస్తావించారు. రాష్ట్రంలో అరటి, కొబ్బరి, వెదురు

  • Indrakeeladri

    Vijayawada : ఇంద్రకీలాద్రికి పోటెత్తిభ‌క్తులు.. వేసవి దృష్ట్యా ప్ర‌త్యేక ఏర్పాట్లు చేసిన అధికారులు

  • Gade Venkatreddy

    Gade Venkatreddy : మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి కన్నుమూత

  • Imresizer Whatsapp Image 2026 05 29 At 4.10.59 Pm

    TDP : యువత భవిష్యత్తును చీకట్లోకి నెట్టిన చరిత్ర జగన్ కుటుంబానిదే: ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంభూపాల్ రెడ్డి

  • Electric Shock

    Vijayawada : విజయవాడలో బక్రీద్ పండుగ రోజు విషాద ఘటన.. కరెంట్ షాక్‌తో హోంగార్డు మృతి

Latest News

  • New Currency : త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు?.. ఆర్‌బీఐ కసరత్తు వేగవంతం

  • Road Accident : ఖ‌మ్మం గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఘోర రోడ్డు ప్ర‌మాదం.. కానిస్టేబుల్ మృతి

  • Delhi : పెళ్లికి కోటి రూపాయలకు పైగా ఖర్చు.. 17 నెలల్లోనే కూతురు మృతి

  • CM Revanth Reddy : రెండ‌వ ద‌శ ఇందిర‌మ్మ ఇళ్లు మంజూరు .. జూన్ 1న ప్రారంభించ‌నున్న సీఎం రేవంత్

  • Karnataka New CM : కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్.. జూన్ 3న ప్రమాణ స్వీకారం

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd