HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >A New Disease Is Terrorizing Uttarandhra

Srikakulam : ఉత్తరాంధ్రను వణికిస్తున్న కొత్త వ్యాధి?

  • By Vamsi Chowdary Korata Published Date - 10:57 AM, Tue - 25 November 25
  • daily-hunt
Scrub Typhus
Scrub Typhus

శ్రీకాకుళం జిల్లాలో స్క్రబ్ టైఫస్ అనే వ్యాధి కలకలం సృష్టిస్తోంది. వారం రోజుల్లో ఏడు కేసులు నమోదు కావడంతో ఆందోళనలు నెలకొన్నాయి. ఈ వ్యాధి బారిన పడిన వారిలో తొమ్మిది నెలల శిశువు కూడా ఉంది. అయితే ఈ స్క్రబ్ టైఫస్ వ్యాధి పట్ల జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. లార్వల్ మైట్స్ అనే పురుగులు కుట్టడం ద్వారా ఈ వ్యాధి వస్తుందని.. తీవ్ర జ్వరం, ఆయాసం, దగ్గు వంటి లక్షణాలు మూడు రోజులకు పైగా ఉంటే.. వెంటనే వైద్యులను సంప్రదించాలని చెబుతున్నారు.

శ్రీకాకుళం జిల్లాను స్క్రబ్‌ టైఫస్‌ వ్యాధి వణిస్తోంది. ఈ వ్యాధి బారిన పడిన వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దాదాపు వారం రోజుల్లోనే ఏడు కేసులు నమోదు కావడంతో ఆందోళనలు నెలకొన్నాయి. ఇప్పటికే మూడు మండలాల్లోని ఏడు గ్రామాల్లో ఒక్కొక్కరు ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం వారికి చికిత్స కొనసాగుతోంది. దాశరథిపురం, కడుము, అక్రాపల్లి, అంబావల్లి గ్రామాలకు చెందిన వారికి ఈ వ్యాధి సోకింది. ఇందులో ఒక 9 నెలల శిశువు కూడా ఉంది.

స్క్రబ్‌ టైఫస్‌ లేదా బుష్ టైఫస్ అనేది ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. చిన్నపాటి లార్వల్ మైట్స్ అనే పురుగు కుట్టడం ద్వారా వస్తుంది. ఇలాంటి పురుగులు ఎక్కువగా వ్యవసాయ భూములు, కొండ ప్రాంతాల్లో ఉంటాయి. పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటం, చెత్త, పనికిరాని మొక్కలు, తేమ, మురుగు ఉన్న ప్రదేశాల్లో స్క్రబ్ టైఫస్ పురుగు ఉంటుంది. కాబట్టి.. అలాంటి ప్రాంతాల్లో స్క్రబ్ టైఫస్ వ్యాధి సోకుతుంది. శీతకాలంలో ఈ వ్యాధి ప్రభావం ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. మూడేళ్ల కిందట- 2022లో కూడా లావేరు మండలం అప్పాపురం గ్రామస్థులకు కూడా ఈ వ్యాధి సోకింది. అనంతరం అధికారులు రంగంలోకి దిగి.. పారిశుద్ధ్య చర్యలు చేపట్టి వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడంతో.. ఈ స్క్రబ్ టైఫస్ నియంత్రణలోకి వచ్చింది.

లార్వల్ మైట్స్ పురుగులు కుట్టిన ప్రదేశంలో నల్లగా అవుతుంది. చర్మం ఎరుపెక్కి చిన్నపాటి దద్దుర్లు వస్తాయి. స్క్రబ్ టైఫస్ వ్యాధి సోకితే.. దగ్గు, జ్వరం, జలుబు, నీరసం, కీళ్ల, తలనొప్పులతో బాధపడతారు. శరీరంలో ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గుతుంది. అయితే ఈ వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే.. వైద్యులను సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు. లేకుంటే జ్వరం తీవ్రమవడంతో పాటు ఊపిరితిత్తుల సమస్యలు, పచ్చకామెర్లు, రక్తం గడ్డకట్టడం, శ్వాసకోస ఇబ్బందులు తలెత్తుతాయని చెబుతున్నారు. నిర్లక్ష్యం చేస్తే కిడ్నీలు, మెదడుపై ప్రభావం చూపే అవకాశం ఉందని డాక్టర్లు చెబుతున్నారు.

స్క్రబ్ టైఫస్ వ్యాధి రాకుండా ఉండాలంటే.. ముందుగా లార్వల్ మైట్స్ పురుగులను దగ్గరికి రానివ్వొద్దు. అందుకోసం చెత్త పేరుకుపోకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇంట్లో పొడి వాతావరణం ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి. తడిసిన దుస్తులు వేసుకోవవద్దు. కాళ్లు, చేతులు పూర్తిగా కప్పి ఉంచేలా దుస్తులు వేసుకోవాలి. పొలాల్లో పనిచేసేటప్పుడైనా, ఇంట్లో ఉన్న సమయంలోనైనా ఏదైనా పురుగు కుట్టినట్లు అనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఈ వ్వాధి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేకపోయినా.. చిన్న పురుగే కదా అని నిర్లక్ష్యం చేయకూడదని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ వ్యాధి ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఉండే ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • larval mites
  • scrub typhus
  • Scrub Typhus Disease
  • scrub typhus symptoms
  • srikakulam

Related News

Sankranti Private Travels

Private Travels Ticket Rates : సంక్రాంతికి ఊరు వెళ్దామనుకుంటున్నారా.. మీకో బ్యాడ్‌న్యూస్!

సంక్రాంతికి ఊరెళ్లాలనుకునేవారికి ప్రైవేట్ ట్రావెల్స్ షాకిస్తున్నాయి. రైల్వే, ఆర్టీసీ జనవరి కోటా టికెట్లు నిమిషాల్లోనే అయిపోవడంతో, ప్రైవేట్ బస్సుల్లో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. హైదరాబాద్ నుంచి విజయవాడకు రూ.3వేలు, చెన్నై నుంచి రూ.3500 వరకు వసూలు చేస్తున్నారు. కుటుంబంతో వెళ్లాలంటేనే లక్షల్లో ఖర్చవుతుండటంతో, చాలామంది ప్రయాణంపైనే ఆలోచిస్తున్నారు. అయితే జనాలు మాత్రం సంక్ర

  • Andhra Pradesh Logo

    Andhra Pradesh Government : వారంతా రూ.10 వేలు చెల్లించాల్సిన అవసరం లేదు.. పూర్తిగా ఉచితం.!

  • Haritha Hotel Srisailam

    Srisailam : శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్..ఆ హోటల్ వెబ్‌సైట్‌ ఫేక్?

  • Indian Skill Report 2026.

    Indian Skill Report 2026 : దేశంలోని 56.35% మంది పనిచేయడానికి ఇష్టపడుతోన్న మహిళలు!

  • Nellore

    Nellore : భార్య ముందే ప్రియురాలి కోసం భర్త ఆత్మహత్యాయత్నం!

Latest News

  • Miss Universe-2025 : ర్యాంప్ వాక్ చేస్తూ కిందపడ్డ మిస్ యూనివర్స్ బ్యూటీ

  • Vemulawada : కుంగిన డబుల్ బెడ్రూం ఫ్లోరింగ్..ప్రమాదం నుండి బయటపడ్డ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

  • Sand Supply : ఆంధ్ర నుంచి తెలంగాణ కు యథేచ్ఛగా ఇసుక

  • Guwahati Test : గువాహటి టెస్టుపై అశ్విన్ పోస్ట్.. పంతూ ఏంది సామీ నీ బాడీ లాంగ్వేజ్!

  • CBN : మెరుగైన పాలన దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం

Trending News

    • Bank: రేపు ఈ రాష్ట్రాల్లో బ్యాంకులు మూసి ఉంటాయా?

    • Punjabi Cremation: ధర్మేంద్రకు తుది వీడ్కోలు.. సిక్కు సంప్రదాయంలో అంత్యక్రియలు ఎలా నిర్వహిస్తారంటే?

    • Karun Nair: కరుణ్ నాయర్ కీల‌క వ్యాఖ్యలు.. టీమిండియా పైనేనా?

    • Skanda Shashthi 2025: స్కంద షష్ఠి వ్రతం గురించి మీకు తెలుసా? ముహూర్తం, పూజా విధానం ఇదే!

    • Pelli Muhurtham : నవంబర్‌ 26 నుంచి పెళ్లిళ్లు, శుభకార్యాలకు బ్రేక్‌! ఇక ఫిబ్రవరి 2026 లోనే పెళ్లి ముహూర్తాలు.

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd