Pakistan PM: ఉగ్రదాడి.. భారత్ను బెదిరించిన పాక్ ప్రధాని!
జమ్మూ కాశ్మీర్లో ఏప్రిల్ 22, 2025న జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత, భారతదేశం పాకిస్తాన్పై కఠిన చర్యలు తీసుకుంటోంది. ఈ దాడి తర్వాత భారతదేశం 1960లో వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో ఏర్పడిన సింధూ జల ఒప్పందంను సస్పెండ్ చేసింది.
- By Gopichand Published Date - 01:34 PM, Sat - 26 April 25

Pakistan PM: జమ్మూ కాశ్మీర్లో ఏప్రిల్ 22, 2025న జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత, భారతదేశం పాకిస్తాన్పై కఠిన చర్యలు తీసుకుంటోంది. ఈ దాడి తర్వాత భారతదేశం 1960లో వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో ఏర్పడిన సింధూ జల ఒప్పందం (Indus Waters Treaty – IWT)ను సస్పెండ్ చేసింది. అలాగే, పాకిస్తాన్ పౌరులను దేశం నుండి తిరిగి వెళ్లమని ఆదేశించింది. ఈ విషయంపై పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ (Pakistan PM) కూడా తన స్పందనను వ్యక్తం చేశారు.
పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ బెదిరింపులు
పాకిస్తాన్ మిలిటరీ అకాడమీ కాకుల్లో జరిగిన పాసింగ్ ఔట్ పరేడ్లో షెహబాజ్ షరీఫ్ మాట్లాడుతూ.. భారతదేశాన్ని బెదిరించారు. “భారతదేశం ప్రతి దాడికి సమాధానం ఇస్తాము” అని ఆయన అన్నారు. ఇంతకు ముందు, పాకిస్తాన్ మాజీ విదేశాంగ మంత్రి మరియు పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (PPP) అధ్యక్షుడు బిలావల్ భుట్టో జర్దారీ కూడా సింధూ జల ఒప్పందంపై భారతదేశాన్ని బహిరంగంగా బెదిరించారు. “నేను సింధూ నది తీరం నుండి భారతదేశానికి చెప్పాలనుకుంటున్నాను. సింధూ మాది, ఎప్పటికీ మాదే. ఈ నదిలో మా నీరు ప్రవహిస్తుంది. లేదా వారి రక్తం ప్రవహిస్తుంది.” అని అన్నారు.
పాకిస్తాన్ హెచ్చరికలు
సింధూ జల ఒప్పందం ప్రకారం తమకు లభించే నీటి ప్రవాహాన్ని ఆపడం లేదా మళ్లించడం యుద్ధాన్ని ప్రకటించడంతో సమానమని పాకిస్థాన్ పేర్కొంది. అంతేకాకుండా పహల్గామ్ దాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం తీసుకున్న చర్యలకు సమాధానంగా భారతదేశంతో వాణిజ్యం, 1972 షిమ్లా ఒప్పందం, ఇతర ద్వైపాక్షిక ఒప్పందాలను సస్పెండ్ చేయడం, అలాగే భారత విమానాల కోసం తమ గగనతలాన్ని మూసివేయడం వంటి చర్యలను ప్రకటించింది.
Also Read: Terror Attack Video: ఉగ్రదాడి.. మరో వీడియో వెలుగులోకి!
భారతీయ పౌరుల వీసాల రద్దు
పాకిస్తాన్, దక్షిణ ఆసియా సహకార సంస్థ (SAARC) వీసా ఎగ్జమ్షన్ స్కీమ్ (SVES) కింద భారతీయ పౌరులకు జారీ చేసిన అన్ని వీసాలను సస్పెండ్ చేసింది. సిక్కు యాత్రికులను మినహాయించి, మిగతా అన్ని వీసాలు రద్దు చేయబడతాయి.