ChatGPT CEO: చాట్జీపీటీ సృష్టికర్త తొలగింపు.. తాత్కాలిక సీఈవోగా భారత సంతతికి చెందిన మీరా..!
చాట్జీపీటీ సీఈవో (ChatGPT CEO) శామ్ ఆల్ట్మన్ను తొలగించిన తర్వాత మీరా మురాటికి కంపెనీ బాధ్యతలు అప్పగించారు. ఆమె ఇప్పుడు తాత్కాలిక సీఈవోగా బాధ్యతలు చేపట్టనున్నారు.
- Author : Gopichand
Date : 18-11-2023 - 10:52 IST
Published By : Hashtagu Telugu Desk
ChatGPT CEO: చాట్జీపీటీ సీఈవో (ChatGPT CEO) శామ్ ఆల్ట్మన్ను తొలగించిన తర్వాత మీరా మురాటికి కంపెనీ బాధ్యతలు అప్పగించారు. ఆమె ఇప్పుడు తాత్కాలిక సీఈవోగా బాధ్యతలు చేపట్టనున్నారు. మీరా 2018లో టెస్లా కంపెనీని విడిచిపెట్టిన తర్వాత OpenAI (ChatGPTT మాతృ సంస్థ)లో చేరారు. ఓపెన్ AI శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో.. “కంపెనీ దాని సహ వ్యవస్థాపకుడు శామ్ ఆల్ట్మాన్ను తొలగించింది. బోర్డుతో కమ్యూనికేట్ చేయడంలో శామ్ నిరంతరం నిర్లక్ష్యం చేస్తున్నాడని కంపెనీ బోర్డు గుర్తించింది.” అని ప్రకటనలో తెలిపింది. “మేము తాత్కాలిక CEOగా చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ మీరా మురాటిని నియమిస్తున్నాము. దీనితో పాటు మేము ఈ పదవిని నిర్వహించడానికి శాశ్వత CEO కోసం కూడా వెతుకుతున్నాము” అని కంపెనీ తెలిపింది.
మీరా నియామకంకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానమిస్తూ OpenAI ఒక ప్రకటనలో ఇలా చెప్పింది. మీరా సుదీర్ఘ పదవీకాలం, AI గవర్నెన్స్ మరియు పాలసీలో ఆమె అనుభవం, అలాగే కంపెనీకి సంబంధించిన అన్ని అంశాలతో ఆమె ఈ పాత్రకు అర్హత కలిగి ఉందని బోర్డు విశ్వసిస్తోందని తెలిపింది.
Also Read: Cars On Amazon : అమెజాన్లో కార్ల సేల్స్.. ఎప్పటి నుంచి ?
మీరా మురాటి ఎవరు?
1988లో అల్బేనియాలో మీరా జన్మించింది. ఆమె తల్లిదండ్రులు భారతీయ సంతతికి చెందినవారని చాలా మీడియా నివేదికలు పేర్కొన్నాయి. కెనడాలో చదువు పూర్తి చేసింది. ఆమె మెకానికల్ ఇంజనీర్. టెస్లాలో పనిచేస్తున్నప్పుడు మోడల్ ఎక్స్ టెస్లా కారును తయారు చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషించింది. 2018 సంవత్సరంలో ఆమె ChatGPT మాతృ సంస్థ అయిన Open AIలో పని చేయడం ప్రారంభించింది. మీరా గతేడాది ఓపెన్ఏఐకి CTO అయ్యారు.
We’re now on WhatsApp. Click to Join.
ChatGPT అంటే ఏమిటి..?
ChatGPT అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో పనిచేసే చాట్బాట్. ఇది బహుళ భాషల్లో ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలదు. ఈ బోట్ 100 భాషల్లో పని చేయగలదని నమ్ముతారు. దీని మాతృ సంస్థ OpenAIని 2015 సంవత్సరంలో ఎలాన్ మస్క్, శామ్ ఆల్ట్మాన్ అభివృద్ధి చేశారు. ChatGPTలో 2021 వరకు మాత్రమే డేటా అందుబాటులో ఉందని, దీని ఆధారంగా మాత్రమే సమాచారం ఇవ్వగలదని కంపెనీ తెలియజేసింది.