Female Passenger: ప్రముఖ విమానయాన సంస్థ నుంచి నష్ట పరిహారం కోరిన మహిళ.. రీజన్ ఇదే..!
ఒక ప్రయాణికురాలు (Female Passenger) విమానయాన సంస్థ నుండి రూ. 15 లక్షల పరిహారం కోరింది.
- By Gopichand Published Date - 08:17 AM, Thu - 11 July 24

Female Passenger: విమానాల్లో ప్రయాణీకులతో సిబ్బంది దురుసుగా ప్రవర్తించడం, అసభ్యంగా ప్రవర్తించడం వంటి సంఘటనల గురించి మనం వింటూనే ఉన్నాం. కానీ ఇప్పుడు ఓ ఉదంతం వెలుగులోకి వచ్చింది. దీనికి ఒక ప్రయాణికురాలు (Female Passenger) విమానయాన సంస్థ నుండి రూ. 15 లక్షల పరిహారం కోరింది. జెట్ బ్లూ విమానయాన సంస్థ నుంచి పరిహారం డిమాండ్ చేసింది. ఓ మహిళా ప్రయాణీకులపై ఎయిర్లైన్ సిబ్బంది వేడి టీ ఒలకబోశారు. దీని కారణంగా ఆమె ఛాతీ, రొమ్ములు, కాళ్లు, ఎడమ పిరుదులు, కుడి చేతిపై తీవ్రమైన కాలిన గాయాలు ఉన్నాయి. విమానయాన సంస్థ నుంచి నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ మహిళా ప్రయాణికురాలు గాయాల ఫోటోలతో పాటు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం.
మే 15న సంఘటన, 24న లిఖితపూర్వకంగా ఫిర్యాదు
వేడి టీ పడి గాయపడిన ప్రయాణికురాలి పేరు తహజానా లూయిస్. లూయిస్ తన 5 ఏళ్ల కుమార్తెతో ఒంటరిగా ప్రయాణిస్తుంది. ఆమె చాలా నొప్పి, బాధతో ఉన్నందున ఈ సంఘటన సమయంలో భయాందోళనకు గురైంది. లూయిస్ జూన్ 24న లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అయితే ఈ విషయం ఇప్పుడు మీడియాలో తెరపైకి వచ్చింది. లూయిస్ న్యాయవాది ఎడ్వర్డ్ జాజ్లోవికీ, ABC న్యూస్ ఏజెన్సీతో మాట్లాడుతూ.. ఈ సంఘటన మే 15న జరిగిందని చెప్పారు. లూయిస్ ఫ్లోరిడాలోని ఓర్లాండో నుండి హార్ట్ఫోర్డ్కు వెళ్తుంది. ఈ క్రమంలోనే ఆమె జెట్బ్లూ ఫ్లైట్ 2237లో ప్రయాణిస్తోంది. ఈ విమానంలో డ్రింక్ ఆర్డర్ చేసిన ప్రయాణీకుడి వెనుక ఉన్న సీటులో లూయిస్ ఉన్నారు.
Also Read: JioTag Air : వస్తువులను పెట్టిన చోటును మర్చిపోతున్నారా ? ‘జియో ట్యాగ్ ఎయిర్’ తీసుకోండి
ఫిర్యాదు ప్రకారం.. ప్రయాణీకుడు టీ పట్టుకొని ఉండగా హఠాత్తుగా షాక్ అయ్యాడు. దీంతో టీ.. సిబ్బంది చేతి నుండి లూయిస్పై పడిపోయింది. టీ చాలా వేడిగా ఉంది. దాని కారణంగా ఆమె శరీరంలోని చాలా భాగాలు కాలిపోయాయి. ఆమె చాలా బాధపడింది. కానీ సిబ్బంది ప్రథమ చికిత్స మాత్రమే అందించారు. ఈ ఘటనపై పైలట్ స్పందించలేదు. చూడ్డానికి కూడా రాలేదు. మానవత్వం చూపిన సిబ్బంది ప్రయాణికుల్లో డాక్టర్ ఉన్నారా అని కూడా అడగలేదు. లూయిస్ నొప్పితో కేకలు వేసింది. కానీ పైలట్ అత్యవసరంగా ల్యాండింగ్ చేయలేదు లేదా విమానాన్ని తిరిగి విమానాశ్రయానికి తీసుకెళ్లలేదు. ఈ ఘటన తర్వాత విమానంలోని పైలట్లు, సిబ్బంది నుండి లూయిస్కు ఎలాంటి సహాయం అందలేదు.
We’re now on WhatsApp. Click to Join.
మీడియా నివేదికల ప్రకారం.. ఎయిర్లైన్ ఉద్యోగులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని లూయిస్ న్యాయవాది ఎడ్వర్డ్ జాజ్లోవికీ అన్నారు. గాయపడిన ప్రయాణికురాలి పట్ల సానుభూతి చూపడం మర్చిపోయికి సహాయం చేయడానికి కూడా ప్రయత్నించలేదు. లూయిస్ సంఘటనలు, ప్రవర్తన మూడవ స్థాయి హింసకు సమానమని లాయర్ పేర్కొన్నాడు. అతడి శరీరంపై కాలిన గాయాలు ఉండడంతో చర్మ మార్పిడి చేయాల్సి ఉంటుంది. ఫ్లైట్ దిగగానే అత్యవసరంగా డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సి వచ్చింది. లూయిస్ తన చెడు, బాధాకరమైన అనుభవానికి పరిహారం కోరింది.