Air India Cancels Flights: ఇజ్రాయెల్ కు విమాన సర్వీసులను నిలిపివేసిన ఎయిర్ ఇండియా
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. విమానయాన సంస్థ ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్కు బయలుదేరే విమాన సేవలను ఆగస్ట్ 8 వరకు ఆపివేస్తున్న సమాచారం ఇచ్చింది. అయితే ఈ చర్యలు తక్షణమే అమలులోకి తెచ్చింది
- Author : Praveen Aluthuru
Date : 02-08-2024 - 3:49 IST
Published By : Hashtagu Telugu Desk
Air India Cancels Flights: ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తత ప్రభావం భారత్పై కూడా కనిపిస్తోంది. ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తత మధ్య ఎయిర్ ఇండియా ఇజ్రాయెల్కు అన్ని విమానాలను రద్దు చేసింది. ఆగస్టు 8 వరకు అన్ని విమానాలను రద్దు చేసినట్లు ఎయిర్ ఇండియా విమానయాన సంస్థ తెలిపింది.
ప్రయాణీకుల భద్రతకు మొదటి ప్రాధాన్యత ఇస్తామని ఎయిర్ ఇండియా స్పష్టం చేసింది. ఇజ్రాయెల్లో పరిస్థితిని సంస్థ గమనిస్తోందని, ప్రయాణికులు, సిబ్బంది భద్రతే మా మొదటి ప్రాధాన్యత అని కంపెనీ తెలిపింది. మరింత సమాచారం కోసం సంప్రదింపు కేంద్రానికి ఫోన్ చేయాల్సిందిగా సంస్థ పేర్కొంది. ఈ మేరకు ఫ్రీ డయల్ నెంబర్ ని ప్రవేశపెట్టింది. సమాచారం కోసం సంప్రదించాల్సిన ఫోన్ నుంబర్లు: 011-69329333 / 011-69329999.
టెహ్రాన్లో హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియా మరణించిన తర్వాత ఇరాన్ ఇజ్రాయెల్ దాడి గురించి బహిరంగంగా హెచ్చరించింది. ఇరాన్ హెచ్చరిక తర్వాత మధ్య ఆసియా ప్రాంతంలో పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది. అదే సమయంలో గతేడాది అక్టోబర్ 7 నుంచి ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతోంది.
Also Read: మరో నాల్గు రోజుల్లో ‘Amazon Great Freedom Festival Sale ‘