Heavy Rains: సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఇద్దరి మృతి..!
సౌదీ అరేబియాలో కొద్దిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.
- By Gopichand Published Date - 07:56 PM, Fri - 25 November 22
సౌదీ అరేబియాలో కొద్దిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జడ్డా నగరం జలమయమైంది. పెద్ద ఎత్తున వరదలు సంభవించడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వర్షాల కారణంగా పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలకు అక్కడి ప్రభుత్వం సెలవు ప్రకటించింది. వరదల కారణంగా ఇప్పటి వరకు ఇద్దరు ప్రాణాలు కోల్పోయినట్లు అక్కడి అధికారులు తెలిపారు.
ఎడారితో నిండిన సౌదీ అరేబియాలో తీవ్రమైన తుఫానులు, వరదల కారణంగా ఇద్దరు వ్యక్తులు మరణించారు. అనేక విమానాలు ఆలస్యం అయ్యాయి. తీర ప్రాంత నగరమైన జెడ్డాపై కూడా ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. వర్షం కురవడంతో పలు ప్రాంతాల్లో రోడ్లు జలమయమై పార్క్ చేసిన కార్లు తేలాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న చాలా వీడియోలలో కార్లు ఒకదానిపై ఒకటి ఎక్కినట్లు కనిపిస్తుంది. వర్షం కారణంగా పాఠశాలలను మూసివేయాల్సి వచ్చింది.
అదే సమయంలో ఎడారిలో నియోమ్ నగరాన్ని నిర్మించేందుకు బిలియన్ల డాలర్లు వెచ్చిస్తున్న సౌదీ యువరాజు పాత నగరాలను పట్టించుకోవడం లేదని సోషల్ మీడియాలో జనాలు విమర్శిస్తున్నారు. మక్కా ప్రాంతీయ ప్రభుత్వం ఒక ట్వీట్లో ఇప్పటివరకు ఇద్దరు వ్యక్తులు మరణించారని, అనవసరంగా బయటకు వెళ్లవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నామని పేర్కొంది. దేశంలో రెండవ అతిపెద్ద నగరంగా ఉన్న మక్కా ప్రాంతంలో జెడ్డా కూడా వస్తుంది. ఈ నగరంలో 40 లక్షల మంది నివసిస్తున్నారు.
జెడ్డా నుండి వచ్చిన చిత్రాలు అనేక వాహనాలు నీటిలో మునిగిపోవడం, ట్రాఫిక్ నిలిచిపోయినట్లు చూపించాయి. ఈ ఘటన తర్వాత సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్పై దాడి జరిగింది. దేశంలోనే రెండో అతిపెద్ద నగరం పవిత్ర నగరమైన మక్కాకు వర్ష రక్షణ లేదని, ప్రభుత్వం నియోమ్ నగరాన్ని నిర్మిస్తోందని ప్రజలు అంటున్నారు. సౌదీ అరేబియా దాదాపు 170 కి.మీ పొడవున ఈ నియోమ్ నగరాన్ని నిర్మిస్తోంది. ఇందులో అల్ట్రా మోడ్రన్ సదుపాయాలు ఉంటాయి. సౌదీ యువరాజు పర్వత ఎడారిలో ఈ నగరాన్ని నిర్మిస్తున్నాడు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ప్రాజెక్ట్ అని నమ్ముతారు. ఈ నగరాన్ని నిర్మించడానికి 500 బిలియన్ డాలర్లు ఖర్చు అవుతుంది.
Related News
Apple iPhones Ban: ఈ దేశంలో ఐఫోన్లపై నిషేధం.. రీజన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
దక్షిణ కొరియా నుంచి ఆపిల్ కు చేదు వార్త వచ్చింది. భద్రతా కారణాల దృష్ట్యా దక్షిణ కొరియా సైనిక భవనాల్లోకి ఐఫోన్లను తీసుకెళ్లడాన్ని నిషేధించింది.