HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Trending
  • >Waste Management In The State Circular Economy Policy Should Be Brought In Two Months Cm

CM Chandrababu : రాష్ట్రంలో వ్యర్థాల నిర్వహణ .. రెండు నెలల్లో సర్క్యులర్ ఎకానమీ పాలసీ తీసుకురావాలి : సీఎం

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. రెండు నెలల్లో సర్క్యులర్ ఎకానమీకి సంబంధించి తుది పాలసీ రూపొందించాలి. రాష్ట్రవ్యాప్తంగా వ్యర్థాల నుంచి సంపద సృష్టించే దిశగా చిత్తశుద్ధితో పనిచేయాలి అని అధికారులను ఆదేశించారు.

  • By Latha Suma Published Date - 04:46 PM, Tue - 17 June 25
  • daily-hunt
Waste management in the state.. Circular economy policy should be brought in two months: CM
Waste management in the state.. Circular economy policy should be brought in two months: CM

CM Chandrababu : రాష్ట్రంలో వ్యర్థాల నిర్వహణ వ్యవస్థను సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం అమరావతిలోని సచివాలయంలో సర్క్యులర్ ఎకానమీపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. రెండు నెలల్లో సర్క్యులర్ ఎకానమీకి సంబంధించి తుది పాలసీ రూపొందించాలి. రాష్ట్రవ్యాప్తంగా వ్యర్థాల నుంచి సంపద సృష్టించే దిశగా చిత్తశుద్ధితో పనిచేయాలి అని అధికారులను ఆదేశించారు. సర్క్యులర్ ఎకానమీ అమలు మొదటి దశగా రాష్ట్రంలోని మూడు ప్రాధాన్యత కలిగిన ప్రాంతాల్లో విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి లో ఒక ఏడాది వ్యవధిలోగా ప్రత్యేక పార్కుల ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. వీటితో పాటు ఆధునిక సాంకేతికతను వాడుతూ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ల సామర్థ్యాన్ని మెరుగుపరచాలని తెలిపారు.

Read Also: Kavitha : బీసీ రిజర్వేషన్ల కోసం కేంద్రంపై ఒత్తిడి.. జూలై 17న రైల్‌ రోకో : ఎమ్మెల్సీ కవిత

పర్యావరణ పరిరక్షణలో కీలకమైన మరో అంశంగా, ఈ ఏడాది అక్టోబర్ 2వ తేదీకి ముందు రాష్ట్రంలోని 21 నగరాల్లో వాటిలో విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమహేంద్రవరం వంటి ప్రధాన కార్పొరేషన్లు కలిపి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా అరికట్టాలని సీఎం స్పష్టంగా తెలిపారు. పర్యావరణం శుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి. చెత్తపై తక్షణమే సమర్థవంతమైన నియంత్రణ ఉండాలి అని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలోని 87 పట్టణ ప్రాంతాల్లో మొత్తం 157 రెడ్యూస్ రీయూజ్ రీసైకిల్ కేంద్రాలు ఏర్పాటుకు దిశానిర్దేశం చేశారు. వ్యతిరేక పరిస్థితుల్లోనూ శ్రమించి వ్యర్థాల నిర్వహణలో నూతన ఆవిష్కరణలకు దోహదపడే సంస్థలకు, వ్యక్తులకు రాష్ట్ర ప్రభుత్వం ‘స్వచ్ఛత అవార్డులు’ అందించనుంది అని తెలిపారు.

మెటీరియల్ రీసైక్లింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధులతో సీఎం సమావేశమై రాష్ట్రంలో సర్క్యులర్ ఎకానమీ పార్కుల ఏర్పాటుపై వారి ప్రతిపాదనలను పరిశీలించారు. త్వరితగతిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించి, వచ్చే 90 రోజుల్లో రీసైక్లింగ్, వేరు వేరు చెత్త వర్గీకరణపై స్పష్టమైన దిశానిర్దేశం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రులు, ఉన్నతాధికారులు, మున్సిపల్ శాఖ అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రాన్ని వ్యర్థాల నిర్వహణలో దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

Read Also: Monsoon Health Tips: వ‌ర్షాకాలంలో గ‌ర్భిణులు తీసుకోవాల్సిన ముఖ్య‌మైన జాగ్ర‌త్త‌లీవే!


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • Circular Economy
  • CM Chandrababu
  • High Level Review
  • Prohibition
  • Single-use plastic
  • Waste Management

Related News

Ap Egg

Production of Eggs : గుడ్ల ఉత్పత్తిలో ఏపీ నం.1

Production of Eggs : మాంసం ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ నాల్గవ స్థానంలో, పాల ఉత్పత్తిలో ఐదవ స్థానంలో, మరియు గేదెల ఉత్పత్తిలో ఆరవ స్థానంలో ఉందని దామోదర్ నాయుడు తెలిపారు

  • Heavy Rains

    Alert : 13న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు!

  • YS Jagan

    YS Jagan: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై మాజీ ముఖ్యమంత్రి జగన్ తీవ్ర విమర్శలు

  • AP Assembly monsoon session to begin from 18th of this month

    AP Assembly : ఈ నెల 18 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు

  • People have immense faith in the judicial system: CM Chandrababu

    Visakhapatnam : న్యాయ వ్యవస్థపై ప్రజలకు అపారమైన నమ్మకం ఉంది : సీఎం చంద్రబాబు

Latest News

  • AP : రాష్ట్రంలో యూరియా కొరతపై ‘అన్నదాత పోరు’: వైసీపీ ఆందోళనకు సిద్ధం

  • CM Siddaramaiah : చలానాలపై రాయితీ ప్రకటించిన కర్ణాటక ప్రభుత్వం

  • Green Chillies : ప్రతిరోజూ పచ్చిమిర్చి తినడం ఆరోగ్యానికి మంచిదేనా?..అస‌లు రోజుకు ఎన్ని తిన‌వ‌చ్చు..?

  • Khairatabad ganesh : గంగమ్మ ఒడికి చేరిన శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి

  • Renault Cars : జీఎస్టీ 2.0 ఎఫెక్ట్.. రెనో కార్లపై భారీ తగ్గింపు

Trending News

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd