HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Pakistan Ready For Talks With India Prime Minister

Pakistan : భారత్‌తో చర్చలకు సిద్ధం: పాకిస్థాన్‌ ప్రధాని

ఇటీవలి కాలంలో, సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్‌ (ఎంబీఎస్‌)తో ఫోన్ ద్వారా జరిగిన సంభాషణలో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఈ అంశాన్ని చర్చించినట్టు రేడియో పాకిస్థాన్ నివేదించింది.

  • Author : Latha Suma Date : 25-06-2025 - 5:01 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pakistan ready for talks with India: Prime Minister
Pakistan ready for talks with India: Prime Minister

Pakistan : ఉగ్రవాదాన్ని పూర్తిగా అణగదొక్కేంతవరకు పాకిస్థాన్‌తో ఎలాంటి చర్చలు జరగవని భారత ప్రభుత్వం మరోసారి తేల్చి చెప్పింది. అయినా పాకిస్థాన్ మాత్రం చర్చల అవసరాన్ని మళ్లీ మళ్లీ లేవనెత్తుతూ, ఇరు దేశాల మధ్య వివాదాలను పరిష్కరించేందుకు సిద్ధత వ్యక్తం చేస్తోంది. ఇటీవలి కాలంలో, సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్‌ (ఎంబీఎస్‌)తో ఫోన్ ద్వారా జరిగిన సంభాషణలో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఈ అంశాన్ని చర్చించినట్టు రేడియో పాకిస్థాన్ నివేదించింది. జమ్మూ కశ్మీర్ సమస్యతో పాటు, ఉగ్రవాదం, వాణిజ్య సంబంధాలు, జలాల పంపిణీ వంటి కీలక అంశాలపై భారత్‌తో చర్చలు జరపడానికి పాకిస్థాన్ సిద్ధంగా ఉందని షరీఫ్ అభిప్రాయపడ్డారు.

Read Also:  Shubhanshu Shukla : మీ ప్రయాణంపై దేశం మొత్తం సంతోషంగా, గర్వంగా ఉంది: ప్రధాని మోడీ

పశ్చిమాసియాలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ ఫోన్ సంభాషణ జరిగింది. ఈ సందర్భంలో భారత-పాకిస్థాన్ సంబంధాల విషయమై అభిప్రాయాలు పంచుకున్నట్లు సమాచారం. ఉద్రిక్తతలు తక్షణమే తగ్గేందుకు చర్చలు అవసరమని పాకిస్థాన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, భారత్ మాత్రం ఇప్పటి వరకు తీసుకున్న స్పష్టమైన వైఖరిని కొనసాగిస్తోంది. ఉగ్రవాద కార్యకలాపాలకు పూర్తిగా బ్రేక్ పడే వరకు, సరిహద్దు ప్రాంతాల్లో శాంతి నెలకొనేంత వరకు ఎలాంటి చర్చలు జరగవని భారత్ పునరుద్ఘాటించింది. ఉగ్రవాదం మరియు చర్చలు ఏకకాలంలో సాగడం అసాధ్యం. నీరు మరియు రక్తం కలిసి ప్రవహించలేవు అనే పదాలతో భారత్ తన దృక్పథాన్ని ఘాటుగా వెల్లడించింది.

ఇంతకుముందు, పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి అనంతరం భారత్ పాకిస్థాన్‌పై సర్జికల్ స్ట్రైక్ చేపట్టిన సంగతి తెలిసిందే. ఆ దాడికి ప్రతిగా భారత సైన్యం సమాధాన చర్యలు తీసుకుంది. అంతర్జాతీయంగా ఒత్తిడి ఎదుర్కొంటున్న పాకిస్థాన్, మద్దతు కోసం సౌదీ అరేబియా, ఇరాన్, అజర్‌బైజాన్ వంటి దేశాలను సంప్రదిస్తోంది. ఈ నేపథ్యంలో, పాకిస్థాన్ మళ్ళీ చర్చల అవసరాన్ని ప్రస్తావించినప్పటికీ, భారత్ మాత్రం తన వైఖరిని మార్చలేదు. ఉగ్రవాదానికి తావులివ్వకుండా పూర్తిగా నిర్మూలించే వరకు చర్చలకు తలవంచే ప్రసక్తి లేదని స్పష్టం చేస్తోంది. ప్రపంచం మొత్తం ఉగ్రవాదాన్ని వ్యతిరేకించాల్సిన సమయంలో, చర్చల ముసుగులో ఉగ్రవాదానికి ఆసరా ఇవ్వడం సాధ్యపడదని భారత్ తేల్చిచెప్పుతోంది.

Read Also: Shocking: ఇదేం పోయేకాలం..రా.. నాయనా.. నన్ను ముట్టుకుంటే 35 ముక్కలు చేస్తా.. శోభనం రోజు భర్తకు భార్య వార్నింగ్

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • india
  • jammu kashmir
  • pakistan
  • PM Shehbaz Sharif
  • Saudi Arabia
  • terrorism

Related News

Ishaq Dar

Pakistan Deputy Prime Minister: పాక్‌ ఉప ప్రధానికి పరువు పాయే..

Ishaq Dar  పాకిస్థాన్‌లో జరిగిన ఓ దౌత్యపరమైన కార్యక్రమంలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. శాంతి చర్చల కోసం విచ్చేసిన ఈజిప్ట్ విదేశాంగ మంత్రికి స్వాగతం పలుకుతూ పాక్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ అదుపుతప్పి కిందపడిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Pakistan’s Deputy PM and Foreign Minister Ishaq Dar falls ahead of the US-Iran mediation talks. pic.twitter.com/h6xqFoOqMB — Aditya […]

    Latest News

    • ది రాజధాని రైతుల విజయం.రేణుకా చౌదరి

    • Cm Chandrababu Naidu: తల్లికి వందనంపై కీలక ప్రకటన

    • Kerala Assembly Election 2026 : యూడీఎఫ్ మేనిఫెస్టో విడుదల చేసిన తెలంగాణ సీఎం రేవంత్

    • AP Elections : 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల పట్ల సంచలన ఆరోపణలు చేసిన పరకాల

    • ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. రూ.7,059 కోట్ల బకాయిల విడుదల

    Trending News

      • Condom Shortage: భారీగా పెరగనున్న కండోమ్ ధరలు

      • అల‌ర్ట్‌.. నేటి నుంచి కీల‌క మార్పులు!

      • శ్రేయస్ అయ్యర్‌పై బీసీసీఐ జరిమానా.. గ‌తేడాది కూడా ఇదే త‌ప్పు!

      • Pemmasani Chandrasekhar: 29 వేల మంది రైతులకు జరిగిన అన్యాయం ఇది.. కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్

      • Capital Amaravati: ఏపీకి గుడ్ న్యూస్.. లోక్‌సభలో అమరావతి బిల్లు ఆమోదం.

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd