Trending
-
Aadhaar Card: ఇంటి నుంచే నిమిషాల్లో ఆధార్ కార్డ్ను అప్డేట్ చేసుకోండిలా!
ఈ కొత్త అప్లికేషన్ ఈ విధంగా పనిచేస్తుంది. ఒక వ్యక్తి ఇచ్చిన QR కోడ్ను ఉపయోగించి ఆధార్ను ఒక మొబైల్ నుంచి మరో మొబైల్కు లేదా ఒక యాప్ నుంచి మరో యాప్కు ట్రాన్స్ఫర్ చేయవచ్చు.
Date : 18-06-2025 - 8:11 IST -
AP : 17 మంది సత్ప్రవర్తన కలిగిన ఖైదీల విడుదలకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు
ఉత్తర్వుల ప్రకారం, 2025 ఫిబ్రవరి 1 నాటికి అవసరమైన శిక్షను అనుభవించి సత్ప్రవర్తనతో ప్రవర్తించిన ఖైదీలను షరతులతో విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఆయా ఖైదీల మిగిలిన శిక్షను ప్రభుత్వం మాఫీ చేయనుంది. అయితే, ఇది పూర్తిగా ఒక పునరావాస విధానంగా తీసుకోవాలని, ఖైదీలు నిబంధనలకు లోబడి ప్రవర్తించాలని అధికార వర్గాలు పేర్కొన్నాయి.
Date : 18-06-2025 - 6:28 IST -
Telangana : ఇజ్రాయెల్లోని ఆసుపత్రి సమీపంలో బాంబు పేలి తెలంగాణ వాసి మృతి
రవీంద్ర ఇజ్రాయెల్లో విజిట్ వీసాపై వెళ్లి, అక్కడ ఒక పార్ట్టైమ్ ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని ఆదుకుంటున్నాడు. అయితే అక్కడ భద్రతా పరిస్థితులు విషమించడంతో, తాను భయాందోళనకు గురవుతున్నట్లు ఇటీవలే కుటుంబ సభ్యులకు తెలియజేశాడు.
Date : 18-06-2025 - 4:20 IST -
Nara Lokesh : అమిత్ షాతో నారా లోకేశ్ భేటీ..రాష్ట్ర అంశాలపై కీలక చర్చలు
నారా లోకేశ్ ఈ మధ్య కాలంలో ఢిల్లీలో పరిపాలనా స్థాయి చర్చల కోసం కేంద్ర నాయకులను కలుస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన అమిత్ షాను ప్రత్యేకంగా కలిసి, రాష్ట్రానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సమస్యలు, అభివృద్ధి ప్రాజెక్టులు, పెట్టుబడుల అవసరం, కేంద్ర సహకారం వంటి అంశాలను ప్రస్తావించినట్లు సమాచారం.
Date : 18-06-2025 - 3:35 IST -
YS Sharmila : తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది వాస్తవం : వైఎస్ షర్మిల
ఇది కొత్తగా ఎవరు రమ్మన్నా, విచారణకు హాజరవుతానని ఇప్పుడే చెబుతున్నా. ఈ వ్యవహారంపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు సీరియస్గా దృష్టి సారించి విచారణ వేగవంతం చేయాలి అని షర్మిల డిమాండ్ చేశారు.
Date : 18-06-2025 - 3:19 IST -
Pakistan : పాకిస్థాన్లో బాంబు పేలుడు.. పట్టాలు తప్పిన జాఫర్ ఎక్స్ప్రెస్
వివరాల్లోకి వెళ్తే, క్వెట్టా నుంచి పెషావర్ వెళ్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్ రైలుకు బాంబు పేలుడు తీవ్రమైన ప్రమాదాన్ని కలిగించింది. ఐఈడీ (ఇంప్రోవైజ్డ్ ఎక్స్ప్లోసివ్ డివైస్) రకం బాంబు ట్రాక్పై అమర్చినట్లు అనుమానిస్తున్నారు.
Date : 18-06-2025 - 2:32 IST -
Aarya : హీరో ఆర్య నివాసంలో ఐటీ సోదాలు
ఈ ఘటనపై ఆర్య స్పందించారు. చెన్నైలో మీడియాతో మాట్లాడిన ఆయన సీ షెల్ రెస్టారెంట్ వ్యాపారంతో నాకు ప్రస్తుతం ఎటువంటి సంబంధం లేదు. ఆ వ్యాపారం నిర్వహణ బాధ్యతలను నేను కొన్ని సంవత్సరాల క్రితమే ఒక స్నేహితునికి అప్పగించాను. ఇప్పుడు జరుగుతున్న ఐటీ దాడుల పట్ల నేను సహకరిస్తున్నాను అని అన్నారు.
Date : 18-06-2025 - 1:37 IST -
FASTag annual pass : ఫాస్టాగ్ యూజర్లకు కేంద్రం శుభవార్త
ఈ పాస్ను స్వాతంత్ర్య దినోత్సవమైన ఆగస్టు 15, 2025 నుంచి అందుబాటులోకి తీసుకురానున్నట్లు కేంద్ర రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. ఈ వార్షిక పాస్ కోసం ప్రయాణికులు రూ. 3,000 చెల్లించాల్సి ఉంటుంది. పాస్ యాక్టివేట్ అయినప్పటి నుంచి ఏడాది పాటు లేదా 200 ట్రిప్పులు పూర్తయ్యేవరకు ఈ రెండింటిలో ఏది ముందుగా సంభవిస్తే అది పాస్ చెల్లుబాటు అవుతుంది.
Date : 18-06-2025 - 1:21 IST -
CM Revanth Reddy : గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్ను ప్రారంభించిన ముఖ్యమంత్రి
ఏషియా పసిఫిక్ ప్రాంతంలో ఇది రెండో కేంద్రం కావడం విశేషం కాగా, ప్రపంచవ్యాప్తంగా ఇది గూగుల్ సంస్థకు నాలుగవ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్ కావడం గర్వకారణం. ఈ సెంటర్ ప్రారంభంతో హైదరాబాద్ నగరం గ్లోబల్ డిజిటల్ భద్రత రంగంలో కీలక పాత్ర పోషించనున్నది.
Date : 18-06-2025 - 12:59 IST -
Hindi language : పాఠశాలల్లో హిందీ భాషపై వెనక్కి తగ్గిన మహారాష్ట్ర ప్రభుత్వం..
బుధవారం మహారాష్ట్ర పాఠశాల విద్యాశాఖ అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేస్తూ, హిందీ భాషను తప్పనిసరి అన్న నిర్ణయాన్ని సవరించింది. కొత్త ప్రకటనలో "తప్పనిసరి" అనే పదాన్ని తొలగిస్తూ, హిందీ బదులుగా విద్యార్థులు ఇతర భాషలను కూడా ఎంచుకునే అవకాశం కల్పించింది.
Date : 18-06-2025 - 12:43 IST -
Bomb Threats : బేగంపేట విమానాశ్రయానికి బాంబు బెదిరింపులు..బాంబు, డాగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు
అప్రమత్తమైన పోలీసు శాఖ, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని పూర్తిస్థాయి తనిఖీలు చేపట్టాయి. ఈమెయిల్ సమాచారాన్ని అత్యవసరంగా పరిగణించిన అధికారులు, ప్రయాణికుల రక్షణను దృష్టిలో పెట్టుకుని వెంటనే విమానాశ్రయ ప్రాంగణంలో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
Date : 18-06-2025 - 12:18 IST -
Nara Lokesh : ఉపరాష్ట్రపతితో మంత్రి నారా లోకేశ్ భేటీ
ఈ క్రమంలోనే ఈ ఉదయం నారా లోకేశ్ భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశం సుమారు గంటపాటు కొనసాగినట్లు సమాచారం. ఈ భేటీలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలు ప్రస్తావనకు వచ్చాయి.
Date : 18-06-2025 - 11:28 IST -
PM Modi : పాక్ అభ్యర్థన మేరకే కాల్పుల విరమణ.. మీ ప్రమేయం లేదు: ట్రంప్తో మోడీ
చివరికి, ప్రధాని నరేంద్ర మోడీ ఈ అంశంపై తొలిసారి స్పందిస్తూ, భారత్-పాక్ సంబంధాల్లో అమెరికా ఏ రకంగానూ మద్యవర్తిగా వ్యవహరించలేదని తేల్చిచెప్పారు.
Date : 18-06-2025 - 11:07 IST -
ISRO : మరోసారి భారత వ్యోమగామి శుభాంశు శుక్లా రోదసి యాత్ర వాయిదా
శుభాంశు శుక్లా యాక్సియం-4 (Axiom-4) మిషన్లో భాగంగా రోదసికి బయలుదేరుతున్నారు. ఈ మిషన్ను అమెరికాకు చెందిన ప్రైవేట్ అంతరిక్ష సంస్థ యాక్సియం స్పేస్ నిర్వహిస్తోంది. ఇందులో భారత్కు చెందిన ఇస్రోతో పాటు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా, ఐరోపా అంతరిక్ష సంస్థ ఈఎస్ఏలు భాగస్వాములుగా ఉన్నాయి.
Date : 18-06-2025 - 10:38 IST -
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఇలాంటి వారికి సమాజంలో గౌరవం లభించదు!
చాణక్య ప్రకారం.. ఎవరైనా ఆలోచించకుండా అర్థం చేసుకోకుండా ఏదైనా పని చేసి నష్టపోతే అది అతని మూర్ఖత్వం. అలాంటి వ్యక్తులు ఏ పని ప్రారంభించే ముందు దాని ఫలితాల గురించి ఆలోచించరు.
Date : 17-06-2025 - 8:50 IST -
Starbucks: స్టార్బక్స్ బ్రాండ్ అంబాసిడర్గా చాయ్వాలా.. అసలు నిజమిదే!
ఈ మొత్తం వివాదం ఒక ఏప్రిల్ ఫూల్స్ డే మీమ్ నుంచి ప్రారంభమైంది. సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ ఆదిత్య ఓజా అనే వ్యక్తి ఫోటోషాప్ చేసిన ఒక చిత్రాన్ని షేర్ చేశాడు.
Date : 17-06-2025 - 7:10 IST -
TTD : రేణిగుంట ఎయిర్పోర్టుకు శ్రీవారి పేరు: టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు
రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయం పేరు మార్పు. తిరుమలకు సమీపంలో ఉన్న ఈ విమానాశ్రయానికి శ్రీవారి అంతర్జాతీయ విమానాశ్రయం గా పేరు పెట్టాలని టీటీడీ ప్రతిపాదించింది. ఈ మేరకు పౌర విమానయాన శాఖకు అధికారిక లేఖ రాయాలని నిర్ణయించడంతో, భవిష్యత్లో తిరుమలకు వచ్చే భక్తులకు శ్రీవారి పేరుతోనే విమానాశ్రయం స్వాగతం పలికే అవకాశముంది.
Date : 17-06-2025 - 5:43 IST -
CM Chandrababu : రాష్ట్రంలో వ్యర్థాల నిర్వహణ .. రెండు నెలల్లో సర్క్యులర్ ఎకానమీ పాలసీ తీసుకురావాలి : సీఎం
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. రెండు నెలల్లో సర్క్యులర్ ఎకానమీకి సంబంధించి తుది పాలసీ రూపొందించాలి. రాష్ట్రవ్యాప్తంగా వ్యర్థాల నుంచి సంపద సృష్టించే దిశగా చిత్తశుద్ధితో పనిచేయాలి అని అధికారులను ఆదేశించారు.
Date : 17-06-2025 - 4:46 IST -
Kavitha : బీసీ రిజర్వేషన్ల కోసం కేంద్రంపై ఒత్తిడి.. జూలై 17న రైల్ రోకో : ఎమ్మెల్సీ కవిత
కేంద్ర ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లు ఆమోదించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, జూలై 17న రైల్ రోకో చేపట్టనున్నట్లు ఆమె వెల్లడించారు. ఇది మామూలు ఆందోళన కాదు, ఇది బీసీ సమాజం ప్రతిష్టాత్మక పోరాటం అని పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాల బీసీ సంఘాల భాగస్వామ్యంతో దేశవ్యాప్త స్థాయిలో ఈ ఉద్యమాన్ని విస్తరించాలన్నదే తమ లక్ష్యమని కవిత వివరించారు.
Date : 17-06-2025 - 4:17 IST -
Phone Tapping Case : రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్ చేయడం హేయమైన చర్య : మహేశ్కుమార్ గౌడ్
టెలిగ్రాఫ్ చట్టానికి విరుద్ధంగా మా ఫోన్లను ట్యాప్ చేశారు. రాజకీయ నాయకుల వ్యక్తిగత హక్కుల్ని హరిస్తూ జరిగిన ఈ చర్య పూర్తిగా హేయమైనది. ఈ దుశ్చర్యకు పాల్పడిన కేసీఆర్, కేటీఆర్లు సిగ్గుతో తలదించుకోవాలి అని ఘాటుగా స్పందించారు.
Date : 17-06-2025 - 3:08 IST