Trending
-
Pawan Kalyan : అసాంఘిక శక్తులపై కఠిన చర్యలు తప్పవు : డిప్యూటీ సీఎం
ప్రజాస్వామ్య వ్యవస్థను బలహీనపరిచే ప్రయత్నాలు ఏవైనా కూడా ప్రభుత్వం సహించదని, అలాంటి చర్యలపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారని ఆయన హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి మాటల స్వేచ్ఛ ఉందని కానీ అది చట్టాల పరిధిలో ఉండాలని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
Date : 20-06-2025 - 1:58 IST -
Bonalu Festival : బోనాల పండుగకు సిద్ధమవుతున్న భాగ్యనగరం..అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష
మంత్రి పొన్నం ప్రభాకర్ బోనాల ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొననున్న నేపథ్యంలో భద్రత, ట్రాఫిక్, తాగునీరు, వైద్య సహాయం వంటి కీలక అంశాలపై సమగ్ర ప్రణాళిక రూపొందించాలని ఆయన సూచించారు.
Date : 20-06-2025 - 1:47 IST -
Arogya Andhra Pradesh : విజయవాడ బెరంపార్క్లో పడవలపై యోగా.. ప్రపంచ రికార్డు సృష్టించిన విభిన్న కార్యక్రమం
ఈ రికార్డు కార్యక్రమానికి సంబంధించిన ధృవీకరణ పత్రాలను జూన్ 20న నిర్వహించిన ప్రత్యేక వేడుకలో అందజేశారు. వరల్డ్ రికార్డ్ యూనియన్ ప్రతినిధి అలీషా రేనాల్డ్స్ ఈ కార్యక్రమానికి హాజరై, అధికారికంగా ధృవీకరణ పత్రాన్ని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ శ్రీమతి లక్ష్మీశ గారికి అందజేశారు.
Date : 20-06-2025 - 1:10 IST -
Election Commission : ఎన్నికల వీడియోల దుర్వినియోగంపై రాష్ట్రాలకు ఈసీ సూచన
ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత 45 రోజుల్లోగా ఎలాంటి చట్టపరమైన ఫిర్యాదులు రాకపోతే, ఆ ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన అన్ని రకాల దృశ్య రికార్డింగ్లను తొలగించవచ్చని ఈసీ స్పష్టం చేసింది.
Date : 20-06-2025 - 12:59 IST -
Birthday Wishes : రాష్ట్రపతి ముర్ము జీవితం కోట్లాది మందికి స్ఫూర్తి : ప్రధాని మోడీ
మోడీ ఎక్స్ వేదికగా స్పందిస్తూ..రాష్ట్రపతి ముర్ము గారి జీవితం, ఆమె నిబద్ధత, సేవా దృక్పథం దేశంలోని కోట్లాది మందికి స్ఫూర్తిదాయకం. ప్రజాసేవ, సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధి పట్ల ఆమె చూపిస్తున్న అచంచలమైన కట్టుబాటు, దేశ ప్రజలకు బలాన్నిస్తుంది అని అన్నారు.
Date : 20-06-2025 - 11:57 IST -
Air India : ఎయిరిండియాలో వరుస సమస్యలు.. 8 విమాన సర్వీసులు రద్దు
ఎయిరిండియాలో నిర్వహణ వ్యవస్థ లోపించిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీని ప్రభావంగా విమానాల ఆలస్యాలు, రద్దులు సాధారణమైపోతున్నాయి. తాజాగా శుక్రవారం (జూన్ 20) ఎయిరిండియా ఎనిమిది విమాన సర్వీసులను రద్దు చేసినట్లు అధికారికంగా ప్రకటించింది.
Date : 20-06-2025 - 11:25 IST -
PM Modi : నేడు విశాఖకు ప్రధాని మోడీ రాక.. పూర్తి షెడ్యూల్ ఇదే!
, ప్రధాని మోడీ నేడు ఒడిశా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్ నుంచి సాయంత్రం ప్రత్యేక విమానంలో బయలుదేరి, సుమారు సాయంత్రం 6.40కి విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ఆయన నేరుగా తూర్పు నౌకాదళ ప్రధాన కార్యాలయంలోని అధికారుల వసతిగృహం (ఆఫీసర్స్ మెస్)కు చేరుకుంటారు.
Date : 20-06-2025 - 10:49 IST -
Yogandhra 2025 : విశాఖ యోగా వేడుక ప్రపంచానికి ఒక సందేశం – కేంద్ర ఆయుష్ శాఖ కార్యదర్శి రాజేష్
కేంద్ర ఆయుష్ శాఖ కార్యదర్శి రాజేష్ కోతే చౌధరి గురువారం విశాఖలో ఏర్పాట్లను సమీక్షించారు. ఇందుకు సంబంధించి వివిధ శాఖల అధికారులతో కలిసి విశ్లేషణలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఈ ఏడాది యోగా దినోత్సవం విశాఖలో జరగడం గర్వకారణం.
Date : 19-06-2025 - 6:52 IST -
TG : గోదావరిలో 968 టీఎంసీలు తెలంగాణ హక్కు..వెయ్యి టీఎంసీలు కావాలని చంద్రబాబును అడగటం ఏంటి?: హరీశ్రావు
అఖిలపక్ష ఎంపీల సమావేశం అనంతరం హరీశ్రావు మీడియాతో మాట్లాడారు. తెలంగాణకు గోదావరిలో 968 టీఎంసీలు నీటి హక్కు. అయినప్పటికీ, సీఎం రేవంత్రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబును వెయ్యి టీఎంసీల నీటిని అడగడం సరిగ్గా లేదు అని అన్నారు. కృష్ణా నదిలో 763 టీఎంసీల కోసం పోరాటం చేస్తున్నామంటే, కేవలం 500 టీఎంసీల కోసం అడగడం రాష్ట్ర హక్కులను తక్కువ చేయడమేనని వ్యాఖ్యానించారు.
Date : 19-06-2025 - 6:30 IST -
Chandrababu : నీటి వనరుల వినియోగంపై వివాదాలు అవసరమా? : సీఎం చంద్రబాబు
కానీ పోలవరం ప్రాజెక్టు తప్ప మిగతా ప్రాజెక్టులన్నీ కేంద్రం అనుమతి లేని ప్రాజెక్టులే. మనం మనం కలహపడితే చివరికి నష్టపోవేది ప్రజలే. తెలంగాణపై నేను ఎప్పుడూ వ్యక్తిగతంగా విభేదించలేదు. ఈ విషయాల్లో స్పష్టత ఉండాలి అని తెలిపారు.
Date : 19-06-2025 - 6:18 IST -
CM Chandrababu : రాష్ట్రవ్యాప్తంగా 1.30లక్షల ప్రాంతాల్లో యోగా కార్యక్రమాలు: సీఎం చంద్రబాబు
రాష్ట్రం మొత్తం ఆఫ్లైన్, ఆన్లైన్ మార్గాల్లో యోగా శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేశాం. 9వ తరగతి నుంచే విద్యార్థులు యోగాను తప్పనిసరిగా అభ్యసించాలి. ఇది వారి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది అని సీఎం పేర్కొన్నారు. భవిష్యత్తులో యోగాపై ప్రత్యేక కోర్సులు, శిక్షణా శిబిరాలు మరింత విస్తృతంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.
Date : 19-06-2025 - 4:35 IST -
Bomb Threat : బెంగళూరు విమానాశ్రయానికి బాంబు బెదిరింపు
దుండుగుడు తనను తాను ఉగ్రవాదినిగా పేర్కొనడం భయాందోళన కలిగించింది. బుధవారం రాత్రి విమానాశ్రయ భద్రతా విభాగానికి వచ్చిన ఈమెయిల్లో, అనుమానితుడు తన పేరు వెల్లడించకుండా, కెంపేగౌడ విమానాశ్రయంలో రెండు బాంబులు అమర్చినట్లు పేర్కొన్నాడు.
Date : 19-06-2025 - 4:22 IST -
Emobot : మీరు డిప్రెషన్ లో ఉన్నారా? మీ సెల్ఫీ కెమెరా ఇప్పుడు మీ మెటల్ హెల్త్ ని గుర్తించగలదు, ఎలాగో తెలుసా?
ఈ యాప్ వినియోగదారుల ముఖ కవళికలను విశ్లేషించి, వారి మనోభావాలను గుర్తించడంలో సహాయపడుతుంది. రోజంతా మొబైల్ ఫోన్ ముందు కెమెరా ద్వారా ముఖాన్ని పరిశీలిస్తూ, ఈ యాప్ వినియోగదారుల భావోద్వేగ పరిస్థితిని గ్రాఫ్ రూపంలో చూపిస్తుంది. ఇది స్టెప్ కౌంట్ లేదా హార్ట్ రేట్ ట్రాకర్ల మాదిరిగానే పని చేస్తుంది.
Date : 19-06-2025 - 3:40 IST -
Uttam Kumar : గోదావరి-బనకచర్ల అంశం..త్వరలో ఇద్దరు సీఎంల భేటీ : మంత్రి ఉత్తమ్కుమార్
ఈ సమావేశంలో ప్రాజెక్టుపై తెలంగాణ రాష్ట్రానికి ఉన్న ఆందోళనలు, న్యాయపరమైన అంశాలను మంత్రి పాటిల్కు వివరించినట్లు తెలిపారు. బనకచర్ల ప్రాజెక్టు పట్ల రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా రైతుల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. చట్టబద్ధ అనుమతులు లేకుండా ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడమంటే కృష్ణా నదీ జలాలపై తెలంగాణ హక్కులను విస్మరించడమే అని మంత్రి ఉత్తమ్ వ్యాఖ్యానించారు.
Date : 19-06-2025 - 3:20 IST -
YS Sharmila: జగన్ ప్రజా సమస్యలపై పోరాటం చేయండి.. బల ప్రదర్శనలు కాదు: షర్మిల
విజయనగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. జగన్ నిర్లక్ష్యం వల్లే ఎంతోమంది యువకులు బెట్టింగ్ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవలి బల ప్రదర్శనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
Date : 19-06-2025 - 2:27 IST -
Lokesh : బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్తో మంత్రి లోకేశ్ భేటీ..నైపుణ్యాభివృద్ధిపై కీలక చర్చలు
విద్యా రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టూల్స్ వినియోగాన్ని పెంచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై లోకేశ్ వివరణ ఇచ్చారు. ఈ క్రమంలో టీబీఐ సంస్థ విద్యా రంగానికి సాంకేతిక మద్దతు ఇవ్వడానికి ఆసక్తి చూపింది.
Date : 19-06-2025 - 2:06 IST -
Israel : ఇజ్రాయెల్లోని మెడికల్ సెంటర్పై ఇరాన్ క్షిపణి దాడి..తీవ్ర ఉద్రిక్తతలు !
ఆస్పత్రిపై దాడి నేపథ్యంలో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి ఎవ్వరూ రాకూడదని, ఇతర ఆస్పత్రులకు వెళ్లాలని ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. ఇది ఇజ్రాయెల్లో అత్యంత రద్దీగా ఉండే మెడికల్ సెంటర్లలో ఒకటి. అయితే అదృష్టవశాత్తూ నిన్నటితో పోలిస్తే ఈ రోజు దాడికి గురైన అంతస్తును ముందుగానే ఖాళీ చేయించడంతో పెద్ద ప్రమాదం తప్పిందని అంబులెన్స్ సర్వీసు చీఫ్ ఎలిబెన్ తెలిపారు.
Date : 19-06-2025 - 12:53 IST -
Election Commission of India : ఓటర్ ఐడీ కార్డుల జారీపై ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
ఈ మేరకు, ఓటర్ ఐడీ కోసం దరఖాస్తు చేసినవారికి కేవలం 15 రోజుల్లోపే కార్డులు పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయం కొత్తగా ఓటు హక్కు కోసం నమోదు చేసుకున్న వారికే కాకుండా, ఇప్పటికే ఓటర్ ఐడీ ఉన్నవారు తమ వివరాల్లో మార్పులు కోరిన సందర్భాల్లోనూ వర్తిస్తుంది.
Date : 19-06-2025 - 12:11 IST -
APSRTC Special : పూరీ జగన్నాథ రథయాత్రకు ఏపీ నుంచి ప్రత్యేక బస్సులు..టికెట్ ధర, బుకింగ్ వివరాలు ఇవే !
జూన్ 27న జరిగే రథయాత్రకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం రాష్ట్రం నలుమూలల నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్నారు. పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ (PNBS), విజయవాడ నుంచి పూరీ రథయాత్రకు ప్రత్యేక బస్సులు ఈ నెల 25వ తేదీ రాత్రి 10 గంటలకు బయలుదేరతాయి. జూన్ 26న యాత్రలో భాగంగా ప్రముఖ పుణ్యక్షేత్రాలు సందర్శించే అవకాశముంటుంది.
Date : 19-06-2025 - 11:31 IST -
Putin : జెలెన్స్కీను కలిసేందుకు సిద్ధమే.. కానీ ఇప్పుడు కాదు: పుతిన్
రష్యా యుద్ధాన్ని వీలైనంత త్వరగా, ప్రాముఖ్యతనిస్తూ శాంతియుత మార్గంలో ముగించాలని చూస్తోంది. కీవ్ మరియు దాని పాశ్చాత్య మిత్రదేశాలు చర్చలకు సిద్ధంగా ఉంటే, మేము కూడా చర్చలకు సిద్ధమేనని ఆయన చెప్పారు.
Date : 19-06-2025 - 10:42 IST