Trending
-
PM Modi : డిజిటల్ లావాదేవీల్లో 50 శాతం యూపీఐ ద్వారానే: ప్రధాని మోడీ
దాదాపు 20 ఏళ్ల తర్వాత భారత ప్రధానమంత్రి సైప్రస్ పర్యటించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. లిమాసోల్లో నిర్వహించిన భారత్-సైప్రస్ సీఈవో ఫోరమ్లో ప్రధాని మోడీ కీలక ప్రసంగం చేశారు. ప్రపంచంలో జరుగుతున్న మొత్తం డిజిటల్ లావాదేవీలలో 50 శాతం యూపీఐ (UPI) ద్వారా జరుగుతున్నాయని పేర్కొన్నారు.
Date : 16-06-2025 - 1:01 IST -
Census : ‘జన గణన’కు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన హోంశాఖ
ఈ భారీ గణాంక ప్రక్రియను రెండు దశలుగా చేపట్టనున్నారు. పూర్తి ప్రక్రియను 2027 మార్చి 1వ తేదీ నాటికి పూర్తిచేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈసారి జనగణనలో ప్రాధాన్యతగల మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
Date : 16-06-2025 - 12:49 IST -
Padi kaushik Reddy : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ
వ్యాపార సంబంధమైన కారణాలతో ఆయన్ను బెదిరించారని ఆరోపిస్తూ మనోజ్ భార్య ఉమాదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమను ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి రూ.50 లక్షలు ఇవ్వాలంటూ బలవంతంగా బెదిరించారని ఆమె ఆరోపించారు.
Date : 16-06-2025 - 12:30 IST -
KTR : ఇప్పటికి మూడు సార్లు పిలిచారు.. 30 సార్లు పిలిచినా విచారణకు వస్తా: కేటీఆర్
మమ్మల్ని విచారణలకు పిలిచి, రాజకీయ కక్షలు తీర్చుకుంటున్నారని స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటివరకు మూడు సార్లు విచారణకు పిలిచారు. మళ్లీ 30 సార్లు పిలిచినా, నేను విచారణకు హాజరవుతాను. చట్టాలపై, న్యాయవ్యవస్థపై నమ్మకముంది. నిజం నిలబడుతుందనే నమ్మకం నాకు ఉంది అని కేటీఆర్ పేర్కొన్నారు.
Date : 16-06-2025 - 11:21 IST -
Kommineni Srinivasa Rao : నేడు జైలు నుంచి విడుదలకానున్న కొమ్మినేని శ్రీనివాసరావు
శని, ఆదివారాలు కోర్టులకు సెలవులు ఉండటం వల్ల అనివార్యంగా విడుదల ప్రక్రియ ఆగిపోయింది. దీంతో, నేటి రోజు (జూన్ 17) మంగళగిరి కోర్టులో అవసరమైన షూరిటీ పత్రాలను సమర్పించి, ఆయనను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేపట్టారు. ఇప్పటికే న్యాయపరమైన పనులు పూర్తిచేసే దశలో ఉన్నాయి.
Date : 16-06-2025 - 10:58 IST -
Sriharikota : శ్రీహరికోటలోని షార్కు బాంబు బెదిరింపులు
ఈ బెదిరింపు విషయాన్ని తమిళనాడు కమాండ్ కంట్రోల్కు అధికారికంగా తెలియజేశారు. దీంతో తమిళనాడు భద్రతా బలగాలు కూడా అప్రమత్తమయ్యాయి. షార్ పరిసరాల్లో కట్టుదిట్టమైన తనిఖీలు, డ్రోన్ మానిటరింగ్, డాగ్ స్క్వాడ్లతో క్షుణ్ణంగా గాలింపు చేపట్టారు.
Date : 16-06-2025 - 9:52 IST -
Israel-Iran War : ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు ట్రంపే ప్రధాన శత్రువు : నెతన్యాహు సంచలన ఆరోపణలు
ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు ట్రంపే ప్రధాన శత్రువు. ఆయన బలమైన నాయకుడు. దుర్బలంగా ఒప్పందాలు చేసుకునే వాడికాదు. ప్రత్యర్థికి లొంగిపోడు. గతంలో ఇరాన్తో జరిగిన అణుఒప్పందాన్ని పక్కనపెట్టి, ఖాసిమ్ సులేమానీని హతమార్చిన వారే ట్రంప్ అని వ్యాఖ్యానించారు.
Date : 16-06-2025 - 9:30 IST -
KTR : కాసేపట్లో ఏసీబీ విచారణకు హాజరుకానున్న కేటీఆర్
కేటీఆర్ ఇంటికి ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి, మాజీ ఎంపీ బాల్క సుమన్, పటోళ్ల కార్తీక్రెడ్డి తదితరులు వెళ్లారు. తద్వారా, రాజకీయ వర్గాల్లో ఈ కేసు పై చర్చలు మరింత ఉధృతమయ్యాయి. ఫార్ములా ఈ రేసు నిర్వహణలో నిబంధనల ఉల్లంఘనపై ఏసీబీ దర్యాప్తు చేస్తుండగా, ఇందులో ఆర్బీఐ అనుమతి లేకుండా విదేశీ సంస్థకు నిధుల చెల్లింపుపై ఈడీ కూడా కేసు నమోదు చేసింది.
Date : 16-06-2025 - 9:22 IST -
Plane Emergency Landing: విమానం ప్రమాదంలో ఉన్నప్పుడు ప్రయాణికులు ఏం చేయాలి?
ఒకవేళ విమానంలో సిబ్బంది సభ్యులు అకస్మాత్తుగా "బ్రేస్, బ్రేస్, బ్రేస్!" అని బిగ్గరగా అరవడం ప్రారంభిస్తే మీరు ఏమి చేయాలి? (విమానంలో బ్రేస్ పొజిషన్) మీరు గందరగోళానికి గురవుతారు. కానీ ఇది నిజంగా అత్యవసర ల్యాండింగ్ హెచ్చరిక.
Date : 15-06-2025 - 8:05 IST -
WTC Prize Money: డబ్ల్యూటీసీ ఫైనల్.. ఏయే జట్టుకు ఎంత ప్రైజ్మనీ అంటే?
భారత జట్టు ఈసారి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్స్ టేబుల్లో మూడవ స్థానంలో నిలిచింది. దీని కారణంగా టీమ్ ఇండియాకు 1.44 మిలియన్ డాలర్లు లభించాయి. ఇది భారతీయ రూపాయల్లో సుమారు 12 కోట్ల రూపాయలు.
Date : 15-06-2025 - 4:45 IST -
Anirudh – Kavya Maran : కావ్య తో పెళ్లి.. అనిరుధ్ క్లారిటీ ఇచ్చాడుగా !
Anirudh - Kavya Maran : ఇద్దరూ ఇటీవల ఓ మ్యాచ్ సమయంలో కలిసి కనిపించడం, అలాగే అనిరుధ్ తరచూ SRH మ్యాచ్లకు హాజరవుతుండడం వల్ల ఈ రూమర్స్ కు బలం చేకూర్చినట్లు అయ్యింది.
Date : 14-06-2025 - 7:37 IST -
Stone attack : పొదిలి వైసీపీ రాళ్ల దాడి ఘటన.. మరో 15 మంది అరెస్ట్
దీనికి సంబంధించి పోలీసులు విచారణ ప్రారంభించగా, నిన్న తొలుత 9 మందిని అరెస్టు చేశారు. తాజాగా మరిన్ని ఆధారాలు వెలుగులోకి రావడంతో ఇవాళ మరో 15 మందిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ ఘటనలో ఇంకా కొంతమంది పరారీలో ఉన్నారని పోలీసులు వెల్లడించారు.
Date : 14-06-2025 - 6:25 IST -
PM Modi : జీ-7 సదస్సుకు హాజరుకానున్న ప్రధాని మోడీ
జూన్ 15 నుండి 19వ తేదీ వరకు ఈ పర్యటన కొనసాగనుంది. ప్రధాని మోడీ తన పర్యటనను సైప్రస్తో ప్రారంభించనున్నారు. సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడోలైడ్స్ ఆహ్వానంతో జూన్ 15-16 తేదీల్లో మోడీ ఆ దేశాన్ని సందర్శించనున్నారు. దాదాపు 20 ఏళ్ల తరువాత సైప్రస్కి వెళ్తున్న తొలి భారత ప్రధాని మోడీ కావడం విశేషం.
Date : 14-06-2025 - 6:09 IST -
Ram Mohan Naidu : విమాన ప్రమాదం..సమగ్ర దర్యాప్తుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు
ప్రమాదం ఎలా జరిగింది? దాని వెనుక కారణాలు ఏమిటి అనే అంశాలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అవసరమైతే కమిటీలో ఇంకా నిపుణులను చేర్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.
Date : 14-06-2025 - 4:03 IST -
Free Aadhaar Update : మరోసారి ఆధార్ ఫ్రీ డాక్యుమెంట్ల అప్లోడ్ గడువు పొడిగింపు
ఇప్పుడు ఈ గడువు మరో సంవత్సరం పాటు అంటే 2026 జూన్ 14 వరకు పొడిగించినట్లు ఉడాయ్ ప్రకటించింది. ఈ సందర్భంగా ఎక్స్లో ఒక పోస్ట్ ద్వారా UIDAI స్పందిస్తూ, ఆధార్ వివరాలను తాజా సమాచారం ప్రకారం ఉంచుకోవడం ఎంతో అవసరం అని పేర్కొంది.
Date : 14-06-2025 - 3:12 IST -
Shubhanshu Shukla : జూన్ 19న శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర..ఇస్రో ప్రకటన
ఈ అంతరిక్ష ప్రయాణం ‘యాక్సియం-4’ (Axiom-4) మిషన్ కింద నిర్వహించబడుతోంది. అమెరికాలోని ప్రముఖ వాణిజ్య అంతరిక్ష సంస్థ ‘యాక్సియం స్పేస్’ ఈ మిషన్కు నాయకత్వం వహిస్తున్నది.
Date : 14-06-2025 - 2:32 IST -
Gaddar Foundation : గద్దర్ ఫౌండేషన్కు తెలంగాణ ప్రభుత్వం రూ.3 కోట్లు మంజూరు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గద్దర్ జయంతి ఉత్సవాల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు, ప్రభుత్వం గద్దర్ ఫౌండేషన్కు రూ.3 కోట్ల నిధులు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధుల విడుదలకు రాష్ట్ర భాషా, సాంస్కృతిక శాఖ తరఫున ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ అధికారిక ఆదేశాలు విడుదల చేశారు.
Date : 14-06-2025 - 1:58 IST -
Yoga : 5 లక్షల మందితో విశాఖలో యోగా..కేంద్రమంత్రి కీలక ప్రకటన..!
ఈ సందర్భంగా ప్రభుత్వ యంత్రాంగం, స్థానిక అధికారులు సంయుక్తంగా ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నారు. ఈ ఏడాది యోగా దినోత్సవాన్ని ప్రత్యేకంగా గుర్తించేందుకు కేంద్రం ముందు నుంచే సిద్ధంగా ఉంది. 100 రోజుల పాటు దేశవ్యాప్తంగా 700 యోగా కార్యక్రమాలు ఇప్పటికే నిర్వహించబడ్డాయి. అయితే ప్రధాన కార్యక్రమం మాత్రం జూన్ 21న విశాఖపట్నం బీచ్ వద్ద జరగనుంది.
Date : 14-06-2025 - 1:14 IST -
CM Revanth Reddy : ఈ నెల 16న రైతులతో సీఎం ముఖాముఖి.. కలెక్టర్లు ప్రత్యేక ఏర్పాట్లు
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రైతులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి సందేహాలను నివృత్తి చేయనున్నారు. ప్రతి మండలం నుంచి కనీసం 250 మంది రైతులు పాల్గొనేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Date : 14-06-2025 - 12:42 IST -
world’s largest list : ప్రపంచ కుబేరుల జాబితాలో 9 మంది భారతీయ వ్యాపార దిగ్గజాలు
ప్రపంచవ్యాప్తంగా అత్యంత సంపన్నుల జాబితాను బ్లూమ్బర్గ్ సంస్థ ప్రతి సంవత్సరం విడుదల చేస్తోంది. ఈ జాబితాలో స్థానం పొందడం అనేది ఆర్థిక ప్రపంచంలో ఎంతో ప్రాముఖ్యాన్ని సంతరించుకుంటుంది. 2025 సంవత్సరానికి గాను విడుదలైన తాజా బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ జాబితాలో మొత్తం 500 మంది కుబేరులు ఉన్నారు.
Date : 14-06-2025 - 11:44 IST