Trending
-
Patanjali : ప్రకటనల ప్రచారాన్ని ఆపండి.. పతంజలికి ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు
పతంజలి సంస్థ ఇటీవల విడుదల చేసిన కొన్ని ప్రకటనల్లో, ఆయుర్వేద గ్రంథాల ప్రకారం తాము మాత్రమే నిజమైన చ్యవన్ప్రాశ్ తయారుచేస్తున్నామనే మాటలు పేర్కొన్నది. అంతేకాదు, ఇతర సంస్థలు సరైన పరిజ్ఞానముండకుండా ఉత్పత్తులు తయారు చేస్తున్నాయని కూడా ఆరోపించింది.
Published Date - 02:05 PM, Thu - 3 July 25 -
MLC Kavitha : 42 శాతం బీసీ రిజర్వేషన్లు లేకుండా స్థానిక ఎన్నికలు వద్దు : ఎమ్మెల్సీ కవిత
ఈ మేరకు మీడియాతో మాట్లాడిన ఆమె, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించకుండా ఎన్నికలు నిర్వహించడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోడీని కలిసేందుకు అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు.
Published Date - 12:28 PM, Thu - 3 July 25 -
CM Chandrababu : ఏమీ చేయలేని వాళ్లే శవ రాజకీయాలు చేస్తుంటారు : సీఎం చంద్రబాబు
కారు కింద పడ్డ మనిషిని కుక్కపిల్లలా పక్కకు నెట్టేసి పోతారా? కంపచెట్లలో పడేసి వెళ్లడమంటే మానవత్వం ఉందా? సామాజిక స్పృహ లేకుండా ఇలా ప్రవర్తించడాన్ని ఎలా న్యాయబద్ధీకరిస్తారు?అంటూ సీఎం తీవ్రంగా స్పందించారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఒక మహిళను బెదిరించడం, కుటుంబాలను లక్ష్యంగా చేసుకోవడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు.
Published Date - 12:14 PM, Thu - 3 July 25 -
HHVM Trailer : అదిరిపోయిన హరిహర వీరమల్లు ట్రైలర్ ..ఫ్యాన్స్ కు పూనకాలే
HHVM Trailer : ట్రైలర్లో పవన్ లుక్, డైలాగ్స్, భారీ యాక్షన్ సన్నివేశాలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, విజువల్ ఎఫెక్ట్స్ అన్నీ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడేలా చేశాయి
Published Date - 11:46 AM, Thu - 3 July 25 -
Konda Murali : నాకు ప్రజాబలం ఉంది..చాలా కేసులకే నేను భయపడలేదు: కొండా మురళి
ఈ సందర్భంగా కొండా మురళి మీడియాతో మాట్లాడుతూ.. తాను వెనుకబడిన వర్గాల ప్రతినిధినిగా ప్రజల కోణంలో పనిచేస్తున్నానని, వారికి సమస్యల పరిష్కారమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. నేను ఎప్పుడూ బీసీల కోణంలో ఉండే నాయకుడిని. ప్రజలు నన్ను నమ్మి దగ్గరకు వస్తున్నారు.
Published Date - 11:21 AM, Thu - 3 July 25 -
PM Modi : ఘనా అత్యున్నత పురస్కారంతో మోడీ సత్కారం: భారత-ఘనా బంధానికి కొత్త అధ్యాయం
ఘనా అధ్యక్షుడు జాన్ ద్రమాని మహామా స్వయంగా ఈ అవార్డును ప్రధానికి ప్రదానం చేయడం విశేషం. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ..ఈ అవార్డును పొందడం నా జీవితంలో గౌరవకరమైన క్షణం. ఇది భారత్ మరియు ఘనా మధ్య ఉన్న బలమైన సంబంధాలకు సూచిక. ఈ గౌరవం 140 కోట్ల మంది భారతీయుల తరఫున నేను అంకితంగా స్వీకరిస్తున్నాను.
Published Date - 11:05 AM, Thu - 3 July 25 -
Amarnath Yatra 2025 : ప్రారంభమైన అమర్నాథ్ యాత్ర..కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా యాత్రను అధికారికంగా ప్రారంభించగా, గురువారం ఉదయం జమ్మూ నగరంలోని భగవతి నగర్ యాత్రి నివాసం నుంచి రెండో బృందంగా 5,246 మంది భక్తులు ప్రత్యేక భద్రతా కాన్వాయ్ల మధ్య కశ్మీర్ లోయకు బయలుదేరారు.
Published Date - 10:51 AM, Thu - 3 July 25 -
Govindaraja Swamy Temple : తిరుపతిలో అగ్నిప్రమాదం..రెండు దుకాణాలు, చలువ పందిళ్లు దగ్ధం
మొదట ఒక దుకాణంలో మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే ఆ మంటలు పక్కనే ఉన్న మరో దుకాణానికి వ్యాపించాయి. అంతేకాదు, ఆలయం ముందు వేసిన చలువ పందిళ్లను కూడా మంటలు చుట్టేశాయి. మంటలు భారీగా ఎగిసి పడుతుండటంతో దుకాణాల చుట్టుపక్కల ఉన్న ప్రజలు పరుగులు పెట్టారు.
Published Date - 10:33 AM, Thu - 3 July 25 -
Numerology: ఈ తేదీల్లో పుట్టినవారు ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారట!
న్యూమరాలజీ ప్రకారం.. అంకం 1 ఉన్న వ్యక్తులు స్వాతంత్య్రాన్ని ఇష్టపడతారు. ఎవరి కింద పని చేయడం కంటే తమ సొంత మార్గాన్ని తామే సృష్టించుకోవడానికి ఇష్టపడతారు.
Published Date - 07:30 AM, Thu - 3 July 25 -
GST Revision: సామాన్యులపై మరో పిడుగు.. వీటి ధరలు భారీగా పెరిగే అవకాశం?
క్లీన్ ఎనర్జీ సెస్ లక్ష్యం ఖరీదైన వాహనాలు, బొగ్గు వంటి కాలుష్య కారక ఇంధనాలపై పన్నును పెంచడం ద్వారా స్వచ్ఛమైన శక్తి దిశగా అడుగులు వేయడం. ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హరిత భారత విధానంతో ముడిపడిన చర్యగా పరిగణించబడుతుంది.
Published Date - 08:35 PM, Wed - 2 July 25 -
UPI Services: ఈ బ్యాంక్ వినియోగదారులకు బ్యాడ్ న్యూస్.. రేపు, ఎల్లుండి యూపీఐ సేవలు బంద్!
జులై 3వ తేదీ రాత్రి 11:45 గంటల నుంచి జులై 4వ తేదీ ఉదయం 11:15 గంటల వరకు మొత్తం 90 నిమిషాల పాటు సేవలు అంతరాయం కలుగుతాయి. అయితే, ఈ సమయం తర్వాత సేవలు మునుపటిలాగే సాధారణ స్థితికి వస్తాయి.
Published Date - 07:01 PM, Wed - 2 July 25 -
Sheikh Hasina : కోర్టు ధిక్కార కేసు..బంగ్లా మాజీ ప్రధానికి ఆరు నెలల జైలు శిక్ష..!
గతేడాది దేశంలో చోటు చేసుకున్న సంఘటనలు, రాజకీయంగా ఏర్పడిన ఉద్రిక్తతలే ఈ పరిణామాలకు దారితీశాయని విశ్లేషకుల అభిప్రాయం. 2024లో బంగ్లాదేశ్ రాజకీయాల్లో చోటుచేసుకున్న కీలక మలుపుల్లో ఒకటి, రిజర్వేషన్ల విధానానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాలు. అప్పట్లో తీవ్రంగా భగ్గుమన్న ఆందోళనల నేపథ్యంలో హసీనా ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి ఏర్పడింది.
Published Date - 03:17 PM, Wed - 2 July 25 -
Heavy rains : హిమాచల్ ప్రదేశ్ను ముంచెత్తుతున్న భారీ వర్షాలు, వరదలు..51 మంది మృతి.. రెడ్ అలర్ట్ జారీ!
ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటం, పిడుగులు పడటం వంటి ప్రమాదకర పరిస్థితులు రాష్ట్రాన్ని తాకినాయి. ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటివరకు 51 మంది ప్రాణాలు కోల్పోయారు, మరో 22 మంది ఇప్పటికీ గల్లంతయ్యారు. ఈ విషయాన్ని రాష్ట్ర రెవెన్యూ శాఖకు చెందిన స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ విడుదల చేసిన నివేదికలో పేర్కొంది.
Published Date - 02:44 PM, Wed - 2 July 25 -
Rekha Gupta : ఢిల్లీ సీఎం ఇంటికి రూ. 60 లక్షలతో ఆధునికీకరణ పనులు
రాజ్ నివాస్ మార్గ్లోని ఒకటో నంబర్ బంగ్లా ఆమె అధికారిక నివాసంగా ఉండనుంది. దీనికి సంబంధించిన అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వ పనుల విభాగం (పీడబ్ల్యూడీ) రూ. 60 లక్షలు కేటాయించింది. జూన్ 28న జారీ చేసిన టెండర్ ప్రకారం, ఈ మొత్తం ప్రధానంగా ఎలక్ట్రికల్ ఆధునికీకరణ పనుల కోసం వినియోగించనున్నారు.
Published Date - 02:29 PM, Wed - 2 July 25 -
Harish Rao: చంద్రబాబుకు రేవంత్ రెడ్డి బ్యాగ్ మ్యాన్ గా మారారు: హరీశ్ రావు
కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం తమ రాజకీయ ప్రయోజనాలకే ముందంజ వేస్తుందనీ, ప్రజల సంక్షేమాన్ని విస్మరించిందని ఆరోపించారు. ఇటీవల నీటిపారుదల శాఖపై ప్రగతి భవన్లో జరిగిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్పై కూడా హరీష్ రావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
Published Date - 02:03 PM, Wed - 2 July 25 -
Pathamailaram : పాశమైలారం ఘటన.. మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం: సిగాచీ పరిశ్రమ
మృతుల కుటుంబాలకు రూ.1 కోటి చొప్పున పరిహారం అందిస్తామని, గాయపడిన వారికి మెరుగైన వైద్యం కల్పిస్తామని సంస్థ ప్రకటించింది. సిగాచీ కంపెనీ తరఫున సంస్థ కార్యదర్శి వివేక్ కుమార్ ఈ ప్రకటనను బుధవారం విడుదల చేశారు.
Published Date - 01:30 PM, Wed - 2 July 25 -
GST : మధ్యతరగతి ప్రజలకు ఊరట..జీఎస్టీ తగ్గింపు యోచనలో కేంద్రం..రేట్లు తగ్గే వస్తువుల లిస్ట్ ఇదే..!
దీంతో సామాన్య ప్రజానికానికి రోజువారీ ఖర్చుల్లో కొంత తలనొప్పి తగ్గే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం అమలులో ఉన్న 12 శాతం జీఎస్టీ శ్లాబును పూర్తిగా తొలగించడం, లేదా ఈ శ్లాబులో ఉన్న కొన్ని కీలక నిత్యావసర వస్తువులను 5 శాతం పన్ను శ్లాబులోకి తరలించడం వంటి ప్రతిపాదనలను కేంద్రం సీరియస్గా పరిశీలిస్తోంది.
Published Date - 01:02 PM, Wed - 2 July 25 -
Delhi : పార్లమెంట్ భద్రతా వైఫల్యం కేసు.. నిందితులకు బెయిల్
. వారు పసుపు రంగు పొగ వదులుతూ సభలోని సభ్యులను, భద్రతా సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేశారు. ఇదే సమయంలో పార్లమెంట్ భవనం బయట నీలమ్ ఆజాద్, అమోల్ శిందేలు ఆందోళన చేపట్టారు. ఈ సంఘటనతో దేశవ్యాప్తంగా భద్రతపై తీవ్రమైన చర్చలు ప్రారంభమయ్యాయి.
Published Date - 12:42 PM, Wed - 2 July 25 -
Suriya Jungrungreangkit : థాయ్లాండ్లో ఒక్క రోజు ప్రధానిగా సూర్య జుంగ్రంగ్రింగ్కిట్
అయితే ఆయన పదవీకాలం కేవలం ఒక్క రోజుకే పరిమితమవడం గమనార్హం. గురువారం జరగనున్న క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణలో కొత్త తాత్కాలిక ప్రధాని నియమితులు కానున్నారు. 38 ఏళ్ల పేతోంగ్తార్న్ షినవత్రాపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఈ పరిణామాలు వెలుగు చూశాయి.
Published Date - 12:31 PM, Wed - 2 July 25 -
Airport : శంషాబాద్ విమానాశ్రయంలో ప్రతికూల వాతావరణం..పలు విమానాలు మళ్లింపు
ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని, పలు విమానాలను ప్రత్యామ్నాయ విమానాశ్రయాలవైపు మళ్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. విమానాశ్రయంలో తక్కువ విజిబిలిటీ ఉండటంతో, ప్రధానంగా ఉత్తరభారతం మరియు తూర్పు భారతదేశం నుండి వచ్చే విమానాలపై ఈ ప్రభావం కనిపించింది.
Published Date - 12:17 PM, Wed - 2 July 25