HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Upsc Cse Notification 2026

యూపీఎస్సీ సీఎస్ఈ, ఐఎఫ్ఎస్ 2026 నోటిఫికేషన్ విడుదల..

  • Author : Vamsi Chowdary Korata Date : 05-02-2026 - 12:33 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
UPSC CSE Notification 2026 Out
UPSC CSE Notification 2026 Out

UPSC CSE Notification 2026:  సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ 2026 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే ఐఏఎస్, ఐఎఫ్ఎస్ లాంటి అత్యున్నత సర్వీసు పొందిన అభ్యర్థులు మరోసారి సివిల్స్ రాయడానికి విల్లేకుండా నిబంధనలు తీసుకొచ్చారు. ఐపీఎస్, ఇతర సర్వీసులు పొందిన వారు మాత్రం మళ్లీ సివిల్స్ రాయొచ్చు. అయితే దీనికి కూడా షరతులు వర్తిస్తాయి. సీఎస్ఈ 2026 నోటిఫికేషన్‌తోపాటు యూపీఎస్సీ తీసుకొచ్చిన కొత్త రూల్స్ ఏంటో తెలుసుకోవడానికి ఈ కథనం పూర్తిగా చదవండి.

  • సీఎస్ఈ 2026 నోటిఫికేషన్ విడుదల
  • 933 ఖాళీలను భర్తీ చేయనున్న కమిషన్
  • అటెంప్ట్స్ విషయంలో కొత్త రూల్స్ తీసుకొచ్చిన యూపీఎస్సీ

సివిల్ సర్వీసెస్‌ ఎగ్జామ్ రాయాలని అనుకుంటున్నారా? ఐఏఎస్, ఐపీఎస్ మీ లక్ష్యమా..? అయితే మీకో అప్డేట్.. యూపీఎస్సీ సీఎస్ఈ ప్రిలిమ్స్ 2026 నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 933 ఖాళీలను భర్తీ చేయనుండగా.. ఫిబ్రవరి 24లోగా ప్రిలిమ్స్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ జారీ చేసిన సమయంలోనే.. కమిషన్ కొత్త రూల్స్‌ను సైతం ప్రకటించింది. ఇప్పటికే సివిల్స్‌కు ఎంపికైన వారు మరోసారి అటెంప్ట్‌ చేసే విషయంలో కొత్త పరిమితులు విధించింది. ఐఏఎస్, ఐఎఫ్ఎస్ (ఫారిన్ సర్వీస్), ఐపీఎస్ సర్వీస్‌‌లకు ఎంపికైన వారికి కొత్త ఆంక్షలను విధించింది. ఇప్పటికే సర్వీస్ పొందిన వారు ప్రయోగాత్మకంగా అనవసరపు అటెంప్ట్స్ చేయకుండా చూసే ఉద్దేశంతో కొత్త రూల్స్ తీసుకొచ్చారు. యూపీఎస్సీ ఇప్పటికే కొత్త కేడర్ పాలసీని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ రెండు మార్పుల ఫలితంగా.. ఆలిండియా సర్వీసుల్లో చేరాలనే బలమైన ఆకాంక్ష ఉన్నవారు మాత్రమే ఇక మీదట సివిల్స్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది.

కొత్త రూల్స్ నాలుగు కేటగిరీల అభ్యర్థులపై ప్రభావం చూపుతాయి..

1. ఇప్పటికే ఐఏఎస్ లేదా ఐఎఫ్ఎస్‌కు ఎంపికైన అభ్యర్థులు

2. ఇప్పటికే ఐపీఎస్‌కు ఎంపికైన అభ్యర్థులు

3. సీఎస్ఈ 2026 ద్వారా ఐపీఎస్ లేదా గ్రూప్ ఏ సర్వీస్ పొందే అభ్యర్థులు

4. సీఎస్ఈ 2025 లేదా దానికి ముందే సివిల్ సర్వీసెస్‌‌కు ఎంపికైన వారు

సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ 2026 నోటిఫికేషన్ కంటే ముందే సివిల్స్‌లో ఉత్తీర్ణులై.. ఐఏఎస్ లేదా ఐఎఫ్ఎస్ సర్వీస్‌కు ఎంపికైన అభ్యర్థులు సీఎస్ఈ 2026 ఎగ్జామ్స్ రాయలేరు. ఈ సర్వీసుల్లో కొనసాగుతూనే మరోసారి సివిల్స్ అటెంప్ట్ చేయడం కుదరదు. ఉద్యోగానికి రాజీనామా చేసి మళ్లీ సివిల్స్ రాయొచ్చు.

ప్రిలిమ్స్ 2026 తర్వాత ఐఏఎస్ లేదా ఐఎఫ్ఎస్ సర్వీస్ పొందిన అభ్యర్థులు సైతం 2026 సివిల్స్ మెయిన్స్ రాయడానికి అర్హతను కోల్పోతారు. మెయిన్స్ 2026 తర్వాత ఐఏఎస్ లేదా ఐఎఫ్ఎస్ సర్వీస్‌ను కేటాయించబడిన అభ్యర్థులను సైతం సీఎస్ఈ 2026 సర్వీస్ కేటాయింపుల విషయంలో పరిగణనలోకి తీసుకోరు. అంటే పాత నియామకమే వర్తిస్తుంది.

ఇప్పటికే ఐపీఎస్ సర్వీస్‌కు ఎంపికైన అభ్యర్థులకు కొంత ఫ్లెక్సిబులిటీని కల్పించారు. ఇలాంటి వారు మళ్లీ సివిల్స్ రాయొచ్చు. కానీ సీఎస్ఈ 2026లో ఐపీఎస్‌ను ఎంపిక చేసుకోలేరు. ఇతర సర్వీసులను మాత్రమే ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. దీని వల్ల ఒకే అభ్యర్థి రెండుసార్లు ఐపీఎస్ సీటును పొందకుండా చూడటానికి వీలవుతుంది.

సీఎస్ఈ 2026 రాసి ఐపీఎస్ లేదా ఇతర గ్రూప్ ఏ సర్వీసులకు ఎంపికైన అభ్యర్థులు సీఎస్ఈ 2027 రాయొచ్చు. అయితే ఆ అభ్యర్థి తప్పనిసరిగా ట్రైనింగ్ అథారిటీ నుంచి మినహాయింపును పొందాలి. ఈ వెసులుబాటు ఒకసారి మాత్రమే అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా సదరు క్యాండిడేట్ తప్పనిసరిగా ఫౌండేషన్ కోర్స్ మాత్రమే అటెండ్ అవ్వాలి, ఎగ్జెంప్షన్ వాడితే పూర్తి శిక్షణ సాధ్యపడదు. ఒకవేళ ట్రైనింగ్‌లో చేరకపోయినా లేదా ఎగ్జెంప్షన్ పొందకపోయినా.. సీఎస్ఈ 2026 నియామకం ఆటోమెటిగ్గా రద్దవుతుంది.

సీఎస్ఈ 2026కు ఎంపికైన అభ్యర్థి సీఎస్ఈ 2027 కూడా రాసి అర్హత సాధిస్తే.. అప్పుడు ఆ అభ్యర్థి ముందు రెండు ఆప్షన్లు ఉంటాయి. ఒకటి 2026 సర్వీస్‌లోనే కొనసాగొచ్చు లేదంటే 2027 సర్వీస్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ఈ రెండింట్లో ఎంపిక చేసుకోని సర్వీస్ క్యాన్సిల్ అవుతుంది. ఒకవేళ క్యాండిడేట్ గనుక సీఎస్ఈ 2027లో సర్వీస్ పొందలేకపోతే.. 2026 సర్వీస్‌లోనే చేరొచ్చు.

సీనియార్టీ అనేది సర్వీస్‌లో చేరిన తేదీని బట్టి ఉంటుంది. కాబట్టి క్యాండిడేట్ మరోసారి ఎగ్జామ్‌ రాసినప్పటికీ సీనియార్టీని తగ్గించరు.

సర్వీస్‌లోనే కొనసాగుతూ.. సీఎస్ఈ 2028 లేదా ఆ తర్వాత నిర్వహించే సివిల్స్ ఎగ్జామ్స్ రాయలేరు. మరోసారి ఎగ్జామ్ రాయాలంటే ప్రస్తుత సర్వీస్‌కు రాజీనామా చేయాలి.

వచ్చిన ర్యాంక్ నచ్చకపోవడంతో.. మళ్లీ సివిల్స్‌కు అటెంప్ట్ చేయాలనుకునే వారు.. సీఎస్ఈ 2026 లేదా 2027లో చేరకుండా ఉండాలి. లేకపోతే కేటాయించిన సర్వీస్ రద్దవుతుంది.

2025లో లేదా అంతకంటే ముందు సివిల్స్ సాధించిన వారికి ప్రత్యేక వెసులుబాటు కల్పించారు. అటెంప్ట్స్ మిగిలిపోయినా లేదంటే రాయడానికి అర్హత ఉంటే.. వీరు 2026లో లేదా 2027లో సివిల్స్ రాయొచ్చు. సీఎస్ఈ 2028 లేదా ఆ తర్వాత నిర్వహించే సివిల్స్ ఎగ్జామ్స్ రాయాలంటే మాత్రమే కచ్చితంగా ప్రస్తుత సర్వీస్‌కు రాజీనామా చేయాలి.

ఒకే అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ సర్వీసులు హోల్డ్ చేయకుండా చూడటానికి, అడ్మినిస్ట్రేటివ్ ట్రైనింగ్ సామర్థ్యాన్ని పెంచడానికి, టాప్ సర్వీసుల్లో సీట్లు బ్లాక్ కాకుండా చూడటానికి, వేగంగా సర్వీస్‌లో స్థిరత్వం సాధించడం కోసం ఈ రూల్స్ ఉపయోగపడతాయి.

 

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • candidates
  • Civil Services Exam 2026
  • Civil Services Examination
  • CSE
  • IAS
  • IFS
  • ips
  • Limit Attempts
  • new rules
  • Union Public Service Commission (UPSC)
  • UPSC
  • UPSC Civil Services
  • UPSC Civils Notification
  • UPSC CSE Notification

Related News

    Latest News

    • అమెరికా-రష్యా మధ్య ముగిసిన ‘న్యూ స్టార్ట్’ ఒప్పందం.. అణు యుద్ధ భయం!

    • మూగ, చెవిటి యువతిపై కన్నతండ్రే అత్యాచారం..

    • అండర్-19 వరల్డ్ కప్.. ఆరోసారి టైటిల్‌పై క‌న్నేసిన భారత్!

    • యూపీఎస్సీ సీఎస్ఈ, ఐఎఫ్ఎస్ 2026 నోటిఫికేషన్ విడుదల..

    • సినిమా ఛాన్సులు లేకపోయినా ..పుకార్లతో అమ్మడికి ఫుల్ క్రేజ్.. !!

    Trending News

      • ఏపీ, తెలంగాణల్లో భయపెడుతున్న హెచ్ఐవీ మరణాలు

      • మద్యం ప్రియులకు గుడ్ న్యూస్.. MRP ధరలకే విక్రయం !

      • మరణానికి ముందు అతనికి ఫోన్ కాల్.. అజిత్ పవార్ చివరి మాటలు ఇవే !

      • టీ20 వరల్డ్ కప్‌.. భారత్-పాక్ మ్యాచ్ జ‌ర‌గ‌కుంటే రూ. 4,500 కోట్ల న‌ష్టం?!

      • వెండి ధరలు ఎందుకు తగ్గుతున్నాయి?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd