HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Why Group 1 Controversy In Telangana What Is Go 55 And Go 29

Group 1 : గ్రూప్ -1 నియామకాలపై వివాదం.. ఏమిటీ జీఓ 55.. జీఓ 29 ?

జీఓ నంబరు 29 ప్రకారం రిజర్వేషన్లతో సంబంధం లేకుండా గ్రూప్-1(Group 1) మెయిన్స్‌లో మెరిట్‌ ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

  • Author : Pasha Date : 20-10-2024 - 1:26 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Group 1 Telangana Go 55 Go 29 Tgpsc Tspsc

Group 1 : తెలంగాణలో గ్రూప్‌–1 మెయిన్స్‌ పరీక్షలపై వివాదం రేగుతోంది.  జీఓ నంబరు 29ని రద్దు చేయాలంటూ అభ్యర్థులు నిరసనలకు దిగుతున్నారు. ఇంతకుముందు వరకు అమలు చేసిన  జీఓ నంబరు 55 ప్రకారమే మెయిన్స్ ఎగ్జామ్స్‌ను నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈనేపథ్యంలో ఈ రెండు జీఓల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Also Read :Lawrence Bishnoi : జైలులో లారెన్స్‌ బిష్ణోయ్‌‌.. సంవత్సరానికి రూ.40 లక్షల ఖర్చులు

జీఓ నంబర్ 29 ఏం చెబుతోంది ? 

  • జీఓ నంబరు 55ను గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2022 సంవత్సరంలో జారీ చేసింది.
  • అయితే  జీఓ నంబరు 55 ప్రకారం జారీ చేసిన గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ను కోర్టు తీర్పు ద్వారా సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రద్దు చేసింది.
  • పాత గ్రూప్-1 నోటిఫికేషన్‌ స్థానంలో కొత్త నోటిఫికేషన్‌ను సీఎం రేవంత్ సర్కారు జారీ చేసింది. ఇందుకోసం జీఓ నంబర్ 29ని ప్రాతిపదికగా తీసుకుంటామని వెల్లడించింది.
  • జీఓ నంబరు 29 ప్రకారం రిజర్వేషన్లతో సంబంధం లేకుండా గ్రూప్-1(Group 1) మెయిన్స్‌లో మెరిట్‌ ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేస్తారు. కేవలం ఉద్యోగాల కేటాయింపులో మాత్రమే రిజర్వేషన్లను వర్తింపజేస్తారు. జీఓ నంబరు 29లోని ఈ నిబంధనల వల్ల ఓపెన్ కేటగిరీలో ఎంపికైన రిజర్వుడు అభ్యర్థులను కూడా రిజర్వేషన్ కేటగిరీ కిందే పరిగణిస్తారు. ఫలితంగా రిజర్వుడ్ కేటగిరీలో ఉన్నవారికి అన్యాయం జరుగుతుందని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు.
  • తమ పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పు వచ్చేవరకూ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలని అభ్యర్థులు కోరుతున్నారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం పరీక్షల నిర్వహణకే మొగ్గు చూపుతోంది. దీనిపై సుప్రీంకోర్టు నుంచి ఎలాంటి ఆదేశాలు వెలువడుతాయో వేచిచూడాలి.
  • జీఓ నంబర్ 29 ప్రకారం.. రిజర్వేషన్‌ ప్రకారం కాకుండా మల్టీజోన్‌ పోస్టుల సంఖ్యకు 50 రెట్ల మంది అభ్యర్థులను గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు ఎంపిక చేస్తారు.  ఇలా 50 రెట్ల మందిని ఎంపిక చేసినప్పుడు రిజర్వుడ్‌ కేటగిరీల్లో అభ్యర్థుల సంఖ్య 1:50 నిష్పత్తి కంటే తక్కువగా ఉంటే.. తదుపరిగా మెరిట్‌ కలిగిన అభ్యర్థులను కూడా అదనంగా తీసుకుంటారు. తెలంగాణ స్టేట్‌ సబార్డినేట్‌ సర్వీసు నిబంధనల్లోని రూల్‌ 22, 22ఏ ఆధారంగా వీరిని జాబ్స్‌కు ఎంపిక చేస్తారు. ఈ మేరకు జీవో 55లోని పార్ట్ ‘బి’లో మార్పులు చేసి జీవో 29ను తీసుకొచ్చారు.
  • గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన జీఓ నంబర్ 55 ప్రకారం.. 1:50 నిష్పత్తిలో గ్రూప్-1 మెయిన్స్‌ పరీక్షలకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ క్రమంలో 40 శాతం మంది అభ్యర్థులను మెరిట్‌ ప్రకారం, 60 శాతం మంది అభ్యర్థులను రిజర్వేషన్ల ప్రకారం ఎంపిక చేస్తారు. మెరిట్‌ ఉన్న రిజర్వుడు అభ్యర్థులు ఓపెన్‌ కోటాలో ఎంపికవుతారు. మెరిట్‌ తక్కువ ఉన్న అభ్యర్థులకు రిజర్వుడు కేటగిరిలో ఛాన్స్ దక్కుతుంది. ఫలితంగా ఓపెన్‌ కోటా, రిజర్వుడు కోటా రెండింటిలోనూ రిజర్వేషన్లు ఉన్న అభ్యర్థులకు ప్రయోజనం లభిస్తుంది.

Also Read :Delhi Explosion : ఢిల్లీలో భారీ పేలుడు.. రంగంలోకి ఫోరెన్సిక్ టీమ్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • GO 29
  • GO 55
  • group 1
  • telangana
  • TGPSC
  • TSPSC

Related News

Omkareshwara Temple

Revanth Reddy: రూ.700 కోట్లతో ఓంకారేశ్వర ఆలయం..శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్ రెడ్డి..

Musi River  తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టులో మరో కీలక ముందడుగు పడింది. హైదరాబాద్ శివార్లలోని గండిపేట మండలం మంచిరేవుల వద్ద రూ.700 కోట్ల భారీ వ్యయంతో నిర్మించనున్న ఓంకారేశ్వర స్వామి ఆలయ నిర్మాణ పనులకు సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ శంకుస్థాపన చేశారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పలువురు ఎమ్మెల్యేలతో కలిసి ఆయన భూమి పూజ కార్యక్రమంలో పా

  • Telangana Speaker Gaddam Prasad

    Telangana Sports: తెలంగాణలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు క్రీడా పోటీలు

  • Vakiti Srihari fish curry Midday meal scheme

    Midday meal scheme: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. మధ్యాహ్న భోజనంలో చేపల కూర: మంత్రి వాకిటి శ్రీహరి

  • Bhadrachalam Pattu Vastralu Sri Rama Navami

    BHADRACHALAM PATTU VASTRALU: భద్రాద్రి సీతారాముల కల్యాణానికి పట్టు వస్త్రాల ప్రత్యేకత

  • Telangana Congress Coordina

    TG Congress : తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త అధ్యాయం

Latest News

  • Challapalli Police Station: చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు..

  • Peddi : ‘పెద్ది’ చిత్ర యూనిట్ కు క్షమాపణలు చెప్పిన మెగా ప్రొడ్యూసర్

  • New Rules: ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్..

  • Gold Price : మళ్లీ దడ పుట్టిస్తున్న బంగారం ధరలు..ఈరోజు తులం ఎంత పెరిగిందంటే !!

  • Vijayawada Durga Temple: దుర్గ గుడి లో సిబ్బంది చేతివాటం

Trending News

    • వివాహిత స్త్రీ ద‌గ్గ‌ర ఎంత బంగారం ఉండొచ్చు?

    • రూ. 25.20 కోట్లకు కొనుగోలు.. బౌలింగ్‌కు దూరంగా ఆల్‌రౌండ‌ర్‌?!

    • Green S** : పర్యావరణ హిత శృంగారాన్ని కోరుకుంటున్న యువత ..ఏంటి పర్యావరణ హిత శృంగారం ?

    • నేడు సీఎస్కే- ఆర్ఆర్ మ‌ధ్య పోరు.. హెడ్-టు-హెడ్ రికార్డులివే!!

    • AP Assembly: అమరావతికి చట్టబద్ధత

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd