KTR: రేవంత్ 420 హామీలు నిరవేర్చాలి: కేటీఆర్
అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన 420 హామీలను నెరవేర్చాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి సూచించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్. కాంగ్రెస్ పార్టీ చేసిన బూటకపు వాగ్దానాలతో కాపు సామాజికవర్గం నష్టపోయిందన్నారు.
- By Praveen Aluthuru Published Date - 04:46 PM, Tue - 2 April 24
KTR: అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన 420 హామీలను నెరవేర్చాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి సూచించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్. కాంగ్రెస్ పార్టీ చేసిన బూటకపు వాగ్దానాలతో తెలంగాణ నష్టపోయిందన్నారు. మంగళవారం మేడ్చల్ పార్లమెంటరీ నియోజకవర్గ సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. 2023 డిసెంబర్ 9న కాంగ్రెస్ ఏకంగా రూ.2 లక్షల పంట రుణమాఫీ ప్రకటన చేసిందని, అయితే పంట రుణమాఫీ పొందిన రైతులు కాంగ్రెస్ కు ఓటు వేయాలని, మిగిలిన వారు బీఆర్ఎస్కు ఓటు వేయాలని కోరారు కేటీఆర్.
రాష్ట్రంలో మహిళలకు రూ.2,500 అమలు చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారని గుర్తు చేశారు. మహిళలకు ఉచిత బస్ సర్వీస్ పథకం ఆటోరిక్షా డ్రైవర్ల జీవనోపాధిని దెబ్బతీసిందని, కొందరు ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేటీఆర్ ఇంకా మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి గ్రూప్ II కింద రిక్రూట్మెంట్ కోసం ఏప్రిల్ 1న నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంది. ఇప్పటివరకు అలాంటి నోటిఫికేషన్ లేదు. ఇలా యువతను కూడా మోసం చేశాడు. ఈ ప్రభుత్వంతో ఏ రంగం, ఏ వయసు వారు సంతోషంగా లేరని కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గెలుపునకు కృషి చేయాలని పార్టీ క్యాడర్ను కోరిన కేటీఆర్.. కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థిని బరిలోకి దింపిందని అన్నారు.
We’re now on WhatsApp. Click to Join
మల్కాజిగిరికి జాతీయ పార్టీ చేసిందేమీ లేదని బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు కేటీఆర్. మల్కాజిగిరిలో బీఆర్ఎస్, బీజేపీ మధ్య పోరు సాగుతున్న సంగతి మీ అందరికీ తెలిసిందే. కేసీఆర్ చేసిన పని కళ్లకు కనపడుతుందని, అయితే గత 10 ఏళ్లలో తెలంగాణకు నరేంద్ర మోదీ చేసిందేమీ లేదని కేటీఆర్ అన్నారు. బీజేపీ మల్కాజిగిరి అభ్యర్థి ఈటెల రాజేందర్ తన నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పగలరా అని ఆయన అన్నారు. కేసీఆర్ కేబినెట్లో ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు రూ.16 వేల కోట్ల పంట రుణాలను మాఫీ చేశారని ఈటెల రాజేందర్కు గుర్తు చేశారు.
Also Read: Pawan Kalyans : టీడీపీ వాళ్లని చూసి నేర్చుకోండి.. జనసేన నాయకులకు పవన్ కళ్యాణ్ సూచన!
Tags
Related News
Narendra Modi : కాంగ్రెస్ ప్రభుత్వం భారతదేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లగలదా
బలహీనమైన ప్రభుత్వం బలమైన దేశాన్ని తయారు చేయగలదా, కాంగ్రెస్ ప్రభుత్వం భారతదేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లగలదా అని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ప్రశ్నించారు.