Uttam Kumar Reddy : రాష్ట్ర ప్రజల హక్కులను రక్షించేందుకు కట్టుబడి ఉన్నాం
Uttam Kumar Reddy : తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ మధ్య కృష్ణా నదీ జలాల పంపిణీ వివాదంలో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ముందడుగు లభించింది. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ వాదనలకు మద్దతు లభించిందని ఆయన వెల్లడించారు.
- Author : Kavya Krishna
Date : 13-02-2025 - 10:09 IST
Published By : Hashtagu Telugu Desk
Uttam Kumar Reddy : తెలంగాణ రాష్ట్ర ప్రజల హక్కులను రక్షించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. కృష్ణా జలాల అంశంలో తెలంగాణకు అన్యాయం జరగనివ్వమని ఆయన దృఢంగా తెలిపారు. తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ మధ్య కృష్ణా నదీ జలాల కేటాయింపు వివాదంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన WP1230/2023 పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, న్యాయవాదులతో కలిసి స్వయంగా కోర్టులో హాజరయ్యారు.
విచారణలో సుప్రీంకోర్టు, అన్ని వాదనలు ఈ నెల 25వ తేదీలోపు షార్ట్ నోట్స్ రూపంలో సమర్పించాలని సూచిస్తూ, కేసు విచారణను ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ఈ తీర్పు తెలంగాణ వాదనలకు అనుకూలంగా నిలిచిందని, ఇది రాష్ట్ర హక్కుల రక్షణలో ఒక కీలక దశ అని వ్యాఖ్యానించారు.
CM Chandrababu : ఇది రాష్ట్ర పశుసంవర్ధక వారసత్వానికి అద్దం పడుతున్న గొప్ప ఘట్టం
ఈ నేపథ్యంలో ఈ నెల 19 నుంచి 21వ తేదీ వరకు జరగనున్న బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ విచారణ యథాతథంగా కొనసాగుతుందని మంత్రి స్పష్టం చేశారు. తెలంగాణ వాదనలకు న్యాయమూర్తుల ముందు సమర్థతతో ప్రతిపాదనలు ఇస్తామని తెలిపారు.
ఈ సుప్రీంకోర్టు విచారణకు తెలంగాణ ప్రభుత్వం తరఫున నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, న్యాయవాదులు వైద్యనాథన్, గోపాల్ శంకర్ నారాయణ, అంతర్రాష్ట్ర నీటి వనరుల విభాగం అధికారులు, ENC (O&M) హాజరయ్యారు.
తెలంగాణ ప్రభుత్వం కృష్ణా జలాల వివాదంలో తన హక్కులను కాపాడేందుకు మరింత గట్టి చర్యలు తీసుకుంటుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం అన్ని రంగాల్లో సన్నద్ధంగా ఉంటుందని, సాగు రైతుల భవిష్యత్తును కాపాడడం కోసం నిరంతర ప్రయత్నాలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
Hindustan Coca-Cola : హిందూస్తాన్ కోకా-కోలా బేవరేజెస్ కార్యక్రమాలను ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం