Telangana: తెలంగాణలో రోడ్డు ప్రమాదాలు.. స్కూల్ బస్సు బోల్తా
తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
- By Gopichand Published Date - 08:47 AM, Sat - 3 December 22
తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అశ్వారావుపేట మండలం పాపిడిగూడెంలో శనివారం ఉదయం స్కూల్ బస్సు బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది చిన్నారులు ఉన్నారు. బస్సు బోల్తా పడడంతో వారందరికీ గాయాలయ్యాయి. ప్రమాదస్థలికి పోలీసులు హుటాహుటిన చేరుకున్నారు. గాయపడిన చిన్నారులను సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
మరోవైపు.. మెదక్ జిల్లాలో శనివారం ఉదయం ఘోరప్రమాదం జరిగింది. మాసాయిపేట వద్ద టాటా ఏస్ వాహనాన్ని వేగంగా వచ్చిన లారీ వెనుక నుంచి ఢీకొంది. ఈ దుర్ఘటనలో ఒకరు మృతి చెందారు. 20 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. క్షతగాత్రులను పోలీసులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Related News
TS SSC Result: టెన్త్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఫలితాల విడుదల ఎప్పుడంటే..?
బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, తెలంగాణ 10వ తరగతి ఫలితాలను ఏప్రిల్ 30, 2024న ప్రకటించాలని అధికారులు భావిస్తున్నారు.