HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Revanth Government Delivers Another Piece Of Good News To Farmers

రైతులకు రేవంత్ సర్కార్ మరో శుభవార్త.

  • Author : Vamsi Chowdary Korata Date : 01-04-2026 - 3:55 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Revanth reddy about Rythu Bharosa
Revanth reddy about Rythu Bharosa

Rythu Bharosa  కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందినవారికి తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది. ఇప్పటివరకు కొత్త పాస్ పుస్తకాలు వచ్చిన వారికి రైతు భరోసా నిధులు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. దీంతో ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న 62 వేల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి.. నిజానిజాలు నిర్ధారణ చేసుకున్న తర్వాత.. తుది జాబితాను సిద్ధం చేయనున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు.

రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు గతంలో అధికారంలో ఉన్న కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇక అదే పథకాన్ని రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసాగా పేరు మార్చి రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తోంది. అయితే కొత్తగా భూములు కొనుగోలు చేసిన వారికి మాత్రం ఈ రైతు భరోసా అందడం లేదు. దీంతో ఆ రైతులు తమకు కూడా రైతు భరోసా నిధులు జమ చేయాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే రైతుల విజ్ఞప్తులపై స్పందించిన ప్రభుత్వం.. వారికి కూడా రైతు భరోసా నిధులు జమ చేయనున్నట్లు తెలిపింది.

కొత్తగా పట్టాదారు పాసు పుస్తకాలు వచ్చిన రైతులకు కూడా రైతు భరోసా పథకాన్ని వర్తింపజేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఇప్పటివరకు పాత లబ్ధిదారులకే అమలు చేస్తున్న రైతు భరోసా పథకాన్ని.. కొత్తగా భూములు కొనుగోలు చేసి పట్టాలు పొందిన రైతులకు కూడా వర్తింపజేయాలని రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా పట్టా పాస్ పుస్తకాలు పొందినవారు సుమారు 85 వేల మంది రైతులు ఉన్నారని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు.

ఈ 85 వేల మందిలో ఇప్పటికే 62 వేల మంది అన్నదాతలు రైతు భరోసా పథకం కోసం దరఖాస్తులు చేసుకున్నారు. ప్రస్తుతం వ్యవసాయ శాఖ ఈ దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. రైతు భరోసా పథకానికి ఆ రైతులు అర్హత కలిగి ఉన్నారా, వారి భూమి వివరాలు, పట్టాదారుల నిజానిజాలను నిర్ధారించిన తర్వాత వారం, 10 రోజుల్లో అర్హులకు సంబంధించిన తుది జాబితాను అధికారులు సిద్ధం చేయనున్నారు.

రైతు భరోసా పథకానికి అర్హులుగా తేలిన కొత్త అన్నదాతలకు ఏప్రిల్ 15వ తేదీ నుంచి 20వ తేదీల మధ్య యాసంగి రెండో విడత రైతు భరోసా నిధులను వారి బ్యాంకు అకౌంట్లలో జమ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సీజన్‌లో సుమారు రూ. 9 వేల కోట్లను అన్నదాతల అకౌంట్లలో జమ చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గత వానాకాలం సీజన్‌లో లబ్ధి పొందిన ప్రతీ రైతుకు ఈ యాసంగి సీజన్‌లో కూడా ఎలాంటి కోతలు లేకుండా పూర్తిస్థాయి పెట్టుబడి సాయం అందనుంది.

2025-26 ఖరీఫ్ సీజన్‌లో సుమారు 69.39 లక్షల మంది అన్నదాతలకు ఎకరానికి రూ.6 వేల చొప్పున మొత్తం రూ. 8,744.13 కోట్లను కేవలం 9 రోజుల వ్యవధిలోనే అకౌంట్లలో జమ చేసి ప్రభుత్వం రికార్డు సృష్టించింది. రైతు భరోసా పథకం లబ్ధిదారుల సంఖ్యలో 5.22 లక్షల మందితో నల్గొండ జిల్లా అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో 3.53 లక్షలతో సంగారెడ్డి, ఖమ్మం 3.35 లక్షలు, సిద్ధిపేట జిల్లా 3.18 లక్షలతో ఉన్నాయి.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Chief Minister Revanth Reddy
  • congress party
  • New Beneficiaries
  • Rythu Bharosa Scheme
  • Rythu Bharosa Scheme Payments
  • telangana farmers
  • telangana government

Related News

Congress Party

Tamil Nadu Protest: తమిళనాడు గవర్నర్ పై కాంగ్రెస్ ఆగ్రహం

తమిళనాడు రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడంలో జాప్యం జరుగుతోందని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు పిలుపునిచ్చింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, గవర్నర్ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని నిరసిస్తూ రేపు (మే 8వ తేదీన) చెన్నైలో భారీ ధర్నా నిర్వహిం

  • Celebrities Congratulations To Vijay On TVK

    Vijay TVK: ప్రభుత్వ ఏర్పాటుకు ఓకే చెప్పిన గవర్నర్

  • Another Metro Phase 3 in Hyderabad

    హైదరాబాద్ లో మరో మెట్రో ఫేజ్-3.. కేంద్రానికి సీఎం రేవంత్ విజ్ఞప్తి

  • Ktr

    KTR: మాజీ మంత్రి కేటీఆర్‌పై క్రిమినల్ కేసు నమోదు..

  • Highest Liquor Sales

    Highest Liquor Sales: రికార్డ్ సృష్టించిన మందుబాబులు

Latest News

  • Vishal: గవర్నర్ తీరును తప్పుబట్టిన హీరో విశాల్!

  • Petrol Price Hike: పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం ఖాయం..!

  • Pithapuram వర్మపై టీడీపీ వేటు

  • TVK: విజయ్ కి మళ్ళీ షాక్ ఇచ్చిన గవర్నర్

  • Kamal Haasan: గవర్నర్ పై కమల్ హాసన్ ఆగ్రహం

Trending News

    • CM Vijay Thalapathy: సీఎం విజయ్‌ కి ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. గవర్నర్‌తో మరోసారి విజయ్ భేటీ

    • AIADMK: విజయ్ కు మద్దతు ఇచ్చేది లేదన్న అన్నాడీఎంకే

    • BREAKING: ప్రభుత్వ ఏర్పాటులో విజయ్ కు బిగ్ షాక్ ఇచ్చిన గవర్నర్!

    • AIADMK: తమిళ్ పాలిటిక్స్‎లో బిగ్ ట్విస్ట్.. అన్నాడీఎంకే లో రగడ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd