HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Revanth Government Delivers Another Piece Of Good News To Farmers

రైతులకు రేవంత్ సర్కార్ మరో శుభవార్త.

  • Author : Vamsi Chowdary Korata Date : 01-04-2026 - 3:55 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Major changes in the tourism sector... CM Revanth Reddy issues key directives.
Major changes in the tourism sector... CM Revanth Reddy issues key directives.

Rythu Bharosa  కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందినవారికి తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది. ఇప్పటివరకు కొత్త పాస్ పుస్తకాలు వచ్చిన వారికి రైతు భరోసా నిధులు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. దీంతో ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న 62 వేల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి.. నిజానిజాలు నిర్ధారణ చేసుకున్న తర్వాత.. తుది జాబితాను సిద్ధం చేయనున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు.

రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు గతంలో అధికారంలో ఉన్న కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇక అదే పథకాన్ని రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసాగా పేరు మార్చి రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తోంది. అయితే కొత్తగా భూములు కొనుగోలు చేసిన వారికి మాత్రం ఈ రైతు భరోసా అందడం లేదు. దీంతో ఆ రైతులు తమకు కూడా రైతు భరోసా నిధులు జమ చేయాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే రైతుల విజ్ఞప్తులపై స్పందించిన ప్రభుత్వం.. వారికి కూడా రైతు భరోసా నిధులు జమ చేయనున్నట్లు తెలిపింది.

కొత్తగా పట్టాదారు పాసు పుస్తకాలు వచ్చిన రైతులకు కూడా రైతు భరోసా పథకాన్ని వర్తింపజేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఇప్పటివరకు పాత లబ్ధిదారులకే అమలు చేస్తున్న రైతు భరోసా పథకాన్ని.. కొత్తగా భూములు కొనుగోలు చేసి పట్టాలు పొందిన రైతులకు కూడా వర్తింపజేయాలని రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా పట్టా పాస్ పుస్తకాలు పొందినవారు సుమారు 85 వేల మంది రైతులు ఉన్నారని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు.

ఈ 85 వేల మందిలో ఇప్పటికే 62 వేల మంది అన్నదాతలు రైతు భరోసా పథకం కోసం దరఖాస్తులు చేసుకున్నారు. ప్రస్తుతం వ్యవసాయ శాఖ ఈ దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. రైతు భరోసా పథకానికి ఆ రైతులు అర్హత కలిగి ఉన్నారా, వారి భూమి వివరాలు, పట్టాదారుల నిజానిజాలను నిర్ధారించిన తర్వాత వారం, 10 రోజుల్లో అర్హులకు సంబంధించిన తుది జాబితాను అధికారులు సిద్ధం చేయనున్నారు.

రైతు భరోసా పథకానికి అర్హులుగా తేలిన కొత్త అన్నదాతలకు ఏప్రిల్ 15వ తేదీ నుంచి 20వ తేదీల మధ్య యాసంగి రెండో విడత రైతు భరోసా నిధులను వారి బ్యాంకు అకౌంట్లలో జమ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సీజన్‌లో సుమారు రూ. 9 వేల కోట్లను అన్నదాతల అకౌంట్లలో జమ చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గత వానాకాలం సీజన్‌లో లబ్ధి పొందిన ప్రతీ రైతుకు ఈ యాసంగి సీజన్‌లో కూడా ఎలాంటి కోతలు లేకుండా పూర్తిస్థాయి పెట్టుబడి సాయం అందనుంది.

2025-26 ఖరీఫ్ సీజన్‌లో సుమారు 69.39 లక్షల మంది అన్నదాతలకు ఎకరానికి రూ.6 వేల చొప్పున మొత్తం రూ. 8,744.13 కోట్లను కేవలం 9 రోజుల వ్యవధిలోనే అకౌంట్లలో జమ చేసి ప్రభుత్వం రికార్డు సృష్టించింది. రైతు భరోసా పథకం లబ్ధిదారుల సంఖ్యలో 5.22 లక్షల మందితో నల్గొండ జిల్లా అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో 3.53 లక్షలతో సంగారెడ్డి, ఖమ్మం 3.35 లక్షలు, సిద్ధిపేట జిల్లా 3.18 లక్షలతో ఉన్నాయి.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Chief Minister Revanth Reddy
  • congress party
  • New Beneficiaries
  • Rythu Bharosa Scheme
  • Rythu Bharosa Scheme Payments
  • telangana farmers
  • telangana government

Related News

Good news for unemployed youth in Telangana: Green signal for RTC conductor posts.

Jobs: తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఆర్టీసీ కండక్టర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్

తెలంగాణలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త తీపి కబురు అందించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రవాణా అవసరాలు, ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ)లో భారీ సంఖ్యలో ఖాళీల భర్తీకి అనుమతి ఇచ్చింది. మొత్తం 1500 కండక్టర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నుంచి అధికారికంగా గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ నియామక ప్రక్రియను వేరే ఏ బ

  • Telangana is emerging as a global leader in the field of AI: Bhatti Vikramarka

    ఏఐ రంగంలో తెలంగాణ ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తోంది: భట్టి విక్రమార్క

  • Even though KTR got entangled in his own challenge, Revanth Reddy gained the upper hand over BRS!

    Cm Revanth Reddy: తన సవాలులో తానే చిక్కుకున్న KTR.. BRS పై పైచేయి సాధించిన రేవంత్ రెడ్డి!

  • Major changes in the tourism sector... CM Revanth Reddy issues key directives.

    CM Revanth: టూరిజం రంగంలో భారీ మార్పులు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

  • Mallareddy says goodbye to BRS

    Malla Reddy: బీఆర్ఎస్‌కు మల్లారెడ్డి గుడ్ బై

Latest News

  • US – Iran War: ట్రంప్ హెచ్చరించిన తర్వాత, చాబహార్ ఓడరేవుపై దాడి

  • Heavy rains: వర్షం ఎఫెక్ట్‌.. రోడ్లు నదులుగా మారాయి

  • Gold Rate: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్..ఒక్కసారిగా పడిపోయిన బంగారం ధరలు

  • LPG gas cylinder: భారీ వర్షాలకు కొట్టుకొస్తున్న 3,000 ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లు

  • Ravana: యూట్యూబర్ రావణ్‌కు బిగ్ షాక్

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd