Congress Party
-
#Telangana
Kaleshwaram Temple: కాళేశ్వరం ఆలయానికి కొత్త రూపురేఖలు
తెలంగాణలో ప్రసిద్ధ, చారిత్రక త్రిలింగ క్షేత్రాలలో ఒకటైన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వర ముక్తేశ్వర స్వామి క్షేత్రం త్వరలోనే సరికొత్త ఆధ్యాత్మిక వైభవంతో వెలిగిపోనుంది. కాళేశ్వర క్షేత్ర ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చి భక్తులకు అంతర్జాతీయ స్థాయి వసతులు కల్పించేందుకు దేవాదాయ శాఖ పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోంది. శృంగేరి శారదా పీఠాధిపతి జగద్గురు శ్రీ విదుశేఖర భారతీతీర్థ స్వామి అనుమతి, శాస్త్రోక్త సూచనలతో ఈ ఆలయ పునర్నిర్మాణాలకు తుది రూపకల్పన చేశామని దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు […]
Date : 17-06-2026 - 11:57 IST -
#Telangana
Telangana Rythu Bharosa Status: ఆ రోజు మీ అకౌంట్ లోకి రైతు భరోసా…డేట్ ఫిక్స్ చేసిన తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణ వ్యాప్తంగా ఖరీఫ్ సీజన్ పంట సాగు పనులు ఊపందుకుంటున్న తరుణంలో అన్నదాతలకు ప్రభుత్వం తీపి కబురు అందించేందుకు సిద్ధమైంది. పంట పెట్టుబడుల కోసం రైతులు అప్పుల పాలవ్వకుండా సకాలంలో ఆర్థిక సహాయం అందించేలా రైతు భరోసా పథకం అమలుకు వ్యవసాయ, ఆర్థిక శాఖలు సంయుక్తంగా ప్రణాళికలు రచిస్తున్నాయి. ఈ సీజన్లో సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉంటుందనే అంచనాలతో అర్హులైన ప్రతి రైతుకు ఎకరానికి రూ. 6 వేల చొప్పున నేరుగా వారి ఖాతాల్లోనే పెట్టుబడి సాయం […]
Date : 16-06-2026 - 12:07 IST -
#India
Meenakshi Natarajan: సుప్రీం కోర్టులో మీనాక్షి నటరాజన్కు షాక్
మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల వ్యవహారంలో కాంగ్రెస్కు ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ అంశంలో జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. నామినేషన్ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించిన తర్వాత న్యాయస్థానం నేరుగా జోక్యం చేసుకునే అవకాశం చాలా పరిమితమని స్పష్టం చేసింది. జస్టిస్ పీకే మిశ్రా, జస్టిస్ ఏఎస్ చంద్రుర్కర్లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ను విచారించింది. నామినేషన్ తిరస్కరణపై అసంతృప్తి ఉంటే ఎన్నికల కమిషన్ను ఆశ్రయించడమే సాధారణంగా అందుబాటులో ఉన్న మార్గమని కోర్టు […]
Date : 12-06-2026 - 2:45 IST -
#Telangana
Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్ ఘటనపై సీఎం రేవంత్ ఫైర్
మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు పోటీ చేస్తున్న కాంగ్రెస్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ నామినేషన్ను తిరస్కరించడంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఇది బీజేపీ పన్నిన కుట్ర అని, ఆ పార్టీ ‘సీట్ల దొంగతనానికి’ పాల్పడిందని ఆయన తీవ్ర స్థాయిలో విమర్శించారు. భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఇదొక చీకటి రోజని, ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా అభివర్ణించారు. మీనాక్షి నటరాజన్పై తెలంగాణలో ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఓట్ల దొంగతనం తర్వాత […]
Date : 10-06-2026 - 9:08 IST -
#India
PM Modi: జవహర్లాల్ నెహ్రూ రికార్డు బ్రేక్ చేయబోతున్న ప్రధాని మోడీ.
భారత రాజకీయాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరో అరుదైన మైలురాయిని అందుకోనున్నారు. దేశంలో అత్యంత సుదీర్ఘకాలం పాటు నిరంతరాయంగా పాలించిన ప్రధానిగా జూన్ 10న ఆయన సరికొత్త రికార్డు సృష్టించనున్నారు. స్వతంత్ర భారతదేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పేరిట ఉన్న దశాబ్దాల నాటి రికార్డును మోదీ అధిగమించనున్నారు. 2014 మే 26న తొలిసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన మోదీ.. జూన్ 10 నాటికి వరుసగా 4,399 రోజుల పాలనను పూర్తి చేసుకోనున్నారు. దేశంలో మొదటి […]
Date : 03-06-2026 - 5:07 IST -
#South
DK Shivakumar: కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణం
కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. లోక్ భవన్లోని గ్లాస్ హౌస్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ఆయనతో ప్రమాణం చేయించారు. డీకే శివకుమార్ రాజ్యాంగం చేతపట్టుకుని ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అజారుద్దీన్, మల్లు భట్టివిక్రమార్క […]
Date : 03-06-2026 - 5:00 IST -
#Telangana
CM Chandrababu: తెలంగాణలో పవన్ సభపై స్పందించిన చంద్రబాబు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద తెలంగాణకు చెందిన కొందరు నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. రాష్ట్ర విభజన జరిగి 12 సంవత్సరాలు గడిచిపోయాయని.. ప్రశాంతతను చెడగొట్టవద్దని సూచించారు. ప్రజలకు సేవ చేయడంలో పోటీ పడాలి కానీ.. ఇలాంటి వాటిలో కాదన్నారు. తెలంగాణకు ఎవరు ఎంత చేశారనే దానిపై అక్కడి ప్రజలకు అవగాహన ఉందని చంద్రబాబు అన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హైదరాబాద్ పర్యటన తెలుగు రాష్ట్రాలలో ఎంత […]
Date : 03-06-2026 - 4:31 IST -
#India
Rahul Gandhi: సీబీఎస్ఈపై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు
మొబైల్ ఫోన్లతో ఆన్సర్ షీట్లను స్కాన్ చేసి దేశంలోని లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేశారంటూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వం, సీబీఎస్ఈ బోర్డుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 12వ తరగతి డిజిటల్ మూల్యాంకన ప్రక్రియ టెండర్లలో భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు. ఓ ప్రైవేట్ సంస్థకు లబ్ధి చేకూర్చేందుకు నిబంధనలను తుంగలో తొక్కడం వల్లే విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారని ధ్వజమెత్తారు. ఒక్క కంపెనీ కోసం? ఈ వివాదంపై పరిశోధన చేసిన విద్యార్థి సార్థక్ […]
Date : 01-06-2026 - 12:53 IST -
#Telangana
White Ration Cards: తెలంగాణ రేషన్ కార్డుదారులకు షాక్..
తెలంగాణలో నిరుపేదలకు అందాల్సిన తెల్ల రేషన్ కార్డులను దుర్వినియోగం చేస్తున్న అనర్హులపై పౌరసరఫరాల శాఖ ఉక్కుపాదం మోపుతోంది. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా తప్పుడు సమాచారంతో కార్డులు పొంది ఇన్నాళ్లూ దర్జాగా రేషన్ బియ్యాన్ని, ఇతర ప్రభుత్వ సదుపాయాలను అనుభవిస్తున్న వారి ఏరివేత ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఈ తనిఖీల్లో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగుచూశాయి. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న కొందరితో పాటు, నెలకు రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు భారీ వేతనాలు తీసుకునే […]
Date : 25-05-2026 - 10:42 IST -
#Telangana
Telangana Government: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. భారీగా ఉద్యోగాల భర్తీ!
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో నిరుద్యోగులైన మహిళలకు ముఖ్య గమనిక.. త్వరలోనే భారీగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభం కానుంది. అంగన్వాడీ కేంద్రాల్లో భారీగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.. మొత్తం 15,982 పోస్టులను భర్తీ చేసేందుకు కసరత్తు జరుగుతోంది. కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ పోస్టుల భర్తీకి ఈ ఏడాదిలోనే నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. అంగన్వాడీలలో కొంతమందికి ప్రమోషన్లు రావడం, మరికొందరు రిటైర్ అవుతున్నారు. ఈ మేరకు 2025-2026 నాటికి ఉన్న ఖాళీలను పరిగణలోకి తీసుకుంటున్నారు. 2025-26 ఏడాది నాటికి […]
Date : 22-05-2026 - 9:38 IST -
#Telangana
Cm Revanth: తెలంగాణలో కార్మికులకు భారీ శుభవార్త చెప్పిన సీఎం రేవంత్
తెలంగాణ కార్మికులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. కార్మికుల కనీస వేతనాలను పెంచుతున్నట్లు ప్రకటించారు. ఈ వేతనాల పెంపు కోసం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా తీసుకున్న నిర్ణయాలను సీఎం స్వయంగా వివరించారు. ఇక వేతనాల పెంపుతో 1.11 కోట్ల మంది కార్మికులకు మేలు కలుగుతుందని ముఖ్యమంత్రి ప్రకటించారు. మూడు కేటగిరీలుగా కార్మికులను విభజించి వేతనాలు పెంచినట్లు తెలిపారు. రాష్ట్రంలోని కార్మికులకు రేవంత్ రెడ్డి సర్కార్ వరాల జల్లు కురిపించింది. […]
Date : 21-05-2026 - 3:07 IST -
#Telangana
New Pensions: తెలంగాణ ప్రజలకు శుభవార్త.. కొత్త పెన్షన్లు.. ఎప్పటి నుంచంటే..?
తెలంగాణలో జూన్ 2 నుంచి 2 లక్షల కొత్త పింఛన్లను పంపిణీ చేయనున్నట్లు మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రకటించారు. బీఆర్ఎస్ హయాంలో కొత్త పింఛన్లు ఇవ్వలేదని విమర్శించిన ఆయన.. కాంగ్రెస్ ప్రభుత్వంలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్నారు. నిరుద్యోగుల కోసం మిర్యాలగూడ, నకిరేకల్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేయడంతో పాటు జర్మనీలో 5 లక్షల ఉద్యోగాల సాధన కోసం టామ్కామ్ ద్వారా రూ.90 కోట్లతో జర్మన్ భాషా శిక్షణ ఇవ్వనున్నట్లు వివరించారు. తెలంగాణలో కొత్త పెన్షన్ల […]
Date : 18-05-2026 - 11:03 IST -
#Telangana
Revanth Reddy: తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం.. మూడు నగరాలకు ఔటర్ రింగ్ రోడ్లు
తెలంగాణలో మరో మూడు నగరాలకు ఔటర్ రింగ్ రోడ్లు రానున్నాయి. ఖమ్మం, వరంగల్, కరీంనగర్ కార్పొరేషన్లకు ఔటర్ రింగ్ రోడ్లు నిర్మించనున్నారు. ఆదిలాబాద్, నాగోబా, బాసర, కడెం ప్రాజెక్టులను కలుపుతూ టూరిజం కారిడార్ గురించి వివరించారు. రాష్ట్రంలో రాబోయే విమానాశ్రయాలను దృష్టిలో పెట్టుకుని రహదారుల నిర్మాణం చేపట్టాలని సూచించారు. మెగా గ్రోత్ కారిడార్పై సమీక్షలో సీఎం రేవంత్రెడ్డి అధికారులకు సూచనలు చేశారు. తెలంగాణలో కొత్తగా మరికొన్ని నగరాలకు ఔటర్ రింగ్ రోడ్డులు రాబోతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి […]
Date : 14-05-2026 - 10:36 IST -
#India
CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!
టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్ తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుపై సస్పెన్స్ కొనసాగుతోంది. దళపతి విజయ్ పార్టీ టీవీకే 108 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ.. సాధారణ మెజార్టీ లేకపోవడంతో సర్కారు ఏర్పాటు విషయంలో ఇబ్బందులు పడుతోంది. కాంగ్రెస్, వామపక్షాలు సహా చిన్న పార్టీల మద్దతు ఇచ్చాయని మూడుసార్లు గవర్నర్ను కలిశారు. అయితే, ఆయన ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వలేదు. ఈ క్రమంలో ఇప్పుడు తమిళనాడు రాజకీయాలు వీసీకే చుట్టూ తిరుగుతున్నాయి. అయితే, టీవీకే […]
Date : 09-05-2026 - 4:53 IST -
#India
DMK: పొత్తుకు గుడ్ బై చెప్పిన డీఎంకే
తమిళనాడు రాజకీయాల్లో ఒక భూకంపం వంటి పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం మొదలైన విభేదాలు, ఇప్పుడు జాతీయ స్థాయిలో డీఎంకే – కాంగ్రెస్ మధ్య దశాబ్దాల కాలం నాటి పొత్తు తెగిపోయేలా చేశాయి. టీవీకే అధినేత విజయ్కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే, చివరకు కాంగ్రెస్తో బంధాన్ని అధికారికంగా తెంచుకుంది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని […]
Date : 08-05-2026 - 4:33 IST