Telangana: రేవంత్ నువ్వు కేసీఆర్ లా మారకు: రాజా సింగ్
ప్రధాని నరేంద్ర మోడీని పెద్దన్నగా భావించిన సీఎం రేవంత్ రెడ్డిని రాజకీయంగా ప్రశంసిస్తున్నారు. విపక్షాలు మాత్రం బీజేపీకి లోగిపోయినట్లు చిత్రీకరిస్తున్నారు. ఏదేమైనా ప్రధాని రాష్ట్రాలకు పెద్దన్న పాత్ర పోషిస్తాడన్నది వాస్తవం.
- By Praveen Aluthuru Published Date - 08:53 PM, Mon - 4 March 24
Telangana: ప్రధాని నరేంద్ర మోడీని పెద్దన్నగా భావించిన సీఎం రేవంత్ రెడ్డిని రాజకీయంగా ప్రశంసిస్తున్నారు. విపక్షాలు మాత్రం బీజేపీకి లోగిపోయినట్లు చిత్రీకరిస్తున్నారు. ఏదేమైనా ప్రధాని రాష్ట్రాలకు పెద్దన్న పాత్ర పోషిస్తాడన్నది వాస్తవం. ఈ రోజు ప్రధాని మోడీ కార్యక్రమంలో పాల్గొన సీఎం రేవంత్ మాట్లాడుతూ.. మోడీని అన్నగా భావించి కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగిస్తామని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో బీజేపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సీఎం రేవంత్ వ్యాఖ్యలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగితేనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందని రాజా సింగ్ అన్నారు. గత సీఎం కేసీఆర్ మాదిరిగా రేవంత్రెడ్డి వ్యవహరించకూడదన్నారు . ప్రధాని నరేంద్ర మోదీని కేసీఆర్ పొగడ్తలతో ముంచెత్తారని అన్నారు . ఆ తర్వాత కనీసం ప్రొటోకాల్ కూడా పాటించని విషయాన్నీ గుర్తు చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ లాగా రేవంత్ వ్యవహరించవద్దని సూచించారు. కేంద్రంతో ఐక్యంగా ఉంటేనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని అన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం , నాయకులు చేసిన అవినీతిని ప్రజల ముందుకు తీసుకురావాలని రేవంత్ ను కోరారు ఎమ్మెల్యే రాజాసింగ్ . ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని మోదీని అన్న అని సంబోధించడం మంచి పరిణామమని రాజా సింగ్ అన్నారు.
Also Read: Galaxy S24 FE: సామ్సంగ్ నుంచి కొత్త ఫోన్ వచ్చేస్తోంది.. ఫీచర్స్ ఎలా ఉండనున్నాయంటే..
Related News
AP Elections : పోలింగ్ స్టేషన్లకు చేరుకున్న ఈవీఎంలు.. ఉదయం 7గంటలకే పోలింగ్ షురూ..!
ఆంధ్రప్రదేశ్లోని 4.14 కోట్ల మంది ఓటర్లు సోమవారం రాష్ట్ర అసెంబ్లీ, లోక్సభకు ఏకకాల ఎన్నికల పోలింగ్లో 2,841 మంది అభ్యర్థుల రాజకీయ అదృష్టాన్ని నిర్ణయించనున్నారు.