Galaxy S24 FE: సామ్సంగ్ నుంచి కొత్త ఫోన్ వచ్చేస్తోంది.. ఫీచర్స్ ఎలా ఉండనున్నాయంటే..
ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజ తయారీ సంస్థ శాంసంగ్ ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. వినియోగదారు
- By Nakshatra Published Date - 08:41 PM, Mon - 4 March 24
ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజ తయారీ సంస్థ శాంసంగ్ ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. వినియోగదారుల కోసం ఇప్పటికే మంచి మంచి స్మార్ట్ ఫోన్లను అందుబాటులోకి తీసుకువచ్చిన శాంసంగ్ సంస్థ ఎప్పటికప్పుడు మరిన్ని కొత్త కొత్త ఫీచర్ లు కలిగిన స్మార్ట్ ఫోన్ లను తీసుకువస్తూనే ఉంది. అంతేకాకుండా అందరికీ అందుబాటులో ఉండే విధంగా అతి తక్కువ ధరకే మంచి మంచి స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తోంది. ఇకపోతే త్వరలోనే శాంసంగ్ సంస్థ త్వరలోనే మార్కెట్లోకి అతి తక్కువ తర కలిగిన కొత్త స్మార్ట్ ఫోన్ ని విడుదల చేయబోతోంది.
కాగా దక్షిణ కొరియాకు చెందిన స్మార్ట్ ఫోన్ nసంస్థ శాంసంగ్ భారత మార్కెట్లోకి కొత్త ఫోన్ను లాంచ్ చేస్తోంది. సామ్సంగ్ గ్యాలక్సీ ఎస్24 ఎఫ్ఈ పేరుతో కొత్త ఫోన్ను ఈ ఏడాది చివరిలో మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. ఇక శాంసంగ్ గ్యాలక్సీ ఎస్24 ఎఫ్ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఈ ఫోన్ ఎక్స్ నోస్ 2400 ఎస్వోసీ లేదా క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్ సెట్ ప్రాసెస్తో వస్తుందని తెలుస్తోంది. ఈ ఫోన్లో 4500 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ ఫోన్లో 6.1 ఇంచెస్తో కూడిన అమోఎల్ఈడీ డిస్ప్లేను అందించనున్నారు. 12 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ వేరియంట్ / 256 జీబీ స్టోరేజీ వేరియంట్తో వస్తుందని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే ఈ స్మార్ట్ ఫోన్ కెమెరాకు సంబంధించి కంపెనీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే 50 మెగాపిక్సెల్స్తో కూడిన రెయిర్ కెమెరా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కాగా శాంసంగ్ గత ఏడాది తీసుకొచ్చిన గ్యాలకసీ ఎస్23 ఎఫ్ఈకి కొనసాగింపుగా ఈ కొత్త ఫోన్ను తీసుకురానున్నారు. ఈ ఫోన్లో 6.4 ఇంచెష్తో కూడిన స్క్రీన్ను ఇచ్చారు. ఈ ఫోన్ను 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజీ వేరియంట్ గా లాంచ్ చేశారు.
Related News
Gold Price Records: కొత్త రికార్డులు సృష్టిస్తున్న బంగారం ధర.. రేట్లు పెరగడానికి కారణాలివేనా..?
బంగారం ధర (Gold Price Records) రోజురోజుకు కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఢిల్లీ ఎన్సిఆర్లోని బులియన్ మార్కెట్లో బంగారం రికార్డు గరిష్ట స్థాయి రూ.73,350కి చేరుకుంది.