TS Polls : ఇక ఆశలు వదులుకోవాల్సిందే అని కేసీఆర్ కు ప్రశాంత్ కిషోర్ చెప్పాడా..?
బిఆర్ఎస్ పథకాలు అందరికీ చేరకపోవడం, కుటుంబ పాలన, అవినీతి ఆరోపణలు.. ఇవన్నీ బిఆర్ఎస్ పార్టీ కి మైనస్ గా మారాయని పీకే తెలిపారట
- By Sudheer Published Date - 01:34 PM, Thu - 23 November 23
తెలంగాణ ఎన్నికల పోలింగ్ (Telangana Elections 2023) సమయం దగ్గర పడుతున్న కొద్దీ అధికార పార్టీ బిఆర్ఎస్ (BRS) లో భయం ఎక్కువుతుంది. గత రెండుసార్లు పెద్దగా పోటీలేకుండానే విజయం సాధించినప్పటికీ..ఈసారి మాత్రం కాంగ్రెస్ (Congress) గాలి గట్టిగా వీస్తుంది. పదేళ్ల బిఆర్ఎస్ పాలన చూసిన ప్రజలు ఈసారి మార్పు కోరుకుంటున్నారని..ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ కి ఛాన్స్ ఇచ్చి చూద్దాం అనే ధోరణిలో ఉన్నట్లు పలు సర్వేలు చెప్పడం..నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున బిఆర్ఎస్ ప్రభుత్వం ఫై వ్యతిరేకతతో ఉండడం తో వారు కూడా ఈసారి కేసీఆర్ (KCR) ను గద్దె దించాల్సిందే అని గట్టిగా పట్టుబడుతుండడం తో ఈసారి కాంగ్రెస్ పార్టీదే విజయం అన్నట్లు సంకేతాలు అందుతున్నాయి.
ఇదే విషయాన్ని పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ (Prashanth Kishor)..కేసీఆర్ కు చెప్పినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా కేసీఆర్ …ప్రశాంత్ కిషోర్ లు భేటీ అయ్యి..ఎన్నికల తీరు , ప్రజల నాడీ ఫై చర్చించారట. ఇదే విషయాన్నీ గురురాజ్ అంజన్ ట్వీట్ ద్వారా బయటకు వచ్చింది. బీఆర్ఎస్ ను నమ్మేస్థితిలో జనం లేరని , ఇప్పుడేం చేసినా వర్కవుట్ కాదని సీఎంకు.. ప్రశాంత్ వివరించినట్టు సమాచారం. అంతే కాదు తాజాగా పీకే చేసిన సర్వేలను కేసీఆర్ , కేటీఆర్ లకు చూపించారట.
బిఆర్ఎస్ పథకాలు అందరికీ చేరకపోవడం, కుటుంబ పాలన, అవినీతి ఆరోపణలు, అగ్రనేతలు జనానికి దూరంగా ఉంటూ ఫామ్ హౌస్, ప్రగతి భవన్ కే పరిమితం అవడం లాంటి అంశాలు పార్టీ ఫై వ్యతిరేకత వచ్చేలా చేశాయని..పేపర్ లీక్స్ కూడా ప్రభుత్వం ఫై యువతకు నమ్మకం లేకుండా చేశాయని..ఇవన్నీ బిఆర్ఎస్ పార్టీ కి మైనస్ గా మారాయని పీకే తెలిపారట. కాంగ్రెస్ ఫై ప్రజలు గట్టి నమ్మకంతో ఉన్నారని..ఈసారి మార్పు కోరుకుంటున్నారని కేసీఆర్ కు వివరించారట. నష్టం ఎలాగూ జరిగింది.. ఇప్పుడు కొన్ని ప్రధాన సీట్లు అయినా గెలిచేలా వ్యూహం ఇవ్వాలని ప్రశాంత్ కిశోర్ ను కేసీఆర్ కోరినట్టు సమాచారం. అందుకోసం ప్రశాంత్ కొన్ని ఐడియాస్ ఇచ్చారని అంటున్నారు.
Read Also : Telangana: తొమ్మిది జిల్లాలో కాంగ్రెస్ భారీ మెజారిటీతో గెలుపు ఖాయం
Related News
Revanth Reddy : మామ..అల్లుళ్ల నుండి సిద్దిపేటకు విముక్తి కలిగించాలి
పదేళ్లలో ఢిల్లీ దొర, సిద్దిపేట దొర తెలంగాణ కోసం ఏమీ చేయలేదని ఆరోపించారు. మామ పోతే.. అల్లుడు అన్నట్లుగా ఈ ప్రాంతాన్ని దోచుకున్నారని తెలిపారు