HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Telangana
  • >Mlc Elections Are Crucial For These Three Leaders

MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఈ ముగ్గురు నేతలకు కీలకం!

కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రులతో పాటు టీచర్ ఎమ్మెల్సీ పొలింగ్‌ ఈ నెల 27న జరగనుంది. ముఖ్యంగా పట్టభద్రుల ఎన్నికను అటు కాంగ్రెస్ తో పాటు.. ఇటు బీజేపీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి.

  • By Gopichand Published Date - 04:48 PM, Sun - 16 February 25
  • daily-hunt
MLC Elections
MLC Elections

MLC Elections: తెలంగాణ‌లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల (MLC Elections) వేడి పెరిగింది. ఓ వైపు ఎండలు పెరుగుతుంటే.. మరోవైపు ఎన్నికల వేడి కూడా అదే స్థాయిలో పెరిగింది. పోలీంగ్‌కు మరో పది రోజులు గడువు ఉండటంతో నేతల హంగామా చేస్తున్నారు. ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌పై బీజేపీ మరింత ఫోకస్ పెట్టింది. అయితే ఈ ఎన్నికలు ముగ్గురు నేతలు బండి సంజయ్, ధ‌ర్మ‌పురి అర్వింద్‌, రఘునందన్ రావు అత్యంత కీలకంగా మారనున్నారు. ఈ ఎన్నికల ఫలితాలే.. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభావం చూపనున్నాయి.

కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రులతో పాటు టీచర్ ఎమ్మెల్సీ పొలింగ్‌ ఈ నెల 27న జరగనుంది. ముఖ్యంగా పట్టభద్రుల ఎన్నికను అటు కాంగ్రెస్ తో పాటు.. ఇటు బీజేపీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. సుమారుగా 3 లక్షల 50 వేల‌కుపైగా పట్టభద్రుల ఓట్లు ఉన్నాయి. అంతేకాకుండా 45 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఉత్తర తెలంగాణ మొత్తం ఈ ఎన్నికల ప్రభావం ఉంటుంది. గత అసెంబ్లీతో పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఇక్కడ సత్తా చాటింది. 7 అసెంబ్లీ స్థానాలతో పాటు 4 పార్లమెంట్ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. అంతేకాకుండా బీజేపీలో ఫైర్ బ్రాండ్ గా పిలిచే.. ముగ్గురు నేతలు ఈ నియోజకవర్గ పరిధిలో ఉన్నారు. కరీంనగర్ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌, మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఈ ఎమ్మెల్సీ పరిధిలోనే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ ముగ్గురు నేతలు అటు కాంగ్రెస్ తో పాటు ఇటు బీఆర్ఎస్‌పైన‌ తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. ఇక్కడ బీజేపీ నుంచి అంజిరెడ్డి బరిలో ఉన్నారు. మొన్నటివరకు పార్లమెంట్ సమావేశాలు ఉన్న నేపథ్యంలో సరిగా సమయం ఇవ్వలేకపోయారు. ఇప్పుడు ప్రచారంపై ఫోకస్ పెడుతారని పార్టీ శ్రేణులు అంటున్నాయి.

Also Read: Peddgattu Jatara: పెద్ద‌గ‌ట్టు జాత‌ర‌.. భ‌క్తుల కోసం ప్ర‌త్యేక ఏర్పాట్లు!

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అధికంగా ఎమ్మెల్సీ ఓట్లు ఉన్నాయి. సుమారుగా ల‌క్ష 70 వేల మంది ఓటర్లు ఉన్నాయి. ఇక్కడ ఏ పార్టీకి అధికంగా ఓట్లు వేస్తే ఆ పార్టీ గెలిచే అవకాశం ఉంది. దీంతో బండి సంజయ్ ఇక్కడ మరింత దృష్టి పెట్టే అవకాశాలు ఉన్నాయి. అదే విధంగా పార్టీ శ్రేణులను మరింత పరుగులు పెట్టించనున్నారు. ఇప్పటికీ పార్టీ శ్రేణులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రతి ఓటరను పోలింగ్ బూత్‌కు వచ్చే విధంగా దృష్టి పెడుతున్నారు. అదే విధంగా ధర్మపురి అర్వింద్ ఈ ఎన్నికలు కీలకం. నిజామాబాద్ లో కూడా పట్టభద్రుల ఓట్లు గణనీయంగా ఉన్నాయి. ఆయన కూడా మరింత ఫోకస్ పెట్టనున్నారు. అంజిరెడ్డి.. ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన వ్యక్తి. ఈ నేపథ్యంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఇక్కడ అధిక ఓట్లు సాధించే విషయంలో దృష్టి పెడుతున్నారు. రఘునందన్ రావు ఉమ్మడి మెదక్ జిల్లాలో పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహిస్తున్నారు. మొత్తానికి ఈ ముగ్గురు నేతలకు ఈ ఎన్నికలు అత్యంత కీలకంగా మారనున్నాయి. ఇప్పటికే గ్రౌండు లెవల్‌లో బీజేపీ శ్రేణులు ప్రతి ఓట‌ర్‌ని కలిసే విధంగా ప్రణాళికను రూపొందించుకున్నారు. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లలో నియోజకవర్గం ఇంచార్జ్‌ని నియమించి ప్రతిరోజు రిపోర్ట్ అధిష్టానంకి పంపుతున్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bandi Sanjay
  • bjp
  • brs
  • congress
  • elections
  • mlc elections
  • telangana

Related News

Heavy Rains

Alert : 13న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు!

Alert : ఆంధ్రప్రదేశ్ మాదిరిగానే తెలంగాణలో కూడా ఈ అల్పపీడనం తీవ్ర ప్రభావం చూపనుంది. ముఖ్యంగా సెప్టెంబర్ 13 తర్వాత వర్షాలు భారీగా కురిసే అవకాశం ఉంది

  • Kavitha Comments Harish

    Kavitha Vs Harish : నాపై చేసిన ఆరోపణలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నా..కవిత కు ఇన్ డైరెక్ట్ కౌంటర్ ఇచ్చిన హరీశ్

  • Hyderabad

    Hyderabad: గ్రేటర్‌లో నిమజ్జనానికి సర్వం సన్నద్ధం!

  • Harish Rao

    Harish Rao: లండ‌న్‌లో జ‌రిగిన మీట్ అండ్ గ్రీట్ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న హ‌రీష్ రావు!

  • New direction for Telangana education system: CM Revanth Reddy

    Telangana : తెలంగాణ విద్యావ్యవస్థకు కొత్త దిశ : సీఎం రేవంత్‌రెడ్డి

Latest News

  • SIIMA 2025 : సైమా అవార్డ్స్ లో దుమ్ములేపిన పుష్ప 2 ..అవార్డ్స్ మొత్తం కొట్టేసింది

  • Ganesh Immersion : బై బై గణేశా.. నేడే మహానిమజ్జనం

  • Bomb Threat : ఉలిక్కపడ్డ ముంబయి.. ఫ్రెండ్ మీద కోపంతో ఫేక్‌ ఉగ్ర బెదిరింపు మెయిల్‌

  • Production of Eggs : గుడ్ల ఉత్పత్తిలో ఏపీ నం.1

  • GST 2.0 : GST 2.0తో ప్రభుత్వానికి ఎంత నష్టమంటే?

Trending News

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd