HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Mlc Elections Are Crucial For These Three Leaders

MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఈ ముగ్గురు నేతలకు కీలకం!

కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రులతో పాటు టీచర్ ఎమ్మెల్సీ పొలింగ్‌ ఈ నెల 27న జరగనుంది. ముఖ్యంగా పట్టభద్రుల ఎన్నికను అటు కాంగ్రెస్ తో పాటు.. ఇటు బీజేపీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి.

  • By Gopichand Published Date - 04:48 PM, Sun - 16 February 25
  • daily-hunt
MLC Elections
MLC Elections

MLC Elections: తెలంగాణ‌లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల (MLC Elections) వేడి పెరిగింది. ఓ వైపు ఎండలు పెరుగుతుంటే.. మరోవైపు ఎన్నికల వేడి కూడా అదే స్థాయిలో పెరిగింది. పోలీంగ్‌కు మరో పది రోజులు గడువు ఉండటంతో నేతల హంగామా చేస్తున్నారు. ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌పై బీజేపీ మరింత ఫోకస్ పెట్టింది. అయితే ఈ ఎన్నికలు ముగ్గురు నేతలు బండి సంజయ్, ధ‌ర్మ‌పురి అర్వింద్‌, రఘునందన్ రావు అత్యంత కీలకంగా మారనున్నారు. ఈ ఎన్నికల ఫలితాలే.. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభావం చూపనున్నాయి.

కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రులతో పాటు టీచర్ ఎమ్మెల్సీ పొలింగ్‌ ఈ నెల 27న జరగనుంది. ముఖ్యంగా పట్టభద్రుల ఎన్నికను అటు కాంగ్రెస్ తో పాటు.. ఇటు బీజేపీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. సుమారుగా 3 లక్షల 50 వేల‌కుపైగా పట్టభద్రుల ఓట్లు ఉన్నాయి. అంతేకాకుండా 45 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఉత్తర తెలంగాణ మొత్తం ఈ ఎన్నికల ప్రభావం ఉంటుంది. గత అసెంబ్లీతో పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఇక్కడ సత్తా చాటింది. 7 అసెంబ్లీ స్థానాలతో పాటు 4 పార్లమెంట్ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. అంతేకాకుండా బీజేపీలో ఫైర్ బ్రాండ్ గా పిలిచే.. ముగ్గురు నేతలు ఈ నియోజకవర్గ పరిధిలో ఉన్నారు. కరీంనగర్ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌, మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఈ ఎమ్మెల్సీ పరిధిలోనే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ ముగ్గురు నేతలు అటు కాంగ్రెస్ తో పాటు ఇటు బీఆర్ఎస్‌పైన‌ తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. ఇక్కడ బీజేపీ నుంచి అంజిరెడ్డి బరిలో ఉన్నారు. మొన్నటివరకు పార్లమెంట్ సమావేశాలు ఉన్న నేపథ్యంలో సరిగా సమయం ఇవ్వలేకపోయారు. ఇప్పుడు ప్రచారంపై ఫోకస్ పెడుతారని పార్టీ శ్రేణులు అంటున్నాయి.

Also Read: Peddgattu Jatara: పెద్ద‌గ‌ట్టు జాత‌ర‌.. భ‌క్తుల కోసం ప్ర‌త్యేక ఏర్పాట్లు!

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అధికంగా ఎమ్మెల్సీ ఓట్లు ఉన్నాయి. సుమారుగా ల‌క్ష 70 వేల మంది ఓటర్లు ఉన్నాయి. ఇక్కడ ఏ పార్టీకి అధికంగా ఓట్లు వేస్తే ఆ పార్టీ గెలిచే అవకాశం ఉంది. దీంతో బండి సంజయ్ ఇక్కడ మరింత దృష్టి పెట్టే అవకాశాలు ఉన్నాయి. అదే విధంగా పార్టీ శ్రేణులను మరింత పరుగులు పెట్టించనున్నారు. ఇప్పటికీ పార్టీ శ్రేణులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రతి ఓటరను పోలింగ్ బూత్‌కు వచ్చే విధంగా దృష్టి పెడుతున్నారు. అదే విధంగా ధర్మపురి అర్వింద్ ఈ ఎన్నికలు కీలకం. నిజామాబాద్ లో కూడా పట్టభద్రుల ఓట్లు గణనీయంగా ఉన్నాయి. ఆయన కూడా మరింత ఫోకస్ పెట్టనున్నారు. అంజిరెడ్డి.. ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన వ్యక్తి. ఈ నేపథ్యంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఇక్కడ అధిక ఓట్లు సాధించే విషయంలో దృష్టి పెడుతున్నారు. రఘునందన్ రావు ఉమ్మడి మెదక్ జిల్లాలో పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహిస్తున్నారు. మొత్తానికి ఈ ముగ్గురు నేతలకు ఈ ఎన్నికలు అత్యంత కీలకంగా మారనున్నాయి. ఇప్పటికే గ్రౌండు లెవల్‌లో బీజేపీ శ్రేణులు ప్రతి ఓట‌ర్‌ని కలిసే విధంగా ప్రణాళికను రూపొందించుకున్నారు. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లలో నియోజకవర్గం ఇంచార్జ్‌ని నియమించి ప్రతిరోజు రిపోర్ట్ అధిష్టానంకి పంపుతున్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bandi Sanjay
  • bjp
  • brs
  • congress
  • elections
  • mlc elections
  • telangana

Related News

Private Colleges

Private Colleges: ఫీజు బకాయిల సమస్యకు తెర.. ప్రైవేట్ కాలేజీల సమ్మె విరమణ!

చర్చలు సఫలం కావడంతో నవంబర్ 8న అనుకున్న లెక్చరర్ల ప్రదర్శన (యాక్షన్ ప్లాన్), అలాగే నవంబర్ 15న విద్యార్థులతో చేపట్టాలనుకున్న కార్యక్రమాలను రద్దు చేసుకుంటున్నట్టు పాతి సంఘం జనరల్ సెక్రెటరీ రవికుమార్ తెలిపారు.

  • Kalvakuntla movie..Congress production: Bandi Sanjay

    Congress Complaint : బండి సంజయ్ పై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు

  • Maganti Sunitha

    Maganti Sunitha: మాగంటి సునీత‌కు కేటీఆర్ మద్దతు వెనక రియల్ లైఫ్ డ్రామా?

  • Minister Uttam

    Minister Uttam: అభివృద్ధి, సంక్షేమం కోసం నవీన్ యాదవ్‌కు మద్దతు ఇవ్వండి: మంత్రి ఉత్తమ్

  • 42 Percent Reservation

    Jubilee Hills By Election : బిజెపి, బిఆర్ఎస్ కుమ్మక్కు – మంత్రి పొన్నం

Latest News

  • Nuclear Testing: అణు పరీక్షల ప్రకటనతో ప్రపంచంలో కలకలం!

  • Dismissed On 99: టెస్టుల్లో అత్యధిక సార్లు 99 పరుగుల వ‌ద్ద‌ అవుటైన భారత బ్యాట్స్‌మెన్లు వీరే!

  • Pitch Report: ఐదో టీ20లో టీమిండియా గెలుస్తుందా? పిచ్ రిపోర్ట్ ఇదే!

  • Cancer Awareness Day: క్యాన్స‌ర్ ఎంత డేంజరో తెలుసా? ఏడాదిలోనే 97 ల‌క్ష‌ల మ‌ర‌ణాలు!

  • Diesel Cars: పెట్రోల్‌తో పోలిస్తే డీజిల్ ఇంజిన్ ఇప్పటికీ బెస్ట్ ఎందుకు?

Trending News

    • HDFC Bank: హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త!

    • Sanju Samson: సంజు శాంసన్ ట్రేడ్ రేస్‌లోకి సీఎస్కే!

    • Common Voter: వల్లభనేని వంశీ, కొడాలి నాని తీరుపై కామ‌న్ మ్యాన్ ఫైర్!

    • MS Dhoni Retirement: ఐపీఎల్ నుంచి ధోని రిటైర్ అవుతున్నాడా?

    • Virat Kohli Net Worth: టీమిండియా స్టార్ క్రికెట‌ర్ కోహ్లీ నిక‌ర విలువ ఎంతో తెలుసా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd