HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Mlc Elections Are Crucial For These Three Leaders

MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఈ ముగ్గురు నేతలకు కీలకం!

కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రులతో పాటు టీచర్ ఎమ్మెల్సీ పొలింగ్‌ ఈ నెల 27న జరగనుంది. ముఖ్యంగా పట్టభద్రుల ఎన్నికను అటు కాంగ్రెస్ తో పాటు.. ఇటు బీజేపీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి.

  • Author : Gopi Date : 16-02-2025 - 4:48 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
MLC Elections
MLC Elections

MLC Elections: తెలంగాణ‌లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల (MLC Elections) వేడి పెరిగింది. ఓ వైపు ఎండలు పెరుగుతుంటే.. మరోవైపు ఎన్నికల వేడి కూడా అదే స్థాయిలో పెరిగింది. పోలీంగ్‌కు మరో పది రోజులు గడువు ఉండటంతో నేతల హంగామా చేస్తున్నారు. ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌పై బీజేపీ మరింత ఫోకస్ పెట్టింది. అయితే ఈ ఎన్నికలు ముగ్గురు నేతలు బండి సంజయ్, ధ‌ర్మ‌పురి అర్వింద్‌, రఘునందన్ రావు అత్యంత కీలకంగా మారనున్నారు. ఈ ఎన్నికల ఫలితాలే.. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభావం చూపనున్నాయి.

కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రులతో పాటు టీచర్ ఎమ్మెల్సీ పొలింగ్‌ ఈ నెల 27న జరగనుంది. ముఖ్యంగా పట్టభద్రుల ఎన్నికను అటు కాంగ్రెస్ తో పాటు.. ఇటు బీజేపీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. సుమారుగా 3 లక్షల 50 వేల‌కుపైగా పట్టభద్రుల ఓట్లు ఉన్నాయి. అంతేకాకుండా 45 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఉత్తర తెలంగాణ మొత్తం ఈ ఎన్నికల ప్రభావం ఉంటుంది. గత అసెంబ్లీతో పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఇక్కడ సత్తా చాటింది. 7 అసెంబ్లీ స్థానాలతో పాటు 4 పార్లమెంట్ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. అంతేకాకుండా బీజేపీలో ఫైర్ బ్రాండ్ గా పిలిచే.. ముగ్గురు నేతలు ఈ నియోజకవర్గ పరిధిలో ఉన్నారు. కరీంనగర్ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌, మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఈ ఎమ్మెల్సీ పరిధిలోనే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ ముగ్గురు నేతలు అటు కాంగ్రెస్ తో పాటు ఇటు బీఆర్ఎస్‌పైన‌ తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. ఇక్కడ బీజేపీ నుంచి అంజిరెడ్డి బరిలో ఉన్నారు. మొన్నటివరకు పార్లమెంట్ సమావేశాలు ఉన్న నేపథ్యంలో సరిగా సమయం ఇవ్వలేకపోయారు. ఇప్పుడు ప్రచారంపై ఫోకస్ పెడుతారని పార్టీ శ్రేణులు అంటున్నాయి.

Also Read: Peddgattu Jatara: పెద్ద‌గ‌ట్టు జాత‌ర‌.. భ‌క్తుల కోసం ప్ర‌త్యేక ఏర్పాట్లు!

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అధికంగా ఎమ్మెల్సీ ఓట్లు ఉన్నాయి. సుమారుగా ల‌క్ష 70 వేల మంది ఓటర్లు ఉన్నాయి. ఇక్కడ ఏ పార్టీకి అధికంగా ఓట్లు వేస్తే ఆ పార్టీ గెలిచే అవకాశం ఉంది. దీంతో బండి సంజయ్ ఇక్కడ మరింత దృష్టి పెట్టే అవకాశాలు ఉన్నాయి. అదే విధంగా పార్టీ శ్రేణులను మరింత పరుగులు పెట్టించనున్నారు. ఇప్పటికీ పార్టీ శ్రేణులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రతి ఓటరను పోలింగ్ బూత్‌కు వచ్చే విధంగా దృష్టి పెడుతున్నారు. అదే విధంగా ధర్మపురి అర్వింద్ ఈ ఎన్నికలు కీలకం. నిజామాబాద్ లో కూడా పట్టభద్రుల ఓట్లు గణనీయంగా ఉన్నాయి. ఆయన కూడా మరింత ఫోకస్ పెట్టనున్నారు. అంజిరెడ్డి.. ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన వ్యక్తి. ఈ నేపథ్యంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఇక్కడ అధిక ఓట్లు సాధించే విషయంలో దృష్టి పెడుతున్నారు. రఘునందన్ రావు ఉమ్మడి మెదక్ జిల్లాలో పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహిస్తున్నారు. మొత్తానికి ఈ ముగ్గురు నేతలకు ఈ ఎన్నికలు అత్యంత కీలకంగా మారనున్నాయి. ఇప్పటికే గ్రౌండు లెవల్‌లో బీజేపీ శ్రేణులు ప్రతి ఓట‌ర్‌ని కలిసే విధంగా ప్రణాళికను రూపొందించుకున్నారు. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లలో నియోజకవర్గం ఇంచార్జ్‌ని నియమించి ప్రతిరోజు రిపోర్ట్ అధిష్టానంకి పంపుతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bandi Sanjay
  • bjp
  • brs
  • congress
  • elections
  • mlc elections
  • telangana

Related News

Restraint is needed on water disputes: CM Revanth Reddy

Telangana : సంక్షేమ హాస్టళ్లు, పాఠశాలలకు అందించే వస్తువుల సరఫరా పై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

గతంలో విడివిడిగా జరుగుతున్న కొనుగోళ్ల వల్ల జవాబుదారీతనం లోపించిందని గుర్తించిన ప్రభుత్వం, ఇకపై ఒకే గొడుగు కింద పారదర్శకంగా కొనుగోళ్లు జరపాలని నిర్ణయించింది

  • CV Anand Assumes Charge as Telangana DGP

    CV Anand: తెలంగాణ డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్

  • Vh Ipl

    VH : వీహెచ్‌కు కీలక పదవి కట్టబెట్టిన సీఎం రేవంత్

  • KTR clarifies on organizations formed in his name

    KTR : కేటీఆర్ చెంప చెల్లుమనిపించాడు

  • Ashu Reddy

    Ashu Reddy : హైకోర్టును ఆశ్రయించిన అషురెడ్డి

Latest News

  • Toing : వైజాగ్‌లో ‘టోయింగ్’ యాప్ సేవలు ప్రారంభం

  • Toll Plaza : ఇకపై టోల్ ప్లాజాల వద్ద ఆగే పనేలేదు !!

  • West Bengal Election : ఆ రెండు నియోజకవర్గాల్లో రీపోలింగ్!

  • Peddi : ఎట్టకేలకు పెద్ది రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్

  • US Prepping Iran Attack Again : ఇరాన్ పై మరోసారి దాడికి సిద్దమైన అమెరికా ?

Trending News

    • ప్రపంచ రికార్డుకు కేవలం ఒక సిక్స్ దూరంలో వైభ‌వ్ సూర్య‌వంశీ!

    • ట్రంప్‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారా? జెడి వాన్స్ ఆందోళ‌న‌!

    • ఐపీఎల్ 2026.. ఆ జ‌ట్టు కెప్టెన్‌పై క‌ఠిన చ‌ర్య‌లు!

    • ముంబై ఇండియన్స్‌కు కొత్త కెప్టెన్‌?

    • అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలం.. యుద్ధం త‌ప్ప‌దా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd