Malla Reddy: రేవంత్ రెడ్డి సీఎం అవుతాడని నాకెప్పుడో తెలుసు: మల్లారెడ్డి
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మల్లారెడ్డి పేరు వింటే ఎంటర్టైన్మెంట్ పదం గుర్తుకు వస్తుంది. వయసు మీద పడినా ఇంకా తాను కుర్రాడినేనని చెప్పుకుంటూ కిక్ ఇచ్చే డైలాగులతో యువతను ఆకట్టుకుంటాడు. పాలు అమ్మినా అనే ఒక్క డైలాగ్ ద్వారా పాపులారిటీ సంపాదించిన మల్లారెడ్డి ప్రస్తుతం రాజకీయంగా కష్టాలను ఎదుర్కొంటున్నాడు.
- By Praveen Aluthuru Published Date - 01:28 PM, Sun - 17 March 24
Malla Reddy: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మల్లారెడ్డి పేరు వింటే ఎంటర్టైన్మెంట్ పదం గుర్తుకు వస్తుంది. వయసు మీద పడినా ఇంకా తాను కుర్రాడినేనని చెప్పుకుంటూ కిక్ ఇచ్చే డైలాగులతో యువతను ఆకట్టుకుంటాడు. పాలు అమ్మినా అనే ఒక్క డైలాగ్ ద్వారా పాపులారిటీ సంపాదించిన మల్లారెడ్డి ప్రస్తుతం రాజకీయంగా కష్టాలను ఎదుర్కొంటున్నాడు.
రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం మల్లారెడ్డిని టార్గెట్ చేసింది. ఆయన అక్రమ కట్టడాలపై ఫోకస్ చేస్తూ అక్రమంగా నిర్మించిన భవనాలను తొలగించే కార్యక్రమం పెట్టుకుంది. ఈ నేపథ్యంలో మల్లారెడ్డి యూటర్న్ తీసుకున్నాడు. ఇటీవల కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ని కలిసిన ఆయన రాష్ట్ర పరిస్థితుల్ని డీకేకి వివరించారు. దీంతో మల్లారెడ్డి ఫ్యామిలీ కాంగ్రెస్ లోకి వెళ్తుందన్న వార్తలు వైరల్ గా మారాయి. అయితే తాను కేవలం డీకే శివకుమార్ని మర్యాదపూర్వకంగానే కలిశానని చెప్పుకున్నప్పటికీ మల్లన్న మనసులో మరో ఆలోచన ఉన్నట్లు తెలుస్తుంది. ప్రభుత్వంలో లేకపోతే ఎం జరుగుతుందో మల్లన్నకు తెలియంది కాదు. ఈ క్రమంలో మల్లారెడ్డి మరియు అతని కుటుంబ సభ్యులు కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్దమైనట్లు సమాచారం. అందుకే గత కొద్దీ రోజులుగా సీఎం రేవంత్ రెడ్డిని పొగడ్తలతో ముంచెత్తుతున్నాడు.
2014లో బొల్లారంలోని తోట ముత్యాలమ్మ దేవాలయంలో ఓ కార్యక్రమం గురించి మల్లారెడ్డి గుర్తు చేసుకున్నారు. రేవంత్ రెడ్డి కచ్చితంగా సీఎం అవుతాడని ఆనాడే చెప్పినట్లు మల్లారెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియోను మల్లారెడ్డి విడుదల చేశారు.రెడ్డిలల్ల సీఎం అయ్యే ఛాన్స్ రేవంత్ రెడ్డికి ఒక్కడికే ఉందని పదేండ్ల కిందటే చెప్పానని మల్లారెడ్డి చెప్పుకొచ్చాడు. మరోవైపు తన కొడుకు భద్రారెడ్డి మల్కాజ్గిరి ఎంపీ టికెట్ కోసం బీజేపీ, కాంగ్రెస్ల నుంచి ప్రయత్నాలు చేసిన మాట వాస్తవమేనని అన్నాడు.
తాను బీఆర్ఎస్ లోనే ఉంటానని, మరో పార్టీలో చేరేది లేదని స్పష్టం చేశారు. గతంలో రేవంత్ రెడ్డిపై తొడగొట్టి వార్నింగ్ ఇచ్చిన విషయాన్నీ ప్రస్తావిస్తూ అదంతా కేవలం రాజకీయపరంగా మాత్రమే అని.. ఎలాంటి వ్యక్తిగత విభేదాలు తమ మధ్య లేవని చెప్పారు. గతంలో అందరం తెలుగుదేశం పార్టీలో స్నేహంగా మెలిగేవారమని అన్నారు.
Also Read: Pawan Kalyan : పవన్ సినిమాటిక్ యడ్.. ప్రజల్లో ప్రభావం చూపుతుందా..?
Related News
KTR: మొగిలయ్య కుటుంబాన్ని వ్యక్తిగతంగా ఆదుకుంటాను.. హామీ ఇచ్చిన కేటీఆర్
పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ కిన్నెర వాయిద్య సంగీత విద్వాంసుడు దర్శనం మొగిలియ్యకు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు సహాయం చేస్తామని హామీ ఇచ్చారు.