Telangana: కాంగ్రెస్ తొలి ఎంపీ అభ్యర్థి ఖరారు, వారంలో రూ.500కే గ్యాస్, వచ్చేనెల 15న రైతుబంధు
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తమ తొలి ఎంపీ అభ్యర్థిని ప్రకటించింది. మహబూబ్నగర్ నియాజకవర్గం నుంచి ఎంపీ అభ్యర్థిగా వంశీచందర్రెడ్డి ఖరారు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. కొడంగల్ పర్యటనలో భాగంగా వంశీచందర్రెడ్డి పేరును ప్రకటించారు.
- By Praveen Aluthuru Published Date - 07:25 AM, Thu - 22 February 24
Telangana: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తమ తొలి ఎంపీ అభ్యర్థిని ప్రకటించింది. మహబూబ్నగర్ నియాజకవర్గం నుంచి ఎంపీ అభ్యర్థిగా వంశీచందర్రెడ్డి ఖరారు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. కొడంగల్ పర్యటనలో భాగంగా వంశీచందర్రెడ్డి పేరును ప్రకటించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ…
వచ్చే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి వంశీచందర్రెడ్డిని 50 వేల ఓట్ల మెజారిటీతో గెలిపించాలని మహబూబ్నగర్ జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. కొడంగల్కు అందించే ప్రయోజనాలను రెట్టింపు చేస్తానని హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అంతకుముందు కొడంగల్లో రూ.4,369.143 కోట్ల అభివృద్ధి పనులను ఆయన ఆవిష్కరించారు.
మాజీ సీఎం కేసీఆర్ మహబూబ్నగర్ ఎంపీగా ఉన్నారని, 2014లో ప్రధాని నరేంద్ర మోదీ మహబూబ్నగర్కు వచ్చి పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి జాతీయ హోదా కల్పిస్తామని హామీ ఇచ్చారని, ఒక్కరు కూడా తమ హామీలను నిలబెట్టుకోలేదని గుర్తు చేశారు. తెలంగాణ నుంచి 14 మంది ఎంపీలను గెలిపించి లోక్సభకు పంపితేనే తెలంగాణ నుంచి కాంగ్రెస్కు బలం వస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా కృష్ణా నది నుంచి కొడంగల్కు నీరు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు సీఎం రేవంత్.
లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించేందుకు క్యాడర్ కృషి చేయాలనీ కోరారు. కోరుతూ. ఎన్నికలో ఇచ్చిన హామీలో భాగంగా రూ.500 గ్యాస్ సిలిండర్ మరియు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ను తమ ప్రభుత్వం వారంలో అమలు చేయనుందని స్పష్టం చేశారు. అతి త్వరలో రూ.2 లక్షల పంట రుణమాఫీ చేపడతాం. అయితే ముందుగా ‘రైతు బంధు’ని మార్చి 15 నాటికి అమలు చేస్తాం’ అని ఆయన ప్రకటించారు. కొడంగల్లోని కోస్గిలో మహిళా స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు చెక్కులను పంపిణీ చేసి మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
అనంతరం ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో స్వయం సహాయక సంఘాలనుద్దేశించి ప్రసంగించారు. మహిళా స్వయం సహాయక సంఘాలను ప్రభుత్వం బలోపేతం చేస్తుంది. స్కూల్ యూనిఫాం కుట్టించే పనులను స్వయం సహాయక సంఘాలకు అప్పగిస్తామని ఇప్పటికే ప్రకటించామని, ఈ మేరకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామని తెలిపారు. మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు అందించాలని కూడా ప్రభుత్వం ఆలోచిస్తోందన్నారు. ఐకెపి కేంద్రాలను బలోపేతం చేయడంతోపాటు కుటీర పరిశ్రమల్లో నిమగ్నమైన మహిళలను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
Also Read: Prabhas : ఇది కదా రెబల్ మాస్ మేనియా.. ప్రభాస్ 10 సినిమాల లైనప్ ఇదే..!
Tags
Related News
TamilNadu Party : తెలంగాణ ఎన్నికల బరిలో తమిళనాడు రాజకీయ పార్టీ
TamilNadu Party : తొలిసారిగా ఓ తమిళపార్టీ తెలుగు రాష్ట్రాల ఎన్నికల్లో పోటీచేస్తోంది.