HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Telangana
  • >Kcrs Silence About Cadre Exit From Brs

Telangana: జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న గులాబీ బాస్

తెలంగాణలో రాజకీయ పరిస్థితులు మారిపోతున్నాయి. రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ మొదలు పెట్టింది. పార్టీలోకి వచ్చే వారికోసం అధినాయకత్వం తలుపు తెరిచి ఉంచింది. ఈ నేపథ్యంలో నేతల చేరికలు ఊపందుకున్నాయి.

  • By Praveen Aluthuru Published Date - 07:14 PM, Sun - 17 March 24
  • daily-hunt
Telangana
Telangana

Telangana: తెలంగాణలో రాజకీయ పరిస్థితులు మారిపోతున్నాయి. రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ మొదలు పెట్టింది. పార్టీలోకి వచ్చే వారికోసం అధినాయకత్వం తలుపు తెరిచి ఉంచింది. ఈ నేపథ్యంలో నేతల చేరికలు ఊపందుకున్నాయి. గత నెల రోజులుగా చిన్న చితకా నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకోగా, గత రెండ్రోజుల్లో కీలక నేతలు హస్తం గూటికి చేరారు.

రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి ఎన్నికైనప్పటి నుండి పలువురు శాసనసభ్యులు ముఖ్యమంత్రిని కలిశారు. వెళ్లిన తొలి బ్యాచ్ ఎమ్మెల్యేల్లో మెదక్ జిల్లాకు చెందిన నలుగురు ఉన్నారు. కొత్త ప్రభాకర్ రెడ్డి, సునీతా లక్ష్మా రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, కె మాణిక్ రావు ఉన్నారు. అయితే వారంతా ఈ భేటీని కేవలం మర్యాదపూర్వక భేటీగా చెప్పుకొచ్చారు. ఆ తర్వాత చాలా మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ ని కలవడం, మర్యాదపూర్వకంగా అనే చెప్పడం కామన్ అయిపోయింది.

రేవంత్‌రెడ్డిని కలిసిన బీఆర్‌ఎస్‌కు చెందిన పలువురు ఎమ్మెల్యేలలో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు ఒకరు. ఎమ్మెల్యే ముఖ్యమంత్రిని కలవడం చాలా సాధారణమని అన్నారు. అనంతరం ఇందిరమ్మ ఇండ్లు ఆవిష్కరణ కార్యక్రమంలో సీఎంతో కలిసి వేదిక పంచుకున్నారు. మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి తన అల్లుడు కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను కలిశానని, వ్యాపార ప్రయోజనాల కోసమేనని చెప్పారు. అంతకు ముందు ఆయన అల్లుడు, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డికి చెందిన కాలేజీలోని కొన్ని భవనాలను రాష్ట్ర ప్రభుత్వం కూల్చివేసింది.

కాంగ్రెస్‌లో అధికారికంగా చేరిన తొలి ఎమ్మెల్యే దానం నాగేందర్. ఎంపీలు వెంకటేష్ నేత, పసునూరు దయాకర్, జి రంజిత్ రెడ్డి కూడా కాంగ్రెస్‌లో చేరారు. దశాబ్ద కాలంగా తెలంగాణ రాష్ట్రంలో తిరుగులేని నాయకుడిగా పేరు తెచ్చుకున్న కేసీఆర్ ఈ పరిణాలని నిశితంగా పరిశీలిస్తున్నారు. అయినప్పటికీ కేసీఆర్ పెద్దగా సీరియస్ గా తీసుకోవట్లేదని తెలుస్తుంది. గతంలో కేసీఆర్ టీడీపీ నుంచి బయటకు వచ్చిన విషయం తెలుసు. రేవంత్ రెడ్డి టీడీపీలోకి వెళ్లకముందు టీఆర్‌ఎస్‌లో ఎమ్మెల్సీగా పనిచేశారు. అయితే తమ రాజ్యంలో సైనికులు ఒక్కొక్కరు బయటకు వెళ్తున్నారు అంటే అది కేసీఆర్ బలహీనత కాకపోయి ఉండొచ్చు. అధికార పార్టీలోకి ఇతర నేతలు సహజంగానే వెళ్లాలనుకుంటారు. పోరాట యోధుడైన కేసీఆర్ మాత్రం పార్టీని పునర్నిర్మించడంపై తప్పకుండా దృష్టి సారిస్తారని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఐదేళ్ల పదవికి దూరంగా ఉండటం వల్ల బలమైన క్యాడర్‌ను నిర్మించుకోవడానికి గులాబీ పార్టీకి అవకాశం లభించినట్లయింది. బిఆర్‌ఎస్‌కు ప్రజల ఆదరణ లభించడానికి ఇది ఒక అవకాశం.

మరోవైపు బీఆర్‌ఎస్‌ నుంచి నేతలను గద్దె దించేందుకు బీజేపీ తన వద్ద దాచుకున్న అస్త్రాలను బయటకు తీస్తోంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆయన కుమార్తెను ఈడీ అదుపులోకి తీసుకుంది. అయితే లోక్‌సభ ఎన్నికల కోసమే కవితను అరెస్ట్ చేశారన్న విమర్శలు వస్తున్నప్పటికీ ఇప్పటివరకు గులాబీ బాస్ ఒక్క స్టేట్మెంట్ ఇవ్వకపోవడం వెనుక కారణాలు లేకపోలేదని చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులు.కేసీఆర్‌ను చావుదెబ్బ కొట్టాలని బీజేపీ భావిస్తే, కాంగ్రెస్ మాత్రం ఇది కేవలం రాజకీయ లబ్ది మాత్రమేనని ఆరోపిస్తుంది. మరి ప్రజాఉద్యమం నుంచి ఎదిగిన కేసీఆర్ తన పార్టీలో ఎవరు ఉన్నా, ఎవరు వెళ్లినా తమను తాము బలంగా మార్చుకుని పోరాటం చేసేందుకు కేసీఆర్ కు దొరికిన సరైన అవకాశంగా భావిస్తున్నారు.

Also Read: Modi Speech In Praja Galam : ఏపీ ప్రజల హక్కుల కోసం చంద్రబాబు, పవన్ పోరాడుతున్నారు – మోడీ


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ARREST
  • bjp
  • brs
  • cadre
  • congress
  • kavitha
  • kcr
  • political analysis
  • telangana

Related News

Heavy Rains

Alert : 13న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు!

Alert : ఆంధ్రప్రదేశ్ మాదిరిగానే తెలంగాణలో కూడా ఈ అల్పపీడనం తీవ్ర ప్రభావం చూపనుంది. ముఖ్యంగా సెప్టెంబర్ 13 తర్వాత వర్షాలు భారీగా కురిసే అవకాశం ఉంది

  • Kavitha Comments Harish

    Kavitha Vs Harish : నాపై చేసిన ఆరోపణలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నా..కవిత కు ఇన్ డైరెక్ట్ కౌంటర్ ఇచ్చిన హరీశ్

  • Cbi Director

    CBI : హైదరాబాద్ కు సీబీఐ డైరెక్టర్.. కారణం అదేనా..?

  • Hyderabad

    Hyderabad: గ్రేటర్‌లో నిమజ్జనానికి సర్వం సన్నద్ధం!

  • Harish Rao

    Harish Rao: లండ‌న్‌లో జ‌రిగిన మీట్ అండ్ గ్రీట్ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న హ‌రీష్ రావు!

Latest News

  • MMTS Trains: రైల్వే ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్‌.. ఉద‌యం 4 గంట‌ల వ‌ర‌కు రైళ్లు!

  • Gautam Gambhir: టీమిండియాలో జోష్ నింపిన గౌతం గంభీర్‌.. ఏం చేశారంటే?

  • Bullet 350: జీఎస్‌టీ రేట్లలో మార్పులు.. ఈ బైక్‌పై భారీగా త‌గ్గుద‌ల‌!

  • GST Reforms Impact: హోట‌ల్స్ రూమ్స్‌లో ఉండేవారికి గుడ్ న్యూస్‌!

  • PM Modi: మ‌రో దేశ అధ్యక్షుడితో ప్ర‌ధాని మోదీ చ‌ర్చ‌లు.. ఎందుకంటే?

Trending News

    • Lunar Eclipse: రేపే చంద్ర‌గ్ర‌హ‌ణం.. ఏ దేశాల‌పై ప్ర‌భావం అంటే?

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd