HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Kcrs Silence About Cadre Exit From Brs

Telangana: జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న గులాబీ బాస్

తెలంగాణలో రాజకీయ పరిస్థితులు మారిపోతున్నాయి. రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ మొదలు పెట్టింది. పార్టీలోకి వచ్చే వారికోసం అధినాయకత్వం తలుపు తెరిచి ఉంచింది. ఈ నేపథ్యంలో నేతల చేరికలు ఊపందుకున్నాయి.

  • By Praveen Aluthuru Published Date - 07:14 PM, Sun - 17 March 24
  • daily-hunt
Telangana
Telangana

Telangana: తెలంగాణలో రాజకీయ పరిస్థితులు మారిపోతున్నాయి. రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ మొదలు పెట్టింది. పార్టీలోకి వచ్చే వారికోసం అధినాయకత్వం తలుపు తెరిచి ఉంచింది. ఈ నేపథ్యంలో నేతల చేరికలు ఊపందుకున్నాయి. గత నెల రోజులుగా చిన్న చితకా నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకోగా, గత రెండ్రోజుల్లో కీలక నేతలు హస్తం గూటికి చేరారు.

రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి ఎన్నికైనప్పటి నుండి పలువురు శాసనసభ్యులు ముఖ్యమంత్రిని కలిశారు. వెళ్లిన తొలి బ్యాచ్ ఎమ్మెల్యేల్లో మెదక్ జిల్లాకు చెందిన నలుగురు ఉన్నారు. కొత్త ప్రభాకర్ రెడ్డి, సునీతా లక్ష్మా రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, కె మాణిక్ రావు ఉన్నారు. అయితే వారంతా ఈ భేటీని కేవలం మర్యాదపూర్వక భేటీగా చెప్పుకొచ్చారు. ఆ తర్వాత చాలా మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ ని కలవడం, మర్యాదపూర్వకంగా అనే చెప్పడం కామన్ అయిపోయింది.

రేవంత్‌రెడ్డిని కలిసిన బీఆర్‌ఎస్‌కు చెందిన పలువురు ఎమ్మెల్యేలలో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు ఒకరు. ఎమ్మెల్యే ముఖ్యమంత్రిని కలవడం చాలా సాధారణమని అన్నారు. అనంతరం ఇందిరమ్మ ఇండ్లు ఆవిష్కరణ కార్యక్రమంలో సీఎంతో కలిసి వేదిక పంచుకున్నారు. మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి తన అల్లుడు కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను కలిశానని, వ్యాపార ప్రయోజనాల కోసమేనని చెప్పారు. అంతకు ముందు ఆయన అల్లుడు, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డికి చెందిన కాలేజీలోని కొన్ని భవనాలను రాష్ట్ర ప్రభుత్వం కూల్చివేసింది.

కాంగ్రెస్‌లో అధికారికంగా చేరిన తొలి ఎమ్మెల్యే దానం నాగేందర్. ఎంపీలు వెంకటేష్ నేత, పసునూరు దయాకర్, జి రంజిత్ రెడ్డి కూడా కాంగ్రెస్‌లో చేరారు. దశాబ్ద కాలంగా తెలంగాణ రాష్ట్రంలో తిరుగులేని నాయకుడిగా పేరు తెచ్చుకున్న కేసీఆర్ ఈ పరిణాలని నిశితంగా పరిశీలిస్తున్నారు. అయినప్పటికీ కేసీఆర్ పెద్దగా సీరియస్ గా తీసుకోవట్లేదని తెలుస్తుంది. గతంలో కేసీఆర్ టీడీపీ నుంచి బయటకు వచ్చిన విషయం తెలుసు. రేవంత్ రెడ్డి టీడీపీలోకి వెళ్లకముందు టీఆర్‌ఎస్‌లో ఎమ్మెల్సీగా పనిచేశారు. అయితే తమ రాజ్యంలో సైనికులు ఒక్కొక్కరు బయటకు వెళ్తున్నారు అంటే అది కేసీఆర్ బలహీనత కాకపోయి ఉండొచ్చు. అధికార పార్టీలోకి ఇతర నేతలు సహజంగానే వెళ్లాలనుకుంటారు. పోరాట యోధుడైన కేసీఆర్ మాత్రం పార్టీని పునర్నిర్మించడంపై తప్పకుండా దృష్టి సారిస్తారని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఐదేళ్ల పదవికి దూరంగా ఉండటం వల్ల బలమైన క్యాడర్‌ను నిర్మించుకోవడానికి గులాబీ పార్టీకి అవకాశం లభించినట్లయింది. బిఆర్‌ఎస్‌కు ప్రజల ఆదరణ లభించడానికి ఇది ఒక అవకాశం.

మరోవైపు బీఆర్‌ఎస్‌ నుంచి నేతలను గద్దె దించేందుకు బీజేపీ తన వద్ద దాచుకున్న అస్త్రాలను బయటకు తీస్తోంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆయన కుమార్తెను ఈడీ అదుపులోకి తీసుకుంది. అయితే లోక్‌సభ ఎన్నికల కోసమే కవితను అరెస్ట్ చేశారన్న విమర్శలు వస్తున్నప్పటికీ ఇప్పటివరకు గులాబీ బాస్ ఒక్క స్టేట్మెంట్ ఇవ్వకపోవడం వెనుక కారణాలు లేకపోలేదని చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులు.కేసీఆర్‌ను చావుదెబ్బ కొట్టాలని బీజేపీ భావిస్తే, కాంగ్రెస్ మాత్రం ఇది కేవలం రాజకీయ లబ్ది మాత్రమేనని ఆరోపిస్తుంది. మరి ప్రజాఉద్యమం నుంచి ఎదిగిన కేసీఆర్ తన పార్టీలో ఎవరు ఉన్నా, ఎవరు వెళ్లినా తమను తాము బలంగా మార్చుకుని పోరాటం చేసేందుకు కేసీఆర్ కు దొరికిన సరైన అవకాశంగా భావిస్తున్నారు.

Also Read: Modi Speech In Praja Galam : ఏపీ ప్రజల హక్కుల కోసం చంద్రబాబు, పవన్ పోరాడుతున్నారు – మోడీ


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ARREST
  • bjp
  • brs
  • cadre
  • congress
  • kavitha
  • kcr
  • political analysis
  • telangana

Related News

Private Colleges

Private Colleges: ఫీజు బకాయిల సమస్యకు తెర.. ప్రైవేట్ కాలేజీల సమ్మె విరమణ!

చర్చలు సఫలం కావడంతో నవంబర్ 8న అనుకున్న లెక్చరర్ల ప్రదర్శన (యాక్షన్ ప్లాన్), అలాగే నవంబర్ 15న విద్యార్థులతో చేపట్టాలనుకున్న కార్యక్రమాలను రద్దు చేసుకుంటున్నట్టు పాతి సంఘం జనరల్ సెక్రెటరీ రవికుమార్ తెలిపారు.

  • Maganti Sunitha

    Maganti Sunitha: మాగంటి సునీత‌కు కేటీఆర్ మద్దతు వెనక రియల్ లైఫ్ డ్రామా?

  • Minister Uttam

    Minister Uttam: అభివృద్ధి, సంక్షేమం కోసం నవీన్ యాదవ్‌కు మద్దతు ఇవ్వండి: మంత్రి ఉత్తమ్

  • 42 Percent Reservation

    Jubilee Hills By Election : బిజెపి, బిఆర్ఎస్ కుమ్మక్కు – మంత్రి పొన్నం

  • Jublihils Campign

    Jubilee Hills By Election : నగరవాసులకు కొత్త కష్టాలు

Latest News

  • Maganti Gopinath Assets : మాగంటి గోపీనాథ్ ఆస్తుల పై ఆ ఇద్దరి కన్ను – బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

  • Ration Cards Alert: ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్

  • Nuclear Testing: అణు పరీక్షల ప్రకటనతో ప్రపంచంలో కలకలం!

  • Dismissed On 99: టెస్టుల్లో అత్యధిక సార్లు 99 పరుగుల వ‌ద్ద‌ అవుటైన భారత బ్యాట్స్‌మెన్లు వీరే!

  • Pitch Report: ఐదో టీ20లో టీమిండియా గెలుస్తుందా? పిచ్ రిపోర్ట్ ఇదే!

Trending News

    • HDFC Bank: హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త!

    • Sanju Samson: సంజు శాంసన్ ట్రేడ్ రేస్‌లోకి సీఎస్కే!

    • Common Voter: వల్లభనేని వంశీ, కొడాలి నాని తీరుపై కామ‌న్ మ్యాన్ ఫైర్!

    • MS Dhoni Retirement: ఐపీఎల్ నుంచి ధోని రిటైర్ అవుతున్నాడా?

    • Virat Kohli Net Worth: టీమిండియా స్టార్ క్రికెట‌ర్ కోహ్లీ నిక‌ర విలువ ఎంతో తెలుసా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd