HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Kcr To Meet Mamata Banerjee Take Fight To Bjp Ruled States

Mamta Banerjee : త్వ‌ర‌లో బెంగాల్ కు సీఎం కేసీఆర్, తెలంగాణ మోడ‌ల్ ఫోక‌స్!

గుజ‌రాత్ మోడ‌ల్ ను చూప‌డం ద్వారా 2014 ఎన్నిక‌ల్లో మోడీ ప్ర‌ధాని పీఠాన్ని అందుకున్నారు. సేమ్ టూ సేమ్ అదే పంథాను తెలంగాణ సీఎం కేసీఆర్ అనుస‌రిస్తున్నారు.

  • Author : CS Rao Date : 02-09-2022 - 1:25 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kcr And Mamatha
Kcr And Mamatha

గుజ‌రాత్ మోడ‌ల్ ను చూప‌డం ద్వారా 2014 ఎన్నిక‌ల్లో మోడీ ప్ర‌ధాని పీఠాన్ని అందుకున్నారు. సేమ్ టూ సేమ్ అదే పంథాను తెలంగాణ సీఎం కేసీఆర్ అనుస‌రిస్తున్నారు. తెలంగాణ మోడ‌ల్ ను దేశానికి చూప‌డం ద్వారా 2024 ఎన్నిక‌ల్లో ప్ర‌ధాని పీఠాన్ని ముద్దాడాల‌ని ఉవ్విళ్లూరుతున్నారు. ఆ క్ర‌మంలో దేశంలోని బీజేపీయేత‌ర పాలిత రాష్ట్రాల‌కు ఆయ‌న వెళుతున్నారు. అక్క‌డి సీఎంల‌కు తెలంగాణ అభివృద్ధి మోడ‌ల్ ను చూపిస్తున్నారు. వాళ్ల నుంచి ప్ర‌శంస‌ల‌ను అందుకుంటున్నారు. బీహార్ సీఎం నితీష్ కుమార్ తెలంగాణ అభివృద్ధి మోడ‌ల్ ను పొగ‌డ్త‌ల‌తో ముంచెత్త‌డంతో కేసీఆర్ దూకుడు పెంచారు. జాతీయ వ్య‌వ‌సాయ విధానం దిశ‌గా అడుగులు వేస్తున్నారు.

ఇప్ప‌టికే 26 రాష్ట్రాల‌కు చెందిన రైతు నాయ‌కుల‌తో స‌మావేశ‌మైన కేసీఆర్ వాళ్లలోని కొంద‌ర్ని వ‌చ్చే ఎన్నిక‌ల బ‌రిలోకి దింపాల‌ని మాస్ట‌ర్ స్కెచ్ వేస్తున్నారు. హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌, గుజ‌రాత్‌, క‌ర్నాట‌ర రాష్ట్రాల్లోని కొన్ని అసెంబ్లీ స్థానాల్లో రైతు నాయ‌కుల‌ను అభ్య‌ర్థులుగా పెట్టాల‌ని యోచిస్తున్నారు. అందుకోసం ఆయా రాష్ట్రాల్లోని బీజేపీయేత‌ర పార్టీల మ‌ద్ద‌తును కూడ‌గ‌ట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అందుకోసం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కలిసేందుకు సిద్ధం అయ్యారు. గాల్వాన్ లోయలో మరణించిన ఇద్దరు సైనికుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించేందుకు కేసీఆర్ త్వ‌ర‌లోనే ఆ రాష్ట్రానికి వెళ్ల‌నున్నారు. బెంగాల్ పర్యటన తర్వాత బిజెపి పాలిత రాష్ట్రాలైన గుజరాత్, కర్ణాటక , హిమాచల్ ప్రదేశ్‌లను సందర్శిస్తారు. అక్కడ అతను రైతు సంఘాలు, ఇతర సంస్థల నాయకులతో సమావేశమై “తెలంగాణ మోడల్” సంక్షేమ కార్యక్రమాలను ప్రదర్శిస్తాడు.

ఆయా రాష్ట్రాల్లో రైతు బంధు, బీమా త‌దిత‌ర‌ పథకాలను ఎజెండాగా చేసుకుని అసెంబ్లీ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థులను నిలబెట్టడానికి ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ట‌. స్వతంత్రులకు మద్దతు ఇవ్వడం ప్రతిపక్ష భాగస్వాములపై ​​ప్రభావం చూపదా అని అడిగిన ప్రశ్నకు, రెండు లేదా మూడు స్థానాల్లో రైతు నాయకులకు మద్దతు ఇచ్చేలా బిజెపియేతర పార్టీలను సంప్రదించి వారిని ఒప్పించాలని సిఎం భావిస్తున్నారని టీఆర్ఎస్ వ‌ర్గాల నుంచి వ‌స్తోన్న స‌మాచారం. హిమాచల్ ప్రదేశ్‌లో నవంబర్‌లో, గుజరాత్‌లో డిసెంబర్‌లో, కర్ణాటకలో వచ్చే మేలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. “బీజేపీ ముక్త్ భారత్” అనే నినాదంతో ఈ రాష్ట్రాల్లో రాజకీయ కార్యకలాపాలు చేపట్టాలని కేసీఆర్‌ భావిస్తున్నారు.

రాబోవు రోజుల్లోనూ రాష్ట్రాలకు కేసీఆర్ పర్యటన కొనసాగనుంది. రైతుల సంక్షేమం కోసం తెలంగాణ మోడల్‌ను అమలు చేసేందుకు జాతీయ స్థాయిలో రైతు ఐక్యవేదికను ప్రారంభించాల‌ని యోచిస్తున్నారు. తెలంగాణ మోడల్‌ను దేశవ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ రైతు ఉద్యమానికి నాయకత్వం వహించాలని ఇటీవల ప్రగతి భవన్‌లో జరిగిన సమావేశంలో 25 రాష్ట్రాల రైతు నాయకులు చేసిన తీర్మానానం చేసిన విషయం విదిత‌మే.

ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడి తెలంగాణను సాధించుకున్న ఏకైక నేతగా కేసీఆర్‌ చరిత్రలో నిలిచిపోతారని ఆయా రాష్ట్రాల సీఎంలు ఇస్తోన్న ప్ర‌శంస కేసీఆర్ ను మ‌రింత దూకుడుగా ముందుకు వెళ్ల‌డానికి ఉప‌యోగ‌ప‌డుతోంది. దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా ఉన్న తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు జాతీయ స్థాయి ప్ర‌చారాన్ని చేయ‌డం ద్వారా ప్ర‌ధాని పీఠాన్ని అందుకోవాల‌ని కేసీఆర్ చేస్తోన్న ప్ర‌య‌త్నం ఎంత వ‌ర‌కు ఫ‌లిస్తుందో చూడాలి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CM Nitish Kumar
  • Galwan Valley
  • mamata banerjee
  • telangana
  • Telangana CM KCR

Related News

Farmers should not rush into paddy transplantation – Ministers issue a crucial warning to farmers.

El Nino Effect: రైతులు తొందరపడి వరి నాట్లు వేయొద్దు.. రైతులకు మంత్రుల కీలక హెచ్చరిక

తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది గతంలో ఎన్నడూ లేనంతగా ‘ఎల్నినో’ (El Niño) ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉన్నందున, రైతులు తొందరపడి వరి నాట్లు వేయవద్దని హెచ్చరించారు. ఇప్పటికే రాష్ట్రంలోని ప్రధాన రిజర్వాయర్లలో నీటి మట్టాలు అడుగంటిపోయాయని, సాగునీరు అందిం

  • Smart Ration Cards in Telangana

    Ration Card: తెలంగాణలో స్మార్ట్ రేషన్‌ కార్డులు

  • Good news for liquor lovers in Telangana.

    Hyderabad: తెలంగాణలో మద్యం ప్రియులకు గుడ్‌ న్యూస్‌

  • Who is Koel Mallick? Another setback for Mamata Banerjee... TMC leader resigns from Rajya Sabha seat.

    Koel Mallick: కోయెల్ మల్లిక్ ఎవరు? మమతా బెనర్జీకి మరో ఎదురుదెబ్బ.. రాజ్యసభ ఎంపీ పదవికి టీఎంసీ నేత రాజీనామా

  • Groundwater levels falling in Telangana... Is a water crisis inevitable this summer?

    Water Scarcity: తెలంగాణలో పడిపోతున్న భూగర్భజలాలు.. ఈ వేసవిలో నీటి ఎద్దడి తప్పదా..?

Latest News

  • Kuwait desalination plant: ఇరాన్ దాడి తర్వాత కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం..

  • Russia Ukraine War: ఉక్రెయిన్‌పై రష్యా అతిపెద్ద దాడికి గల 4 కారణాలు ఇవే

  • SSRajamouli: వారణాసి సినిమాలో పీవీ సింధు

  • Anurag Dhankar: పోలీసు ప్రధాన కార్యాలయంలో త్రిపుర డీజీపీ అనురాగ్ ధంకర్ మృతి

  • Rohit Sharma: రిటైర్మెంట్ పై మౌనం వీడిన రోహిత్ శర్మ: ‘నేను వెళ్ళిపోవడం లేదు…

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd