HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Kalvakuntla Family Trying To Enter Ap Politics

KCR and AP Politics : ఏపీలో ఎంట్రీకి `క‌ల్వకుంట్ల‌`అస్త్ర‌శ‌స్త్రాలు!

ఏదో ఒక రూపంలో ఏపీ ప‌రిస్థితిని కించ‌ప‌రిచేలా టీఆర్ఎస్ అగ్ర‌నేత‌లు మాట్లాడుతున్నారు.

  • Author : CS Rao Date : 30-09-2022 - 12:05 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kcr, Ktr, Kavitha, Trs
Kcr, Ktr, Kavitha, Trs

ఏదో ఒక రూపంలో ఏపీ ప‌రిస్థితిని కించ‌ప‌రిచేలా టీఆర్ఎస్ అగ్ర‌నేత‌లు మాట్లాడుతున్నారు. ఏడాది కాలంగా ఇలాంటి విమ‌ర్శ‌లు అప్పుడ‌ప్పుడు అసెంబ్లీ లోపల‌, బ‌య‌ట వినిపిస్తున్నారు. ఇదంతా దీర్ఘ‌కాలిక రాజ‌కీయ ఎత్తుగ‌డ‌లో భాగంగా చేస్తోన్న వ్య‌వ‌హారం మాదిరిగా ఇప్పుడిప్పుడే బ‌య‌ట‌కు వ‌స్తోంది. ఏపీలోకి ఎంట్రీ ఇవ్వాల‌ని ప్లాన్ చేస్తోన్న కేసీఆర్ అండ్ టీమ్ తాజాగా ఏపీ టీచ‌ర్లు, ఉద్యోగుల గురించి ప్ర‌స్తావించారు. ఆ రాష్ట్రంలో క‌ర్క‌శంగా టీచ‌ర్లు, ఉద్యోగుల‌పై జ‌గ‌న్ స‌ర్కార్ ఉంటుంద‌ని వ్యాఖ్యానించ‌డం ఇరు రాష్ట్రాల్లోనూ దుమారం రేగుతోంది.

ప్ర‌భుత్వాల‌కు తెల్ల ఏనుగు మాదిరిగా టీచ‌ర్లు, ఉద్యోగుల బ‌డ్జెట్ ఉంది. తెలంగాణ‌, ఏపీ రాష్ట్రాల బ‌డ్జెట్ మొత్తంలో 70శాతానికి పైగా పెన్ష‌న్లు, జీతాలు ఇత‌ర‌త్రా అల‌వెన్స్ ల రూపంలో ఖ‌ర్చు పెడుతున్నారు. ఉమ్మ‌డి రాష్ట్రం విడిపోయిన త‌రువాత పోటీప‌డి ఆనాడు కేసీఆర్, చంద్ర‌బాబులు ఫిట్మెంట్ ను ఇచ్చారు. ఆ త‌రువాత పీఆర్సీ అంటూ ప్ర‌భుత్వాల‌పై ఒత్తిడి తీసుకురావ‌డం ఉద్యోగుల‌కు రాజ్యాంగం క‌ల్పించిన హ‌క్కుగా భావిస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు 70శాతం ఫిట్మెంట్ ఇచ్చామ‌ని మంత్రి హ‌రీశ్ చెబుతూ తెలంగాణ ప్ర‌భుత్వం ఉద్యోగుల ఫ్రెండ్లీ అంటూ చెప్పుకొచ్చారు. అంటే, మిగిలిన వ‌ర్గాలకు వ్య‌తిరేక‌మ‌ని ప‌రోక్షంగా ఆయ‌న వ్యాఖ్య‌లు ఉన్నాయి.

ఏపీ టీచ‌ర్లు, ఉద్యోగుల‌ను రెచ్చ‌గొట్టేలా మంత్రి హ‌రీశ్ రావు చేసిన వ్యాఖ్యల‌కు ధీటుగా ఏపీ మంత్రి బొత్సా సత్య‌నారాయ‌ణ కౌంట‌ర్ ఇచ్చారు. ఇరు రాష్ట్రాల్లోని ఉద్యోగుల‌కు వ‌స్తోన్న జీతాల‌ను పోల్చుకుని చూద్దాం అంటూ స‌వాల్ విసిరారు. ఇలా, ఏపీ ,తెలంగాణ స‌ర్కార్ టీచ‌ర్లు, ఉద్యోగుల జీతాల‌ను, ఫిట్మెంట్ రాజ‌కీయ అస్త్రంగా మారింది. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఉద్యోగుల‌ను సానుకూలంగా మ‌లుచుకోవ‌డం ఇరు ప్ర‌భుత్వాల ల‌క్ష్యంగా క‌నిపిస్తోంది. బ‌డుగు. బ‌ల‌హీన‌, రైతాంగాన్ని ఆదుకోవ‌డానికి ప్ర‌భుత్వాలు చేసిన కార్య‌క్ర‌మాలు ఏమిటో చ‌ర్చ‌కు పెట్ట‌కుండా ఉద్యోగుల‌కు ఇచ్చే బెనిఫిట్స్ ను తెర‌మీద‌కు తీసుకురావ‌డం గ‌మ‌నార్హం.

ఏపీ ప్ర‌జ‌ల్ని ఆక‌ట్టుకునేలా ప్ర‌త్యేక‌హోదాకు సానుకూలంగా క‌ల్వ‌కుంట్ల కుటుంబం అప్ప‌ట్లో స్పందించింది. అమ‌రావ‌తి ప్రాజెక్టు కూలిపోవ‌డంతో తెలంగాణ‌కు మేలు జ‌రిగింద‌ని మంత్రి హ‌రీశ్ ఒకానొక సంద‌ర్భంలో అక్క‌సు వెళ్ల‌గ‌క్కారు. ఒక‌ప్పుడు ఏపీలో ఎక‌రం అమ్మితే తెలంగాణ‌లో మూడు ఎక‌రాలు వ‌చ్చేద‌ని, ఇప్పుడు రివ‌ర్స్ అయింద‌ని ప‌లుమార్లు అసెంబ్లీ వేదిక‌గా సీఎం కేసీఆర్ ప్ర‌స్తావిస్తూ ఏపీ నేత‌ల చేత‌గానిత‌నాన్ని ఎత్తిచూపారు. విభ‌జ‌న చ‌ట్టంలోని 9, 10 షెడ్యూల్ తాలూకూ ఆస్తుల‌ను ఇవ్వ‌డానికి మెలిక‌పెడుతోన్న కేసీఆర్ స‌ర్కార్ ఏపీలోని రాజ‌కీయ పార్టీల స్వార్థాన్ని బ‌య‌ట‌పెడుతున్నారు. మొత్తం మీద ఏపీ రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇవ్వ‌డానికి స‌ర్వ శ‌స్త్రాల‌ను సిద్ధం చేసిన కేసీఆర్ అండ్ టీమ్ తాజాగా ఉద్యోగులు, టీచ‌ర్ల వ్య‌వ‌హారాన్ని తెర‌మీద‌కు తీసుకురావ‌డం గ‌మ‌నార్హం.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap politics
  • It minister ktr
  • kalvakuntla kavitha
  • Telangana CM KCR
  • YS Jagan Mohan Reddy

Related News

Arava Sridhar Janasena Mla

రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై జనసేన జనసేన అధిష్టానం సీరియస్‌

JanaSena Party  ఏపీ రాజకీయాల్లో కలకలం రేపిన రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంలో జనసేన పార్టీ అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీధర్‌పై ఓ మహిళ చేసిన ఆరోపణలు, విడుదల చేసిన వీడియోల నేపథ్యంలో ఈ అంశంపై విచారణ జరిపేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని నియమించింది. విచారణ పూర్తయ్యేంత వరకు శ్రీధర్‌ను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది. ఈ మేరకు జనసేన పార్ట

  • CM Chandrababu participated in the parliamentary committees workshop

    పార్టీ కంటే ఏదీ ముఖ్యం కాదు.. నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదు : చంద్రబాబు వార్నింగ్

Latest News

  • నాని-సుజిత్ మూవీ క్రేజీ అప్డేట్!

  • అట్లుంటది మోదీ తో.. అర్థమైందా ట్రంప్ రాజా!

  • మద్యం ధరలపై పవన్ ఆగ్రహం !!

  • మోడీ నాయకత్వంపై పవన్ ప్రశంసలు..ఫిదా అంటున్న బిజెపి శ్రేణులు

  • ఏపీని కాపాడండి అంటూ పార్లమెంట్ వద్ద వైసీపీ ఎంపీల ఆందోళన

Trending News

    • టీ20 వరల్డ్ కప్‌.. భారత్-పాక్ మ్యాచ్ జ‌ర‌గ‌కుంటే రూ. 4,500 కోట్ల న‌ష్టం?!

    • వెండి ధరలు ఎందుకు తగ్గుతున్నాయి?

    • పాకిస్థాన్‌పై ఐసీసీ క‌ఠిన చ‌ర్య‌లు?!

    • పీఎఫ్ ఖాతాదారుల‌కు మ‌రో శుభ‌వార్త‌..!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. టీమ్ ఇండియా, ఇండియా A వార్మప్ మ్యాచ్‌ల వివరాలు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd