New Year Event: మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. అర్ధరాత్రి వరకు మెట్రో రైళ్లు..!
కొత్త సంవత్సర వేడుకల (New Year Event) సందర్భంగా హైదరాబాద్ మెట్రో నగరవాసులకు శుభవార్త చెప్పింది.
- By Gopichand Published Date - 10:00 AM, Sun - 31 December 23
New Year Event: కొత్త సంవత్సర వేడుకల (New Year Event) సందర్భంగా హైదరాబాద్ మెట్రో నగరవాసులకు శుభవార్త చెప్పింది. హైదరాబాద్ మెట్రో రైలు (HMR) డిసెంబర్ 31న అర్ధరాత్రి వరకు పనిచేస్తాయని, చివరి రైలు 12:15 గంటలకు బయలుదేరి, జనవరి 1న తెల్లవారుజామున 1:00 గంటల గమ్యస్థానానికి చేరుకుంటుందని ప్రకటించింది. పొడిగించిన సేవా సమయాల్లో భద్రత, క్రమాన్ని నిర్ధారించడానికి, రైళ్లు, స్టేషన్లలో ఎలాంటి దుర్వినియోగం జరగకుండా మెట్రో రైలు భద్రత అప్రమత్తంగా ఉంటుందని హెచ్ఎంఆర్ శనివారం ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది.
సాధారణంగా హైదరాబాద్ మెట్రో రైలు సేవలు అన్ని టెర్మినల్ స్టేషన్లలో ఉదయం 6:00 నుండి రాత్రి 11:00 వరకు నడుస్తున్న విషయం తెలిసిందే. ఆలస్య సమయాల్లో సురక్షిత ప్రయాణ ఏర్పాట్లపై చర్చిస్తూ ప్రయాణికులు అధికారులకు సహకరించాలని, అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం ఇవ్వకుండా బాధ్యతాయుతంగా మెట్రో రైళ్లలో ప్రయాణించాలని ఎల్అండ్టిఎంఆర్హెచ్ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ కెవిబి రెడ్డి విజ్ఞప్తి చేశారు. మెట్రో స్టేషన్లలోకి మద్యం తాగి వచ్చినా, దుర్భాషలాడినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
డ్రగ్స్ టెస్టు కూడా..!
ఇకపోతే న్యూ ఇయర్ సందర్భంగానూ పోలీసులు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలకు సిద్ధంగా ఉన్నారు. ఇందుకు రెండింతలు గట్టిగానే సిద్ధం అవుతున్నారు. ఈ సారి ట్రాఫిక్ పోలీసులు కేవలం ఆల్కహాల్ టెస్ట్ మాత్రమే కాకుండా డ్రగ్స్ టెస్టు కూడా చేయనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా కొనుగోలు చేసిన 50 డ్రగ్ టెస్టు కిట్లను ఉపయోగించనున్నారు. తెలంగాణ రాష్ట్ర యాంటీ నార్కోటిక్స్ బ్యూరో పోలీసులు పలు రకాల డ్రగ్ టెస్టింగ్ పరికరాలను కొనుగోలు చేశారు. వీటిని ఉపయోగించి ఫామ్ హౌజ్లు, పబ్లు, రిసార్ట్లు, పార్టీలు చేసుకునే ఇతర ప్రాంతాల్లోనూ టెస్టులు చేయనున్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లకు ఈ డ్రగ్ టెస్టు కిట్లు అందాయి.
We’re now on WhatsApp. Click to Join.
Tags
Related News
Hyderabad: అమిత్ షా మీటింగ్ లో పిల్లలు, కేసు నమోదు
కేంద్ర మంత్రి అమిత్ షా, హైదరాబాద్ బీజేపీ లోక్సభ అభ్యర్థి మాధవీలత, గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్, బిజెపి రాష్ట్ర చీఫ్ కిషన్ రెడ్డి, యమన్ సింగ్ తదితరులపై కేసు నమోదైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన సభలో పిల్లలను పాల్గొనేలా చేసినందుకు మొగల్పురా పోలీసులు కేసు నమోదు చేశారు.