Telangana Elections 2023 : ఖమ్మంలో భారీగా నగదు, మద్యం, బాణసంచా స్వాధీనం
తెలంగాణ ఎన్నికలకు ఉచితంగా పంపిణీ చేసేందుకు రూ.5,01,58,457 నగదు, 35,313 లీటర్ల మద్యం, సుమారు రూ.1.10 కోట్ల
- Author : Prasad
Date : 13-11-2023 - 1:52 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ ఎన్నికలకు ఉచితంగా పంపిణీ చేసేందుకు రూ.5,01,58,457 నగదు, 35,313 లీటర్ల మద్యం, సుమారు రూ.1.10 కోట్ల విలువైన 437 కిలోల గంజాయి, రూ.18.12 లక్షల విలువైన బాణాసంచా స్వాధీనం చేసుకున్నారు. ఓటర్లను ప్రలోభపెట్టేందకు అభ్యర్థులు, ప్రధాన పార్టీలు నగదు, మద్యం విచ్చలవిడిగా పంపిణీ చేస్తున్నారు. ఎన్నికల సంఘం, పోలీసులు నిఘా పెట్టినప్పటికి ఓటర్లుకు డబ్బు, మద్యం చేరుతున్నాయి.రానున్న అసెంబ్లీ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు ఖమ్మం కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వీపీ గౌతమ్ తెలిపారు. ఖమ్మం జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలైన ఖమ్మం, పాలేరు, మధిర, వైరా, సత్తుపల్లి నియోజకవర్గాలకు నవంబర్ 30న ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 11 వరకు ఖమ్మంలో మొత్తం 12,16,796 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 5,89,165 మంది పురుషులు, 6,27,553 మంది మహిళలు, 78 మంది ట్రాన్స్జెండ ఓటర్లు ఉన్నారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 1456 పోలింగ్ కేంద్రాలకు గాను 390 కేంద్రాలను ‘క్లిష్టమైన’గా గుర్తించారు. నవంబర్ 30న 1295 పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ ప్రక్రియ వెబ్కాస్టింగ్ జరుగుతుంది. (ఖమ్మం, పాలేరు నియోజకవర్గాలకు తుషార్ కాంత మొహంతి, మధిర, వైరా నియజకవర్గాలకు కానారామ్, సత్తుపల్లి నియోజకవర్గానికి సతేంద్ర సింగ్ లను ఎన్నికల సంఘం జనరల్ అబ్జర్వర్లుగా నియమించింది.
Also Read: AP News: టీడీపీ నేతపై వైసీపీ దాడి.. నారా లోకేష్ గరం