Free Scheme : బస్సుల కోసం పడిగాపులు…ఫ్రీ అంటే ఇదేనేమో..!
- By Sudheer Published Date - 02:53 PM, Thu - 28 December 23
ఫ్రీ (Free) అంటే ..ఇదా..? ప్రజలు కోరుకున్న మార్పు ఇదేనా..? కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) వస్తే ఇలా ఉంటుందా..? ఇందుకోసమేనా..రేవంత్
(CM Revanth )ను గెలిపించుకున్నాం..? డబ్బులు పోయిన మంచిదే కానీ ఫ్రీ బస్సు (Free Bus) సౌకర్యం లేనప్పుడే బాగుంది..ఇందుకు ఈ కష్టాలు..గంట నుండి ఒక్క బస్సు రాలేదు..బస్సు కోసం వందలమంది ఎదురుచూస్తున్నారు..ఇది ప్రస్తుతం ఏ బస్టాండ్ కు వెళ్లిన ప్రయాణికులు చెప్పే మాట. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించింది..ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఆ తర్వాత బస్సులను తగ్గించడం మొదలుపెట్టింది.
ముఖ్యంగా ఖమ్మం (Khammam) జిల్లాలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు..మాములుగా కొత్తగూడెం, భద్రాచలం, ఇల్లేందు , సత్తుపల్లి ఇలా ఎక్కడకికి వెళ్లాలన్న ప్రతి 15 నిమిషాలకు ఓ బస్సు సౌకర్యం ఉండేది..కానీ ఫ్రీ బస్సు పధకం వచ్చిన దగ్గరినుండి గంటకో బస్సు కూడా అందుబాటులో ఉండడంలేదు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఫ్రీ పధకం లేనప్పుడే బస్సులు మంచిగా ఉండవని..డబ్బులు పెట్టైనా ప్రశాంతంగా కూర్చుని వెళ్ళేవాళ్ళం కానీ ఇప్పుడు బస్సులే లేకుండా అయిపోయాయని వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ను గెలిపించి కష్టాలు తెచ్చుకున్నట్లు అయ్యిందని , బిఆర్ఎస్ ప్రభుత్వమే బాగుందని..అడ్డుగోలు పధకాలు తెచ్చి..దానికి సరిపడా బస్సులు పెట్టకుండా ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని సీఎం రేవంత్ ఫై మండిపడుతున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
మరోపక్క మహిళలు సైతం వారి విన్నపాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తున్నారు. ” రేవంత్ అన్నా మాకు ఈ మహాలక్ష్మి పథకం వద్దు. దీనివల్ల ఎంతో మంది మహిళలు, కాలేజీ అమ్మాయిలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఫ్రీ ప్రయాణం వల్ల రద్దీ ఎక్కువగా ఉండటంతో మేము బస్సుల్లో రోజు డోర్లో నిల్చొని పోవాల్సిన పరిస్థితి వచ్చింది. చాలా కష్టంగా ఉంది. ఈ పథకాన్ని తీసేసి ఏమీ లేని నిరుపేదలకు ఏదైనా సహాయం చేయండి” అంటూ మహిళలు తమ ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తం మీద ఫ్రీ అంటే అస్సలు బస్సులే లేకుండా చేయడం అని బిఆర్ఎస్ నేతలు కౌంటర్లు, సైటర్లు వేస్తున్నారు.
Read Also : Bhatti: తొమ్మిదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు : డిప్యూటీ సీఎం భట్టి
Related News
Election Campaign : తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ఎన్నికల ప్రచారం
ఎన్నికల ప్రచారం ముగియడంతో బైట నుంచి వచ్చిన వారంతా ఎన్నికల ప్రదేశాలనుంచి వెళ్లి పోవాలని ఈసీ ఆదేశించింది. కేవలం ఆ గ్రామం, నియోజక వర్గం, స్థానికంగా ఓటు హక్కు ఉన్న వారు మాత్రమే ఉండాలని మిగతా వారు మాత్రం వెళ్లిపోవాలని ఈసీ స్పష్టం చేసింది