Four Died: కొత్తగూడెం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం
కొత్తగూడెం జిల్లాలో శుక్రవారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఈ ఘటనలో కారు-లారీ ఢీకొట్టింది. నలుగురు మృతి చెందారు. ఇల్లందు- మహబూబాబాద్ మధ్య కోటి లింగాల సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు.
- By Gopichand Published Date - 07:15 AM, Sat - 21 January 23
కొత్తగూడెం జిల్లాలో శుక్రవారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఈ ఘటనలో కారు-లారీ ఢీకొట్టింది. నలుగురు మృతి చెందారు. ఇల్లందు- మహబూబాబాద్ మధ్య కోటి లింగాల సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. కారు నడుపుతున్న వ్యక్తితో పాటు ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో గాయపడిన మరో వ్యక్తిని ఇల్లందు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.
Also Read: 9 Injured : నోయిడా ఎయిర్పోర్ట్ వద్ద పేలిన సిలిండర్.. 9 మందికి గాయాలు
మరొకరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఖమ్మంలోని ఆస్పత్రికి తరలించారు. వీరు ప్రయాణిస్తున్న కారును వేగంగా వచ్చిన లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులు హనుమకొండ జిల్లాకు కమలాపూర్ కు చెందిన అరవింద్, వరంగల్ కు చెందిన రాము, కల్యాణ్, శివగా గుర్తించారు. ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం వీరంతా మోతేకి వెళ్తున్నట్లు సమాచారం. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Related News
KTR: డిసెంబర్ 9 నాడే రుణమాఫీ చేస్తా అని చెప్పిన రేవంత్ ను శిక్షించాలా? వద్దా? : కేటీఆర్
KTR: వరంగల్- ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆలేరు లో జరిగిన సన్నాహాక సమావేశంలో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. ‘‘ఇక్కడి కాంగ్రెస్ అభ్యర్థి జర్నలిజం ముసుగులో ఎన్ని బ్లాక్ మెయిల్ కార్యక్రమాలు చేసినా మనం పట్టించుకోలేదు. ప్రభుత్వం లో ఉండి ఐదునెలల్లో రేవంత్ రెడ్డి ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. అయినప్పటికీ సిగ్గు లేకు�